ETV Bharat / international

ఆ దేశాల్లో మళ్లీ కరోనా విజృంభణ

author img

By

Published : Aug 16, 2020, 2:11 PM IST

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతూనే ఉంది. వైరస్​ను జయించాయని అనుకున్న దేశాల్లో మళ్లీ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.

S. Korea reports largest virus jump since March
ఆ దేశాల్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

కరోనాను జయించిన దేశాల్లో మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. దక్షిణ కొరియాలో తాజాగా 279 మంది బాధితులను గుర్తించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో 253 మంది సియోల్​ నగరం నుంచే కావటం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,318కి ఎగబాకింది. ఇప్పటివరకు 305 మంది మృతి చెందారు.

మతపరమైన కార్యక్రమాలు, పాఠశాలలు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో ప్రజలు సమూహంగా ఉండటం వల్ల కేసులు వెలుగుచూస్తున్నట్లు భావిస్తున్నారు.

న్యూజిలాండ్​లో మళ్లీ...

న్యూజిలాండ్​లో దాదాపు 100 రోజుల తర్వాత.. వరుసగా రెండు, మూడు రోజుల నుంచి కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆదివారం 13 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిలో 12 మంది ఆక్లాండ్​ నగరం చెందిన వారని అధికారులు తెలిపారు. మరో వ్యక్తి విదేశాల నుంచి రాగా అతడిని క్వారంటైన్​లో​ ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ నగరంలో మొత్తం 49 మంది మహమ్మారి బారిన పడ్డారు.

పాకిస్థాన్​లో

పాకిస్థాన్​లో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 670 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరో ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం 6,168 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 2,88,717 మంది బాధితులు ఉన్నారు.

ఇదీ చూడండి ఎల్లలు దాటిన 'స్వాతంత్ర్య' భారత సంబరం!

కరోనాను జయించిన దేశాల్లో మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. దక్షిణ కొరియాలో తాజాగా 279 మంది బాధితులను గుర్తించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో 253 మంది సియోల్​ నగరం నుంచే కావటం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,318కి ఎగబాకింది. ఇప్పటివరకు 305 మంది మృతి చెందారు.

మతపరమైన కార్యక్రమాలు, పాఠశాలలు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో ప్రజలు సమూహంగా ఉండటం వల్ల కేసులు వెలుగుచూస్తున్నట్లు భావిస్తున్నారు.

న్యూజిలాండ్​లో మళ్లీ...

న్యూజిలాండ్​లో దాదాపు 100 రోజుల తర్వాత.. వరుసగా రెండు, మూడు రోజుల నుంచి కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆదివారం 13 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిలో 12 మంది ఆక్లాండ్​ నగరం చెందిన వారని అధికారులు తెలిపారు. మరో వ్యక్తి విదేశాల నుంచి రాగా అతడిని క్వారంటైన్​లో​ ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ నగరంలో మొత్తం 49 మంది మహమ్మారి బారిన పడ్డారు.

పాకిస్థాన్​లో

పాకిస్థాన్​లో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 670 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరో ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం 6,168 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 2,88,717 మంది బాధితులు ఉన్నారు.

ఇదీ చూడండి ఎల్లలు దాటిన 'స్వాతంత్ర్య' భారత సంబరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.