ETV Bharat / international

పాక్​కు 11 లక్షల చైనా టీకా డోసులు!

author img

By

Published : Dec 31, 2020, 7:21 PM IST

చైనా ఫార్మాసంస్థ సినోఫార్మ్ నుంచి కరోనా టీకా కొనుగోలు చేయనున్నట్టు పాకిస్థాన్​ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు 11 లక్షల డోసులు ముందుగానే ఆర్డర్​ ఇచ్చే యోచనలో ఉన్నట్టు ప్రకటించింది.

Pakistan to procure 1.1 million COVID-19 vaccines from Chinese company Sinopharm
చైనా టీకా 10లక్షల డోసులు కోనుగోలు చేయనున్నపాక్

చైనా నుంచి కొవిడ్​-19 టీకాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది పాకిస్థాన్​. ఈ మేరకు ప్రముఖ ఫార్మా సంస్థ సినోఫార్మా నుంచి.. 11 లక్షల డోసులు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్​లో తమ టీకా 79.34 శాతం సామర్థవంతమైనది చైనా ప్రభుత్వం ప్రకటించిన ఒక్కరోజులోనే పాక్​ కొనుగోలుకు మొగ్గు చూపడం గమనార్హం. చైనా టీకా కొనుగోలుపై కేబినెట్ కమిటీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.

మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఇతర సురక్షితమైన టీకాల కొనుగోలు, పంపిణీ కోసం ప్రైవేట్ రంగం డ్రాప్‌ను సంప్రదించవచ్చని క్యాబినేట్​ కమిటీ తెలిపింది. డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్​ (డ్రాప్) ఆధ్వర్యంలో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీ చేయనుంది పాక్​. 2021 ప్రారంభంలో ఈ కార్యక్రమం మొదలవుతుందని పాక్​ ప్రభుత్వం తెలిపింది.

పాక్​లో కరోనా తీరిది..

గురువారం ఒక్కరోజే పాక్​లో కొత్తగా 2,475 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 479,715 కు చేరుకుంది. గురువారం 4,960 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 435,073 కు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా పాకిస్థాన్​లో ఇప్పటివరకు 10,105మంది మరణించారు.

ఇదీ చదవండి: 2021కి స్వాగతం పలికిన న్యూజిలాండ్​

చైనా నుంచి కొవిడ్​-19 టీకాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది పాకిస్థాన్​. ఈ మేరకు ప్రముఖ ఫార్మా సంస్థ సినోఫార్మా నుంచి.. 11 లక్షల డోసులు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్​లో తమ టీకా 79.34 శాతం సామర్థవంతమైనది చైనా ప్రభుత్వం ప్రకటించిన ఒక్కరోజులోనే పాక్​ కొనుగోలుకు మొగ్గు చూపడం గమనార్హం. చైనా టీకా కొనుగోలుపై కేబినెట్ కమిటీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.

మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఇతర సురక్షితమైన టీకాల కొనుగోలు, పంపిణీ కోసం ప్రైవేట్ రంగం డ్రాప్‌ను సంప్రదించవచ్చని క్యాబినేట్​ కమిటీ తెలిపింది. డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్​ (డ్రాప్) ఆధ్వర్యంలో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీ చేయనుంది పాక్​. 2021 ప్రారంభంలో ఈ కార్యక్రమం మొదలవుతుందని పాక్​ ప్రభుత్వం తెలిపింది.

పాక్​లో కరోనా తీరిది..

గురువారం ఒక్కరోజే పాక్​లో కొత్తగా 2,475 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 479,715 కు చేరుకుంది. గురువారం 4,960 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 435,073 కు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా పాకిస్థాన్​లో ఇప్పటివరకు 10,105మంది మరణించారు.

ఇదీ చదవండి: 2021కి స్వాగతం పలికిన న్యూజిలాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.