ETV Bharat / international

బలగాల ఉపసంహరణతో పెనుముప్పుగా తాలిబన్లు!

author img

By

Published : Jun 28, 2021, 7:47 AM IST

అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభమైన నేపథ్యంలో అఫ్గాన్​​లో శాంతి, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే కనిపిస్తోంది. అక్కడ రోజురోజుకూ తాలిబన్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. సైన్యం బలహీనతను ఆసరాగా చేసుకుని తమ ప్రాబల్యాన్ని విస్తరిస్తున్న తాలిబన్లు.. రెండు నెలల్లోనే 30 జిల్లాలను ఆక్రమించారు. మరోవైపు తీవ్రవాద ఘటనల్లో మృతుల సంఖ్య రెండున్నర రెట్లు పెరగడం ఆందోళన కలిగించే అంశం.

Taliban
అఫ్గానిస్థాన్

అఫ్గానిస్థాన్‌ రక్తమోడుతోంది. 'దోహా' ఒప్పందం ప్రకారం అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణ కొనసాగుతున్న వేళ.. తాలిబన్ల అరాచకం తారస్థాయికి చేరింది. అఫ్గాన్ సైన్యం బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న తాలిబన్లు.. పూర్వం తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరం వరకు వారి ఆక్రమణ విస్తరించడం కలవరపెడుతోంది. మే 1వ తేదీకి ముందు మొత్తం 387 జిల్లాల్లో 73 జిల్లాలు తాలిబన్ల నియంత్రణలో ఉండేవి. అయితే గత రెండు నెలల కాలంలో 17 ప్రావిన్స్‌లలో ఉన్న 30 జిల్లాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందూజ్‌ ప్రాంతాన్ని ఆక్రమించడం తాలిబన్లు ఎంత వేగంగా పుంజుకుంటున్నారో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోంది.

బలగాల ఉపసంహరణతో విధ్వంసం..

గతేడాది ఫిబ్రవరి 29న అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన దోహా ఒప్పందం ప్రకారం.. 2021 మే 1వ తేదీ నాటికి అమెరికా, దాని మిత్ర దేశాలు అఫ్గాన్‌ నుంచి పూర్తిగా బలగాలను ఉపసంహరించుకోవాలి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన 2500 మంది సైనికులు, నాటో కూటమికి చెందిన 7 వేల మంది సైనికులు అఫ్గాన్‌ నుంచి వెనక్కి వెళ్లాలి. బైడెన్‌ ప్రభుత్వం వచ్చాక ఆ గడువును సెప్టెంబర్‌ 11వ తేదీకి పొడిగించింది. ఈ ప్రక్రియలో భాగంగా జూన్‌ 8 నాటికి సగం బలగాలను అమెరికా వెనక్కి రప్పించింది. అయితే బలగాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత అఫ్గానిస్థాన్‌లో విధ్వంసం తారస్థాయికి చేరింది. సాధారణ పౌరులతోపాటు, పాత్రికేయులు, మహిళా కార్యకర్తలు, మానవహక్కుల పరిరక్షణ కార్యకర్తలపై తాలిబన్ల దాడులు పెరిగాయి. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, యువతులు, అమాయకులైన పౌరులపై తాలిబన్ల దాడులు పెరిగిపోయాయి.

రెండున్నర రెట్ల మరణాలు..

ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో తీవ్రవాద సంబంధిత మరణాలు రెండున్నర రెట్లు పెరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. బలగాల ఉపసంహరణ ప్రారంభం తర్వాత అఫ్గాన్‌లో తాలిబన్లు సాగించిన అరాచకానికి అద్దం పడుతోంది. తీవ్రవాద ఘటనల్లో ఏప్రిల్‌లో 1654 మంది మృతిచెందగా.. మే నెలలో 4375 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్‌లో 388 మంది సైనికులు చనిపోతే, మేలో ఆ సంఖ్య 1,134కి చేరినట్లు వెల్లడిస్తున్నాయి. తాలిబన్ల ఆక్రమణను అడ్డుకునేందుకు అఫ్గాన్‌ జాతీయ భద్రత, రక్షణ దళాలు (ఏఎన్‌ఎస్‌డీఎఫ్‌) శక్తి, ఆయుధాలు సరిపోవడంలేదు. దీనికితోడు ఆయుధాలతో సహా స్వచ్ఛందంగా లొంగిపోవాలంటూ తాలిబన్లు చేస్తున్న హెచ్చరికల నడుమ ఏఎన్‌ఎస్‌డీఎఫ్‌ సిబ్బంది లొంగిపోతున్న ఘటనలు ఈమధ్య పెరిగిపోతున్నాయి. మే నెలలో సుమారు 26 స్థావరాలను ఏఎన్‌ఎస్‌డీఎఫ్‌ సిబ్బంది తాలిబన్లకు అప్పగించారు. ఈ విజయాల కారణంగా అధికారం పంచుకునే విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాలిబన్లు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. అమెరికా కానీ, నాటో కానీ అఫ్గానిస్థాన్‌లో ఈ సంక్షోభాన్ని నివారించేలా చర్యలు తీసుకోవడంలేదు.

భారత్‌ సాయం..

అఫ్గానిస్థాన్‌లో ప్రజాస్వామ్యం నెలకొల్పే దిశగా భారత్‌ సాయమందిస్తూనే వస్తోంది. అఫ్గాన్‌లో ఆసుపత్రులు, విద్యా సంస్థలు, పార్లమెంట్‌ భవన నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో భారత్‌ 2 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిపెట్టింది. దోహా, జెనీవా, దుషబ్‌బే సమావేశాలతోపాటు అఫ్గాన్‌ శాంతి ప్రక్రియకు సంబంధించిన పలు సదస్సుల్లో మన దేశం పాల్గొంది. ప్రస్తుతం అమెరికా సైన్యం అఫ్గానిస్థాన్‌ నుంచి వైదొలిగితే అక్కడ మళ్లీ అస్థిరత ఏర్పడే అవకాశాలున్నాయని కేంద్రం ఆందోళన చెందుతోంది.

