ఆల్ట్రాసౌండ్ ప్రకంపనాలకు పలు రకాల కరోనా వైరస్లు నాశనమయ్యే అవకాశముందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు పేర్కొన్నారు. 25 నుంచి 100 మెగాహెడ్జ్ల ధ్వని ప్రకంపనాలకు వైరస్ కొమ్ములు వాలిపోయి, చిటికెలోనే విరిగిపోతాయని గుర్తించారు. గాలి, నీటిలో ఉండే కరోనా వైరస్లపై ఆల్ట్రాసౌండ్ ప్రకంపనాలు తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. వైరస్ కారణంగా తలెత్తే ఇన్ఫెక్షన్లకు ఈ విధానంలో చికిత్సలను రూపొందించే వీలుందని ప్రొఫెసర్ థామస్ విర్జ్బికి పేర్కొన్నారు.
పరిశోధనలో భాగంగా.. కరోనా వైరస్ భౌతిక గుణాలను నిపుణులు పరిగణనలోకి తీసుకుని, 100 మెగా హెడ్జ్ల ధ్వని ప్రకంపనాలను సృష్టించారు. వైరస్ పెంకుపై ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది కంప్యూటర్ మోడల్ ద్వారా అంచానా వేశారు.
"ఆల్ట్రాసౌండ్ ప్రకంపనాల వల్ల కరోనా వైరస్ చుట్టూ ఉండే పెంకు బద్ధలవుతుంది. దానిపై ఉండే కొమ్ములు ధ్వంసమై విడిపోతాయి. ఇవి స్పష్టంగా బయటకు కనిపించే ప్రభావాలు. అయితే అంతర్లీనంగా వైరస్ ఆర్ఎన్ఏ కూడా దెబ్బతింటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి శబ్ద ప్రకంపనాల కారణంగా వైరస్పై పడే ప్రభావాన్ని మాత్రమే గుర్తించాం. అయితే ఇది ఎలా జరుగుతుందన్నది తెలుసుకోవడానికి మరింత లోతైన అధ్యయనం అవసరం "అని పరిశోధకులు పేర్కొన్నారు. 'మోకానిక్స్ అండ్ ఫిజిక్స్ ఆఫ్ సాలిడ్స్' పత్రిక ఈ వివరాలు అందించింది.
ఇదీ చదవండి:ఈయూ దేశాల్లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీ పునఃప్రారంభం!