ETV Bharat / international

'కరోనాను ఎదుర్కొనే శక్తి సాధించలేదు!'

author img

By

Published : Jul 24, 2020, 5:29 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ అనుకున్న స్థాయిలో హెర్డ్​ ఇమ్యూనిటీని సాధించలేదని తెలిపారు డబ్ల్యూహెచ్​ఓ ముఖ్య శాస్త్రవేత్త. కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందడానికి జనాభాలో కనీసం 50-60 శాతం మంది హెర్డ్​ ఇమ్యూనిటీ సాధించాలని పేర్కొన్నారు.

who-chief-scientist-sees-no-herd-immunity-yet
కరోనాను ఎదుర్కొనే శక్తి సాధించలేదు!

విశ్వ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తోన్న కరోనా మ‌హమ్మారిని ఎదుర్కొనే మార్గాలపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. కొవిడ్​ను అంతం చేసే వ్యాక్సిన్​ వచ్చేలోపు 'హెర్డ్ ఇమ్యూనిటీ' ద్వారానే వైర‌స్ నుంచి విముక్తి పొందవ‌చ్చ‌నుకున్నాయి చాలా దేశాలు. కానీ, ఇప్ప‌టివ‌రకు అనుకున్న స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించ‌లేద‌ని స్పష్టం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్​ సౌమ్యా స్వామినాథన్.

" కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు.. ప్రజలు శరీరంలో ప్రతిరోధకాలను వృద్ధి చేసుకోవాలి. దాదాపు 60 శాతం జనాభాలో కొంతకాలం రోగనిరోధక శక్తి సంపూర్ణంగా ఉంటేనే.. వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట‌ పడే అవకాశం ఉంటుంది."

-డాక్టర్​ సౌమ్యా స్వామినాథన్

డాక్టర్ సౌమ్య అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో 50-60 శాతం మంది హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాల్సి ఉంది. పలు దేశాలు చేపట్టిన యాంటీబాడీల‌ ప‌రిశోధ‌నల్లో.. కేవలం 5-10 శాతం మంది మాత్రమే హెర్డ్ ఇమ్యూనిటీ కలిగి ఉన్నారు. అతి కొద్ది దేశాల్లోనే 20శాతం జనాభాలో సంపూర్ణ రోగనిరోధక శక్తి ఉంది.

హెర్డ్ ఇమ్యూనిటీ అంటే?

జ‌నాభాలో ఎక్కువ మంది వైర‌స్‌ను త‌ట్టుకునే శ‌క్తిని క‌లిగి ఉండ‌టాన్ని 'హెర్డ్ ఇమ్యూనిటీ'గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ శ‌క్తిని సాధించాలంటే జ‌నాభాలో క‌నీసం 60శాతం మంది వైర‌స్ నుంచి కోలుకొని ఉండ‌ట‌మో లేదా వ్యాక్సిన్ ద్వారా సాధించ‌డ‌మో జ‌ర‌గాలని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, ఇప్పటి వరకు అనేక దేశాల జ‌నాభాలో కేవలం అతి తక్కువ శాతం ప్ర‌జల్లో మాత్రమే క‌రోనా వైర‌స్ యాంటీబాడీస్ వృద్ధిచెందిన‌ట్లు నిరూపిత‌మైంది.

మహమ్మారి ప్రారంభ దశలలో, బ్రిటన్ సహా పలు దేశాలు సహజంగా హెర్డ్​ ఇమ్యూనిటీని పెంపొందించి వైరస్​ను ఎదుర్కొంటామని ప్రతిపాదించాయి. కానీ, అది సాధ్యపడలేదు. ఇప్పుడు వైరస్​ విజృంభించింది. ఈ సమయంలో టీకాల ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం చాలా సురక్షితమని అభిప్రాయపడ్డారు డాక్టర్​ సౌమ్య.

ఇదీ చదవండి : 'కరోనాను దీటుగా ఎదుర్కోగల సత్తా భారత్​ సొంతం'

విశ్వ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తోన్న కరోనా మ‌హమ్మారిని ఎదుర్కొనే మార్గాలపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. కొవిడ్​ను అంతం చేసే వ్యాక్సిన్​ వచ్చేలోపు 'హెర్డ్ ఇమ్యూనిటీ' ద్వారానే వైర‌స్ నుంచి విముక్తి పొందవ‌చ్చ‌నుకున్నాయి చాలా దేశాలు. కానీ, ఇప్ప‌టివ‌రకు అనుకున్న స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించ‌లేద‌ని స్పష్టం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్​ సౌమ్యా స్వామినాథన్.

" కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు.. ప్రజలు శరీరంలో ప్రతిరోధకాలను వృద్ధి చేసుకోవాలి. దాదాపు 60 శాతం జనాభాలో కొంతకాలం రోగనిరోధక శక్తి సంపూర్ణంగా ఉంటేనే.. వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట‌ పడే అవకాశం ఉంటుంది."

-డాక్టర్​ సౌమ్యా స్వామినాథన్

డాక్టర్ సౌమ్య అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో 50-60 శాతం మంది హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాల్సి ఉంది. పలు దేశాలు చేపట్టిన యాంటీబాడీల‌ ప‌రిశోధ‌నల్లో.. కేవలం 5-10 శాతం మంది మాత్రమే హెర్డ్ ఇమ్యూనిటీ కలిగి ఉన్నారు. అతి కొద్ది దేశాల్లోనే 20శాతం జనాభాలో సంపూర్ణ రోగనిరోధక శక్తి ఉంది.

హెర్డ్ ఇమ్యూనిటీ అంటే?

జ‌నాభాలో ఎక్కువ మంది వైర‌స్‌ను త‌ట్టుకునే శ‌క్తిని క‌లిగి ఉండ‌టాన్ని 'హెర్డ్ ఇమ్యూనిటీ'గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ శ‌క్తిని సాధించాలంటే జ‌నాభాలో క‌నీసం 60శాతం మంది వైర‌స్ నుంచి కోలుకొని ఉండ‌ట‌మో లేదా వ్యాక్సిన్ ద్వారా సాధించ‌డ‌మో జ‌ర‌గాలని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, ఇప్పటి వరకు అనేక దేశాల జ‌నాభాలో కేవలం అతి తక్కువ శాతం ప్ర‌జల్లో మాత్రమే క‌రోనా వైర‌స్ యాంటీబాడీస్ వృద్ధిచెందిన‌ట్లు నిరూపిత‌మైంది.

మహమ్మారి ప్రారంభ దశలలో, బ్రిటన్ సహా పలు దేశాలు సహజంగా హెర్డ్​ ఇమ్యూనిటీని పెంపొందించి వైరస్​ను ఎదుర్కొంటామని ప్రతిపాదించాయి. కానీ, అది సాధ్యపడలేదు. ఇప్పుడు వైరస్​ విజృంభించింది. ఈ సమయంలో టీకాల ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం చాలా సురక్షితమని అభిప్రాయపడ్డారు డాక్టర్​ సౌమ్య.

ఇదీ చదవండి : 'కరోనాను దీటుగా ఎదుర్కోగల సత్తా భారత్​ సొంతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.