ETV Bharat / international

వుహాన్​లో తొలిసారి పర్యటించిన జిన్​పింగ్​

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​.. కరోనా వైరస్​కు​ కేంద్రబిందువైన వుహాన్​లో తొలిసారి పర్యటించారు. వైరస్​పై యుద్ధంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకు వుహాన్​ వీధుల్లో మాస్కుతో తిరిగి అభివాదం చేశారు.

author img

By

Published : Mar 10, 2020, 7:32 PM IST

Updated : Mar 10, 2020, 11:21 PM IST

Xi makes first visit to coronavirus-hit Wuhan; vows victory against COVID-19 outbreak
వుహాన్​లో తొలిసారి పర్యటించిన జిన్​పింగ్​
వుహాన్​లో తొలిసారి పర్యటించిన జిన్​పింగ్​

కరోనా వైరస్​కు కేంద్రబిందువైన వుహాన్​లో పర్యటించారు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​. వైరస్​పై యుద్ధంలో వుహాన్​ ప్రజల పాత్రను అభినందించారు. పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేసిన అధ్యక్షుడు.. కరోనాపై పోరులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

హుబే రాష్ట్రంలోని​ వుహాన్​లో జిన్​పింగ్​ పర్యటించడం ఇదే తొలిసారి. ఆయన వెంట ఆరోగ్యశాఖ అధికారులు, సైనికులు ఉన్నారు. తొలుత ఆసుపత్రుల్లోని పరిస్థితులను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్షించిన జిన్​పింగ్​.. అనంతరం వుహాన్​ వీధుల్లో పర్యటించారు. భవనాల్లో ఉన్న వారికి అభివాదం చేసి.. వారిలో ధైర్యం నింపారు.

కరోనా వైరస్​తో చైనా స్తంభించింది. ఇప్పటివరకు 80వేల మందికి కరోనా సోకింది. 3,136మంది మరణించారు.

వైరస్​ విజృంభించిన తొలినాళ్లల్లో.. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి​ చర్యలు తీసుకోలేదని ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు జిన్​పింగ్. అనంతరం ఆసుపత్రి నిర్మాణాలు, వైరస్​ నియంత్రణకు చేసిన కృషితో అనేక మంది నుంచి ప్రశంసలు అందుకున్నారు.

ఇదీ చూడండి:- కరోనాతో ఇరాన్​లో మరణాలు- ఇండోనేసియాలో అరెస్టులు

వుహాన్​లో తొలిసారి పర్యటించిన జిన్​పింగ్​

కరోనా వైరస్​కు కేంద్రబిందువైన వుహాన్​లో పర్యటించారు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​. వైరస్​పై యుద్ధంలో వుహాన్​ ప్రజల పాత్రను అభినందించారు. పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేసిన అధ్యక్షుడు.. కరోనాపై పోరులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

హుబే రాష్ట్రంలోని​ వుహాన్​లో జిన్​పింగ్​ పర్యటించడం ఇదే తొలిసారి. ఆయన వెంట ఆరోగ్యశాఖ అధికారులు, సైనికులు ఉన్నారు. తొలుత ఆసుపత్రుల్లోని పరిస్థితులను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్షించిన జిన్​పింగ్​.. అనంతరం వుహాన్​ వీధుల్లో పర్యటించారు. భవనాల్లో ఉన్న వారికి అభివాదం చేసి.. వారిలో ధైర్యం నింపారు.

కరోనా వైరస్​తో చైనా స్తంభించింది. ఇప్పటివరకు 80వేల మందికి కరోనా సోకింది. 3,136మంది మరణించారు.

వైరస్​ విజృంభించిన తొలినాళ్లల్లో.. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి​ చర్యలు తీసుకోలేదని ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు జిన్​పింగ్. అనంతరం ఆసుపత్రి నిర్మాణాలు, వైరస్​ నియంత్రణకు చేసిన కృషితో అనేక మంది నుంచి ప్రశంసలు అందుకున్నారు.

ఇదీ చూడండి:- కరోనాతో ఇరాన్​లో మరణాలు- ఇండోనేసియాలో అరెస్టులు

Last Updated : Mar 10, 2020, 11:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.