పాకిస్థాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రం కరాక్ జిల్లాలో హిందూ ఆలయాన్ని కూల్చిన ఘటనపై పాక్ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఎవాక్యూ ప్రాపర్టీ ట్రస్ట్ బోర్డు(ఈపీటీబీ)ను ఆదేశించింది.
"పాకిస్థాన్లో ఉన్న అన్ని దేవాలయాలు, గురుద్వారాల వివరాలను అందించాలి. దేశవ్యాప్తంగా దేవాలయ స్థలాలను ఆక్రమించుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ మనస్తత్వంతో ఈపీటీబీ ఛైర్మన్..ఆ పదవిలో కూర్చోవటం తగదు"
--పాక్ సుప్రీం కోర్టు ధర్మాసనం
ఆలయం కూల్చవేత ఘటన సమయంలో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న 92 మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయంపై సుప్రీం స్పందించింది. వారికి సస్పెన్షన్ సరిపోదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
ఇదీ చదవండి : పాక్లో గుడి కూల్చివేతపై భారత్ నిరసన