ETV Bharat / international

జీ20కి ట్రంప్​: ఉద్రిక్తతలకు తెరపై ఆశలు

జపాన్​లో ఈ వారం జరగనున్న జీ-20 సదస్సులో భాగంగా వేర్వేరు దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భేటీ కానున్నారు. చైనా, రష్యా అధ్యక్షులు జిన్​పింగ్, పుతిన్​తో వాణిజ్య సంబంధాలపై చర్చలు జరపనున్నారు.

author img

By

Published : Jun 25, 2019, 10:16 AM IST

Updated : Jun 25, 2019, 12:11 PM IST

జీ20కి ట్రంప్​: ఉద్రిక్తతలకు తెరపై ఆశలు
జీ20కి ట్రంప్​: ఉద్రిక్తతలకు తెరపై ఆశలు

జపాన్​ ఒసాకాలో ఈ వారం జరగనున్న జీ-20 సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు.

జాబితాలో చాలా మందే...

భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మన్​ ఛాన్స్​లర్ ఏంజెలా మెర్కెల్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, జపాన్​ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ సహా పలువురు దేశాధినేతలతో ట్రంప్​ చర్చలు జరపనున్నారు.

వాణిజ్య యుద్ధం ముగిసేనా..?

ట్రంప్​, జిన్​పింగ్​​ సమావేశంతో అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ముగిసే దిశగా మరో అడుగు పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సమావేశం కోసం ఇప్పటికే ఇరు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధులు ఫోన్​లో సంభాషించినట్లు చైనా మీడియా పేర్కొంది. జీ20 సదస్సు ప్రారంభమైన రెండో రోజు.. జూన్ 29న ట్రంప్​-జిన్​పింగ్​ భేటీ జరిగే అవకాశం ఉంది.

సౌదీ యువరాజుతో...

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్​తో ఇరాన్​- అమెరికా ఉద్రిక్తతలపై ప్రత్యేకంగా ట్రంప్​ చర్చించనున్నారు.

సియోల్​కు పయనం...

జీ20 సదస్సు ముగిశాక అమెరికా అధ్యక్షుడు దక్షిణ కొరియా సియోల్​కు పయనం కానున్నారు. అయితే ఈ పర్యటనలో ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దులోని సైనిక రహిత ప్రాంతాన్ని (డీఎమ్​జెడ్​) ట్రంప్​ సందర్శిస్తారా లేదా అన్న విషయంపై అమెరికా స్పష్టత ఇవ్వలేదు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​తో మాత్రం భేటీ లేదని అగ్రరాజ్యం తెలిపింది. ఇప్పటికే ఇరు దేశాధినేతలు 2 సార్లు భేటీ అయ్యారు.

జీ20కి ట్రంప్​: ఉద్రిక్తతలకు తెరపై ఆశలు

జపాన్​ ఒసాకాలో ఈ వారం జరగనున్న జీ-20 సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు.

జాబితాలో చాలా మందే...

భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మన్​ ఛాన్స్​లర్ ఏంజెలా మెర్కెల్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, జపాన్​ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ సహా పలువురు దేశాధినేతలతో ట్రంప్​ చర్చలు జరపనున్నారు.

వాణిజ్య యుద్ధం ముగిసేనా..?

ట్రంప్​, జిన్​పింగ్​​ సమావేశంతో అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ముగిసే దిశగా మరో అడుగు పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సమావేశం కోసం ఇప్పటికే ఇరు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధులు ఫోన్​లో సంభాషించినట్లు చైనా మీడియా పేర్కొంది. జీ20 సదస్సు ప్రారంభమైన రెండో రోజు.. జూన్ 29న ట్రంప్​-జిన్​పింగ్​ భేటీ జరిగే అవకాశం ఉంది.

సౌదీ యువరాజుతో...

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్​తో ఇరాన్​- అమెరికా ఉద్రిక్తతలపై ప్రత్యేకంగా ట్రంప్​ చర్చించనున్నారు.

సియోల్​కు పయనం...

జీ20 సదస్సు ముగిశాక అమెరికా అధ్యక్షుడు దక్షిణ కొరియా సియోల్​కు పయనం కానున్నారు. అయితే ఈ పర్యటనలో ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దులోని సైనిక రహిత ప్రాంతాన్ని (డీఎమ్​జెడ్​) ట్రంప్​ సందర్శిస్తారా లేదా అన్న విషయంపై అమెరికా స్పష్టత ఇవ్వలేదు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​తో మాత్రం భేటీ లేదని అగ్రరాజ్యం తెలిపింది. ఇప్పటికే ఇరు దేశాధినేతలు 2 సార్లు భేటీ అయ్యారు.

New Delhi, June 24 (ANI): Former Pakistan Finance Minister Abdul Sattar passed away on Sunday. He was 88."We are deeply saddened to announce that former foreign minister Abdul Sattar has passed away. He was an illustrious diplomat and an accomplished author," Pakistan's foreign office said in a statement. Sattar served as the Foreign minister under then-president Pervez Musharraf government from 1999 to 2002. He was the part of Mussaraf delegation who visited India for the historic Agra Summit in 2001. Sattar also served as the foreign secretary from 1986-88."We offer our profound condolences to the bereaved family and pray for the departed soul," the statement added.
Last Updated : Jun 25, 2019, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.