ETV Bharat / international

కరోనా పంజా: శ్రీలంకలో తొలి మరణం

author img

By

Published : Mar 29, 2020, 2:21 PM IST

కరోనా వైరస్ కారణంగా శ్రీలంకలో తొలి మరణం నమోదైంది. ఈ ప్రాణాంతక వైరస్​ సోకి చికిత్స పొందుతూ 65ఏళ్ల వృద్ధుడు చనిపోయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Sri Lanka records first death due to coronavirus
శ్రీలంకలో తొలి కరోనా మరణం... 65ఏళ్ల వృద్ధుడు మృతి

శ్రీలంకలో తొలి కరోనా వైరస్​ మరణం నమోదైంది. కొలంబోలోని​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 65ఏళ్ల వృద్ధుడు శనివారం మరణించాడు. వైరస్​ సోకి మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. మృతుడు అధిక రక్తపోటు, మధుమేహం​ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడించాయి.

ఆ వృద్ధుడు ఇటీవల ఇటలీ​ పర్యటకుల బృందంతో కలిసి తిరిగడం వల్లే వైరస్​ సోకిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటి వరకు శ్రీలంకలో 115 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 9 మంది వైరస్​ బారి నుంచి కోలుకున్నారు. మరో 199 మంది అనుమానితులు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తోంది శ్రీలంక ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చేవారిపైనా ఆంక్షలు విధించింది.

ఇదీ చూడండి : కరోనా లాక్​డౌన్​: వేర్వేరు దేశాల్లో ఇదీ పరిస్థితి

శ్రీలంకలో తొలి కరోనా వైరస్​ మరణం నమోదైంది. కొలంబోలోని​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 65ఏళ్ల వృద్ధుడు శనివారం మరణించాడు. వైరస్​ సోకి మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. మృతుడు అధిక రక్తపోటు, మధుమేహం​ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడించాయి.

ఆ వృద్ధుడు ఇటీవల ఇటలీ​ పర్యటకుల బృందంతో కలిసి తిరిగడం వల్లే వైరస్​ సోకిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటి వరకు శ్రీలంకలో 115 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 9 మంది వైరస్​ బారి నుంచి కోలుకున్నారు. మరో 199 మంది అనుమానితులు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తోంది శ్రీలంక ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చేవారిపైనా ఆంక్షలు విధించింది.

ఇదీ చూడండి : కరోనా లాక్​డౌన్​: వేర్వేరు దేశాల్లో ఇదీ పరిస్థితి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.