ETV Bharat / international

భారత్​ ప్రతిస్పందనపై సింగపూర్​ సంతృప్తి - కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ స్పందన

కొవిడ్ వేరియంట్​గా పేర్కొంటూ దిల్లీ సీఎం కేజ్రీవాల్​ చేసిన వ్యాఖ్యలపై భారత్​ ప్రతిస్పందన సంతృప్తికరంగా ఉన్నట్లు సింగపూర్​ ప్రభుత్వం తెలిపింది. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్​ అన్నారు.

Delhi CM
కేజ్రీవాల్​
author img

By

Published : May 19, 2021, 8:45 PM IST

సింగపూర్​లో కరోనా కొత్త వేరియంట్​గా పేర్కొంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ చేసిన వ్యాఖ్యలపై భారత స్పందనను సింగపూర్ ప్రభుత్వం ప్రశంసించింది. భారత్ స్పష్టతకు తాము సంతృప్తి చెందినట్లు పేర్కొంది. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సింగపూర్ హైకమిషనర్​ అన్నారు.

" సింగపూర్​లో వెలుగు చూసిన కరోనా కొత్త రకం పిల్లల్లో ఎక్కువగా ప్రభావం చూపుతోందని తేలింది. అది భారత్​లోకి మూడో దశ రూపంలో రాబోతోంది. కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 1. సింగపూర్​ విమానాలను తక్షణమే రద్దు చేయాలి. 2. పిల్లలకు వ్యాక్సిన్​ అందించే అంశాన్ని పరిశీలించాలి. " అని కేజ్రీవాల్​ ట్వీట్​ చేశారు. ఇది ఇరు దేశాల మధ్య ధౌత్యపరమైన చర్చకు దారితీసింది.

కేజ్రీవాల్​ వ్యాఖ్యలను తప్పుబడుతూ సింగపూర్​ విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో దిల్లీ ముఖ్యమంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​. దేశం తరఫున మాట్లాడాల్సింది దిల్లీ ముఖ్యమంత్రి కాదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: గాజాపై ఇజ్రాయెల్​ దాడులు.. విద్యా సంస్థలు ధ్వంసం

సింగపూర్​లో కరోనా కొత్త వేరియంట్​గా పేర్కొంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ చేసిన వ్యాఖ్యలపై భారత స్పందనను సింగపూర్ ప్రభుత్వం ప్రశంసించింది. భారత్ స్పష్టతకు తాము సంతృప్తి చెందినట్లు పేర్కొంది. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సింగపూర్ హైకమిషనర్​ అన్నారు.

" సింగపూర్​లో వెలుగు చూసిన కరోనా కొత్త రకం పిల్లల్లో ఎక్కువగా ప్రభావం చూపుతోందని తేలింది. అది భారత్​లోకి మూడో దశ రూపంలో రాబోతోంది. కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 1. సింగపూర్​ విమానాలను తక్షణమే రద్దు చేయాలి. 2. పిల్లలకు వ్యాక్సిన్​ అందించే అంశాన్ని పరిశీలించాలి. " అని కేజ్రీవాల్​ ట్వీట్​ చేశారు. ఇది ఇరు దేశాల మధ్య ధౌత్యపరమైన చర్చకు దారితీసింది.

కేజ్రీవాల్​ వ్యాఖ్యలను తప్పుబడుతూ సింగపూర్​ విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో దిల్లీ ముఖ్యమంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​. దేశం తరఫున మాట్లాడాల్సింది దిల్లీ ముఖ్యమంత్రి కాదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: గాజాపై ఇజ్రాయెల్​ దాడులు.. విద్యా సంస్థలు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.