ETV Bharat / international

సైనికులకు కరోనా- ప్రజలకు ప్రధాని క్షమాపణ

author img

By

Published : Jul 20, 2021, 1:48 PM IST

దక్షిణ కొరియాకు చెందిన ఓ యుద్ధ నౌకలోని 301 మంది సిబ్బందిలో 247 మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు దక్షిణ కొరియా ప్రధానమంత్రి. మరోవైపు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని దక్షిణ కొరియా రక్షణ మంత్రి హామీ ఇచ్చారు.

south korea pm
దక్షిణ కొరియా ప్రధాని

యాంటీ-పైరసీ(సముద్ర దోపిడీల నివారణ) మిషన్​పై పనిచేస్తున్న ఓ డిస్ట్రాయర్ నౌకలో ఉన్న సిబ్బంది కరోనా బారిన పడటంపై దక్షిణ కొరియా ప్రధానమంత్రి కిమ్ బూ-క్యూమ్ విచారం వ్యక్తం చేశారు. సైనికుల ఆరోగ్యాన్ని కాపాడటంలో విఫలమైనందుకు క్షమించాలని ప్రజలను కోరారు.

దక్షిణ కొరియా మిలిటరీకి చెందిన మున్ము అనే విధ్వంసక నౌక.. తూర్పు ఆఫ్రికాలో కార్యకలాపాలు సాగిస్తోంది. అందులో ఉన్న 301 మంది సిబ్బందిలో 247 మంది కరోనా బారిన పడ్డారు. నౌకలోని వారినందరినీ వెనక్కి తీసుకొచ్చేందుకు.. రెండు మిలిటరీ విమానాలను పంపించారు.

ఇదే విషయంపై స్పందించిన ఆ దేశ రక్షణ మంత్రి సు వూక్.. దీనికి పూర్తి బాధ్యత తమదేనని అన్నారు. నౌకలో ఉన్నవారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి.. సవినయంగా క్షమాపణలు చెప్పారు. సిబ్బంది అంతా దక్షిణ కొరియాకు తిరిగి రాగానే.. ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

SKOREA-PM-APOLOGY
వంగి క్షమాపణలు చెబుతున్న రక్షణ మంత్రి

ఇదీ చదవండి: Pegasus spyware: 'అదే నిజమైతే ఎర్రగీత దాటినట్లే'

యాంటీ-పైరసీ(సముద్ర దోపిడీల నివారణ) మిషన్​పై పనిచేస్తున్న ఓ డిస్ట్రాయర్ నౌకలో ఉన్న సిబ్బంది కరోనా బారిన పడటంపై దక్షిణ కొరియా ప్రధానమంత్రి కిమ్ బూ-క్యూమ్ విచారం వ్యక్తం చేశారు. సైనికుల ఆరోగ్యాన్ని కాపాడటంలో విఫలమైనందుకు క్షమించాలని ప్రజలను కోరారు.

దక్షిణ కొరియా మిలిటరీకి చెందిన మున్ము అనే విధ్వంసక నౌక.. తూర్పు ఆఫ్రికాలో కార్యకలాపాలు సాగిస్తోంది. అందులో ఉన్న 301 మంది సిబ్బందిలో 247 మంది కరోనా బారిన పడ్డారు. నౌకలోని వారినందరినీ వెనక్కి తీసుకొచ్చేందుకు.. రెండు మిలిటరీ విమానాలను పంపించారు.

ఇదే విషయంపై స్పందించిన ఆ దేశ రక్షణ మంత్రి సు వూక్.. దీనికి పూర్తి బాధ్యత తమదేనని అన్నారు. నౌకలో ఉన్నవారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి.. సవినయంగా క్షమాపణలు చెప్పారు. సిబ్బంది అంతా దక్షిణ కొరియాకు తిరిగి రాగానే.. ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

SKOREA-PM-APOLOGY
వంగి క్షమాపణలు చెబుతున్న రక్షణ మంత్రి

ఇదీ చదవండి: Pegasus spyware: 'అదే నిజమైతే ఎర్రగీత దాటినట్లే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.