ETV Bharat / international

మోదీ పర్యటనకు ముప్పేమీ లేదు: బంగ్లాదేశ్​ - బంగ్లాదేశ్​ పర్యటనకు ప్రధాని మోదీ

తమ దేశానికి రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి భద్రతపరంగా ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్​ ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాకను కొందరు వ్యతిరేకించినప్పటికీ భయపడాల్సిందేమీ లేదని తెలిపింది.

No threat to PM Modi's visit: Bangladesh
మోదీ పర్యటనకు ముప్పేమీలేదు: బంగ్లాదేశ్​
author img

By

Published : Mar 22, 2021, 8:03 AM IST

బంగ్లాదేశ్​లో రెండు రోజుల పర్యటనకు రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాకను కొన్ని వామపక్షాలు, ఇస్లామిస్ట్​ గ్రూపులు వ్యతిరేకిస్తున్నప్పటికీ భయపడాల్సిందేమీ లేదని తెలిపింది. బంగ్లాదేశ్​ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు, బంగ బంధు షేక్​ ముజిబుర్​ రహ్మాన్​ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన ఈ నెల 26, 27 తేదీల్లో బంగ్లాదేశ్​లో పర్యటించనున్నారు. మోదీని స్వాగతించడాన్ని గర్వంగా భావిస్తున్నామని బంగ్లాదేశ్​ విదేశాంగ మంత్రి డాక్టర్​ ఏకే అబ్దుల్​ మోమెన్​ చెప్పారు. మోదీ రాకను ఎవరైనా వ్యతిరేకించవచ్చని, కానీ వారికి ప్రభుత్వం భయపడబోదని తెలిపారు.

పర్యటనలో భాగంగా సాత్​ఖిరా, గోపాల్​గంజ్​ల్లోని హిందూ దేవాలయాలను మోదీ సందర్శించనున్నారు. ఇక్కడ హిందూ మతువా వర్గం వారు అధిక సంఖ్యలో ఉన్నారు. బంగాల్​లో కూడా మతువాలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల వారిని ఎన్నికల్లో ఆకర్షించడానికి దీన్ని అవకాశంగా మార్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై విదేశాంగ సహాయ మంత్రి షహరియార్​ ఆలంను ప్రశ్నించినప్పుడు అక్కడి రాజకీయాలతో బంగ్లాదేశ్​కు సంబంధం లేదని చెప్పారు. "ఆయన మా అతిథి. ఢాకా కాకుండా ఇతర ప్రాంతాలను సందర్శిస్తానంటే మంచిదే. దీని వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది" అని అన్నారు.

బంగ్లాదేశ్​లో రెండు రోజుల పర్యటనకు రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాకను కొన్ని వామపక్షాలు, ఇస్లామిస్ట్​ గ్రూపులు వ్యతిరేకిస్తున్నప్పటికీ భయపడాల్సిందేమీ లేదని తెలిపింది. బంగ్లాదేశ్​ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు, బంగ బంధు షేక్​ ముజిబుర్​ రహ్మాన్​ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన ఈ నెల 26, 27 తేదీల్లో బంగ్లాదేశ్​లో పర్యటించనున్నారు. మోదీని స్వాగతించడాన్ని గర్వంగా భావిస్తున్నామని బంగ్లాదేశ్​ విదేశాంగ మంత్రి డాక్టర్​ ఏకే అబ్దుల్​ మోమెన్​ చెప్పారు. మోదీ రాకను ఎవరైనా వ్యతిరేకించవచ్చని, కానీ వారికి ప్రభుత్వం భయపడబోదని తెలిపారు.

పర్యటనలో భాగంగా సాత్​ఖిరా, గోపాల్​గంజ్​ల్లోని హిందూ దేవాలయాలను మోదీ సందర్శించనున్నారు. ఇక్కడ హిందూ మతువా వర్గం వారు అధిక సంఖ్యలో ఉన్నారు. బంగాల్​లో కూడా మతువాలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల వారిని ఎన్నికల్లో ఆకర్షించడానికి దీన్ని అవకాశంగా మార్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై విదేశాంగ సహాయ మంత్రి షహరియార్​ ఆలంను ప్రశ్నించినప్పుడు అక్కడి రాజకీయాలతో బంగ్లాదేశ్​కు సంబంధం లేదని చెప్పారు. "ఆయన మా అతిథి. ఢాకా కాకుండా ఇతర ప్రాంతాలను సందర్శిస్తానంటే మంచిదే. దీని వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది" అని అన్నారు.

ఇదీ చూడండి: అంతర్యుద్ధం దిశగా మయన్మార్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.