ETV Bharat / international

మోదీ లేఖపై ఇమ్రాన్ హర్షం..చర్చలకు ఆహ్వానం!

పాకిస్థాన్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాసిన లేఖను పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్  స్వాగతించారు. అతి ముఖ్యమైన కశ్మీర్​ అంశం సహా వివిధ సమస్యలపై ఇరు దేశాల మధ్య చర్చకు ఇదే సరైన అవకాశమని పేర్కొన్నారు ఇమ్రాన్.

author img

By

Published : Mar 23, 2019, 2:36 PM IST

మోదీ లేఖకు ఇమ్రాన్​ఖాన్ స్పందన
మోదీ లేఖకు ఇమ్రాన్​ఖాన్ స్పందన
పాకిస్థాన్​ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాసిన లేఖను ఇమ్రాన్​ఖాన్ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల్ని ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని తన ట్విట్టర్​ ఖాతాలో పేర్కొన్నారు.

"మన ప్రజలకు మోదీ తెలిపిన శుభాకాంక్షల్ని స్వాగతిస్తున్నా. అతి ముఖ్యమైన కశ్మీర్​ అంశం సహా వివిధ సమస్యలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలని కోరుకుంటున్నా. రెండు దేశాల ప్రజల శాంతి కోసం నూతన బంధాలను ఏర్పరచుకోవాలని ఆకాంక్షిస్తున్నా."-ఇమ్రాన్​ఖాన్, ట్విట్టర్

imran
ఇమ్రాన్ ట్వీట్

పాక్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉగ్రవాద వ్యతిరేక దక్షిణాసియా నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని కోరుతూ ఇమ్రాన్​ఖాన్​కు లేఖ రాశారు మోదీ. పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్​ ప్రధానికి మోదీ లేఖ రాయడం విశేషం. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, శాంతియుత దక్షిణాసియాను తయారుచేసేందుకు కలిసి నడవాలన్నారు మోదీ.

పాక్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ హైకమిషనర్​ దిల్లీలో ఇచ్చే విందుకు భారత్​ గైర్హాజరైంది. జమ్ముకశ్మీర్​ నుంచి వేర్పాటువాద నేతల్ని ఈ విందుకు ఆహ్వానించడమే కారణంగా పేర్కొంది.

మోదీ లేఖకు ఇమ్రాన్​ఖాన్ స్పందన
పాకిస్థాన్​ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాసిన లేఖను ఇమ్రాన్​ఖాన్ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల్ని ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని తన ట్విట్టర్​ ఖాతాలో పేర్కొన్నారు.

"మన ప్రజలకు మోదీ తెలిపిన శుభాకాంక్షల్ని స్వాగతిస్తున్నా. అతి ముఖ్యమైన కశ్మీర్​ అంశం సహా వివిధ సమస్యలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలని కోరుకుంటున్నా. రెండు దేశాల ప్రజల శాంతి కోసం నూతన బంధాలను ఏర్పరచుకోవాలని ఆకాంక్షిస్తున్నా."-ఇమ్రాన్​ఖాన్, ట్విట్టర్

imran
ఇమ్రాన్ ట్వీట్

పాక్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉగ్రవాద వ్యతిరేక దక్షిణాసియా నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని కోరుతూ ఇమ్రాన్​ఖాన్​కు లేఖ రాశారు మోదీ. పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్​ ప్రధానికి మోదీ లేఖ రాయడం విశేషం. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, శాంతియుత దక్షిణాసియాను తయారుచేసేందుకు కలిసి నడవాలన్నారు మోదీ.

పాక్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ హైకమిషనర్​ దిల్లీలో ఇచ్చే విందుకు భారత్​ గైర్హాజరైంది. జమ్ముకశ్మీర్​ నుంచి వేర్పాటువాద నేతల్ని ఈ విందుకు ఆహ్వానించడమే కారణంగా పేర్కొంది.


Gurugram (Haryana), Mar 23 (ANI): The members of a Muslim family were mercilessly beaten with iron rods and hockey sticks, and their house was pelted with stones by a mob of over 40 men in Bhondsi, Gurugram, on March 21. Assistant Commissioner of Police (ACP)-Crime of Gurugram Shamsher Singh said, "A case has been registered at Bhondsi police station that when children of a local were playing cricket, a few men came there, threatened them asking them not to play cricket there and attacked them with sticks and swords. Accused will be identified and arrested soon." The police claimed that the brawl was triggered over a game of cricket on Holi.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.