భారతీయ చలన చిత్ర దిగ్గజ నటుడు రాజ్ కపూర్ పూర్వీకుల ఇంటిపై వివాదం నడుస్తోంది. పాకిస్థాన్ పెషావర్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు అమ్మే ప్రసక్తే లేదని యజమాని తేల్చి చెప్పారు. సాధారణంగా ఆ ప్రాంతంలో అమ్ముడు పోయే రేటు కంటే ప్రభుత్వం చాలా తక్కువ మొత్తానికి వెల కట్టిందని ఆరోపించారు.
రాజ్కపూర్కు వారసత్వంగా వచ్చిన ఆస్తిని కొనుగోలు చేసి... ఆయన గౌరవార్థం మ్యూజియంగా మార్చాలని స్థానిక ప్రభుత్వం భావించింది. ఇందుకుగాను ఇంటి కొనుగోలుకు రూ. 1.5 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఇంటి ప్రస్తుత యజమాని హాజీ అలీ సబీర్... ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇవ్వలేనని తెలిపారు. ఆ ప్రాంతంలో సగం మార్లా(272 చ.అ) స్థలమే 1.5 కోట్లకు రావడం లేదని.. సమారు ఆరు మార్లాలు ఉండే ఇల్లు అదే రేటుకు అడగడం దారుణమని పేర్కొన్నారు. మార్కెట్ ధర ప్రకారం రూ.200 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆ దిగ్గజ నటుల భవంతుల్ని కొననున్న పాక్