ETV Bharat / international

పాకిస్థాన్​లో కరోనా విలయతాండవం

ప్రపంచ దేశాల్లో కరోనా విస్తరిస్తూనే ఉంది. పాక్​లో వైరస్​ విలయతాండవం చేస్తోంది. గత 24గంటల్లో 1500పైగా కేసులు నమోదయ్యాయని పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సింగపూర్​లోనూ కొవిడ్​-19 కేసుల సంఖ్య పెరుగుతోంది. వీరిలో ఎక్కువమంది విదేశీయులే ఉన్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

author img

By

Published : May 16, 2020, 4:25 PM IST

Pak's coronavirus cases touches 38,799 with 834 deaths: Health Ministry
పాక్​లోనూ కరోనా విలయతాండవం

చైనాలో పుట్టిన కరోనా వైరస్​.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్​లో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 1,581మంది వైరస్​ బారిన పడగా.. మొత్తం బాధితుల సంఖ్య 38,799కు చేరుకుంది. మరో 31మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 834కు పెరిగింది. ఇప్పటివరకు 10,880మంది వైరస్​ నుంచి కోలుకున్నారని పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ​ అధికారులు తెలిపారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్​లోనూ...

పంజాబ్​లో 14,201 మంది.. సింధ్​లో 14,916, కైబర్​-పఖ్తున్​క్వాలో 10,880, బలుచిస్థాన్​ 2,457, గిల్గిత్​-బల్టిస్థాన్​ 518, ఇస్లామాబాద్​లో 921, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో 108 మంది కొవిడ్​-19 బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 359,264మందికి కరోనా పరీక్షలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

సింగపూర్​లో కరోనా కేసులు ఇలా..

సింగపూర్​లోనూ కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా 465 కేసులు నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 27,356కు పెరిగింది. జూన్​ 1 నుంచి ఆంక్షల్లో మరిన్ని సడలింపులు ఇచ్చినట్లయితే దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఓ మంత్రి హెచ్చరించారు. అయితే ఈ కేసుల్లో ఎక్కువమంది విదేశాలకు చెందినవారేనని అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Pak's coronavirus cases touches 38,799 with 834 deaths: Health Ministry
పాక్​లోనూ కరోనా విలయతాండవం

ఇదీ చూడండి: 'అమెరికాలో ఉగ్రదాడికి పాక్ వైద్యుడి కుట్ర'

చైనాలో పుట్టిన కరోనా వైరస్​.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్​లో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 1,581మంది వైరస్​ బారిన పడగా.. మొత్తం బాధితుల సంఖ్య 38,799కు చేరుకుంది. మరో 31మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 834కు పెరిగింది. ఇప్పటివరకు 10,880మంది వైరస్​ నుంచి కోలుకున్నారని పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ​ అధికారులు తెలిపారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్​లోనూ...

పంజాబ్​లో 14,201 మంది.. సింధ్​లో 14,916, కైబర్​-పఖ్తున్​క్వాలో 10,880, బలుచిస్థాన్​ 2,457, గిల్గిత్​-బల్టిస్థాన్​ 518, ఇస్లామాబాద్​లో 921, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో 108 మంది కొవిడ్​-19 బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 359,264మందికి కరోనా పరీక్షలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

సింగపూర్​లో కరోనా కేసులు ఇలా..

సింగపూర్​లోనూ కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా 465 కేసులు నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 27,356కు పెరిగింది. జూన్​ 1 నుంచి ఆంక్షల్లో మరిన్ని సడలింపులు ఇచ్చినట్లయితే దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఓ మంత్రి హెచ్చరించారు. అయితే ఈ కేసుల్లో ఎక్కువమంది విదేశాలకు చెందినవారేనని అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Pak's coronavirus cases touches 38,799 with 834 deaths: Health Ministry
పాక్​లోనూ కరోనా విలయతాండవం

ఇదీ చూడండి: 'అమెరికాలో ఉగ్రదాడికి పాక్ వైద్యుడి కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.