ETV Bharat / international

భారత మీడియాను సన్మానిస్తాం : పాక్ సైన్యం

author img

By

Published : Apr 30, 2019, 6:32 AM IST

Updated : Apr 30, 2019, 6:59 AM IST

పాకిస్థాన్​ మరోసారి తన వక్రబుద్ధి బయటపెట్టింది. బాలాకోట్​పై భారత వైమానిక దళం చేసిన దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని బుకాయించే ప్రయత్నం చేసింది. నిజానిజాలు తెలుసుకునేందుకు భారత మీడియా బాలాకోట్​ వస్తే సన్మానిస్తామని ప్రకటించింది.

భారత మీడియాను సన్మానిస్తాం : పాక్ సైన్యం
భారత మీడియాను సన్మానిస్తాం : పాక్ సైన్యం

బాలాకోట్​పై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో ఎలాంటి నష్టం జరగలేదని మరోసారి బుకాయించింది పాకిస్థాన్​ సైన్యం. ఈ విషయంలో భారత్​ పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. నిజానిజాలు తెలుసుకునేందుకు భారత పాత్రికేయులెవరైనా బాలాకోట్​కు వస్తే వారిని సన్మానిస్తామని ప్రకటించింది.

పాకిస్థాన్​ రావల్​పిండిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పాక్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్​ జనరల్​ ఆసిఫ్​ గఫూర్​. పాకిస్థాన్​ చేసిన ఎదురుదాడిలో ఏం జరిగిందో భారత్​ చెప్పడం లేదని గఫూర్​ ఆరోపించారు. పాక్​ తన తీరును మార్చుకోవాలని మమ్మల్ని కోరే బదులు పాక్​పై భారత్​ తన తీరును మార్చుకోవాలన్నారు.

"గత రెండు నెలలుగా భారత్​ అబద్ధాలాడుతూనే ఉంది. ఓ బాధ్యత గల దేశంగా మేము అలాంటి అసత్య వార్తలకు స్పందించం. నిజమేంటంటే పుల్వామాలో సైనికులపై దాడి జరిగింది. బాలాకోట్​లో మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. స్థానిక, విదేశీ మీడియాను అక్కడికి తీసుకెళ్లి నిజాలేంటో భారత్​కు చూపిస్తాం. ఒకవేళ భారత పాత్రికేయులు కూడా బాలాకోట్​కు రావాలని భావిస్తే వారిని మేము సన్మానిస్తాం."
- మేజర్​ జనరల్​ ఆసిఫ్​ గఫూర్, పాక్​ సైన్యం అధికార ప్రతినిధి

భారత మీడియాను సన్మానిస్తాం : పాక్ సైన్యం

బాలాకోట్​పై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో ఎలాంటి నష్టం జరగలేదని మరోసారి బుకాయించింది పాకిస్థాన్​ సైన్యం. ఈ విషయంలో భారత్​ పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. నిజానిజాలు తెలుసుకునేందుకు భారత పాత్రికేయులెవరైనా బాలాకోట్​కు వస్తే వారిని సన్మానిస్తామని ప్రకటించింది.

పాకిస్థాన్​ రావల్​పిండిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పాక్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్​ జనరల్​ ఆసిఫ్​ గఫూర్​. పాకిస్థాన్​ చేసిన ఎదురుదాడిలో ఏం జరిగిందో భారత్​ చెప్పడం లేదని గఫూర్​ ఆరోపించారు. పాక్​ తన తీరును మార్చుకోవాలని మమ్మల్ని కోరే బదులు పాక్​పై భారత్​ తన తీరును మార్చుకోవాలన్నారు.

"గత రెండు నెలలుగా భారత్​ అబద్ధాలాడుతూనే ఉంది. ఓ బాధ్యత గల దేశంగా మేము అలాంటి అసత్య వార్తలకు స్పందించం. నిజమేంటంటే పుల్వామాలో సైనికులపై దాడి జరిగింది. బాలాకోట్​లో మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. స్థానిక, విదేశీ మీడియాను అక్కడికి తీసుకెళ్లి నిజాలేంటో భారత్​కు చూపిస్తాం. ఒకవేళ భారత పాత్రికేయులు కూడా బాలాకోట్​కు రావాలని భావిస్తే వారిని మేము సన్మానిస్తాం."
- మేజర్​ జనరల్​ ఆసిఫ్​ గఫూర్, పాక్​ సైన్యం అధికార ప్రతినిధి

Hyderabad, Apr 30 (ANI): Sunrisers Hyderabad (SRH) defeated Kings XI Punjab (KXIP) by 45 runs on Monday strengthening their chances of qualifying for the Indian Premier League (IPL) playoffs at the Rajiv Gandhi International Stadium in Hyderabad. While addressing a post match press conference in Hyderabad, skipper of Sunrisers Hyderabad, Kane Williamson said, "The table is pretty congested and every game you play is packed in this. It is nice to put out the good performance today. Wriddhiman Saha played brilliantly well and he is supporting us in games."
Last Updated : Apr 30, 2019, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.