ఇవీ చదవండి:

అఫ్గానిస్థాన్‌ రక్తమోడుతోంది. 'దోహా' ఒప్పందం ప్రకారం అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణ కొనసాగుతున్న వేళ.. తాలిబన్ల అరాచకం తారస్థాయికి చేరింది. అఫ్గాన్ సైన్యం బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న తాలిబన్లు.. పూర్వం తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరం వరకు వారి ఆక్రమణ విస్తరించడం కలవరపెడుతోంది. మే 1వ తేదీకి ముందు మొత్తం 387 జిల్లాల్లో 73 జిల్లాలు తాలిబన్ల నియంత్రణలో ఉండేవి. అయితే గత రెండు నెలల కాలంలో 17 ప్రావిన్స్‌లలో ఉన్న 30 జిల్లాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందూజ్‌ ప్రాంతాన్ని ఆక్రమించడం తాలిబన్లు ఎంత వేగంగా పుంజుకుంటున్నారో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోంది.

బలగాల ఉపసంహరణతో విధ్వంసం..

గతేడాది ఫిబ్రవరి 29న అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన దోహా ఒప్పందం ప్రకారం.. 2021 మే 1వ తేదీ నాటికి అమెరికా, దాని మిత్ర దేశాలు అఫ్గాన్‌ నుంచి పూర్తిగా బలగాలను ఉపసంహరించుకోవాలి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన 2500 మంది సైనికులు, నాటో కూటమికి చెందిన 7 వేల మంది సైనికులు అఫ్గాన్‌ నుంచి వెనక్కి వెళ్లాలి. బైడెన్‌ ప్రభుత్వం వచ్చాక ఆ గడువును సెప్టెంబర్‌ 11వ తేదీకి పొడిగించింది. ఈ ప్రక్రియలో భాగంగా జూన్‌ 8 నాటికి సగం బలగాలను అమెరికా వెనక్కి రప్పించింది. అయితే బలగాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత అఫ్గానిస్థాన్‌లో విధ్వంసం తారస్థాయికి చేరింది. సాధారణ పౌరులతోపాటు, పాత్రికేయులు, మహిళా కార్యకర్తలు, మానవహక్కుల పరిరక్షణ కార్యకర్తలపై తాలిబన్ల దాడులు పెరిగాయి. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, యువతులు, అమాయకులైన పౌరులపై తాలిబన్ల దాడులు పెరిగిపోయాయి.

రెండున్నర రెట్ల మరణాలు..

ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో తీవ్రవాద సంబంధిత మరణాలు రెండున్నర రెట్లు పెరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. బలగాల ఉపసంహరణ ప్రారంభం తర్వాత అఫ్గాన్‌లో తాలిబన్లు సాగించిన అరాచకానికి అద్దం పడుతోంది. తీవ్రవాద ఘటనల్లో ఏప్రిల్‌లో 1654 మంది మృతిచెందగా.. మే నెలలో 4375 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్‌లో 388 మంది సైనికులు చనిపోతే, మేలో ఆ సంఖ్య 1,134కి చేరినట్లు వెల్లడిస్తున్నాయి. తాలిబన్ల ఆక్రమణను అడ్డుకునేందుకు అఫ్గాన్‌ జాతీయ భద్రత, రక్షణ దళాలు (ఏఎన్‌ఎస్‌డీఎఫ్‌) శక్తి, ఆయుధాలు సరిపోవడంలేదు. దీనికితోడు ఆయుధాలతో సహా స్వచ్ఛందంగా లొంగిపోవాలంటూ తాలిబన్లు చేస్తున్న హెచ్చరికల నడుమ ఏఎన్‌ఎస్‌డీఎఫ్‌ సిబ్బంది లొంగిపోతున్న ఘటనలు ఈమధ్య పెరిగిపోతున్నాయి. మే నెలలో సుమారు 26 స్థావరాలను ఏఎన్‌ఎస్‌డీఎఫ్‌ సిబ్బంది తాలిబన్లకు అప్పగించారు. ఈ విజయాల కారణంగా అధికారం పంచుకునే విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాలిబన్లు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. అమెరికా కానీ, నాటో కానీ అఫ్గానిస్థాన్‌లో ఈ సంక్షోభాన్ని నివారించేలా చర్యలు తీసుకోవడంలేదు.

భారత్‌ సాయం..

అఫ్గానిస్థాన్‌లో ప్రజాస్వామ్యం నెలకొల్పే దిశగా భారత్‌ సాయమందిస్తూనే వస్తోంది. అఫ్గాన్‌లో ఆసుపత్రులు, విద్యా సంస్థలు, పార్లమెంట్‌ భవన నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో భారత్‌ 2 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిపెట్టింది. దోహా, జెనీవా, దుషబ్‌బే సమావేశాలతోపాటు అఫ్గాన్‌ శాంతి ప్రక్రియకు సంబంధించిన పలు సదస్సుల్లో మన దేశం పాల్గొంది. ప్రస్తుతం అమెరికా సైన్యం అఫ్గానిస్థాన్‌ నుంచి వైదొలిగితే అక్కడ మళ్లీ అస్థిరత ఏర్పడే అవకాశాలున్నాయని కేంద్రం ఆందోళన చెందుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.