ETV Bharat / international

హిమాలయ దేశంలో ప్రకృతి విలయం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నేపాల్​ను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది. 25 మంది గాయపడగా, మరో 33 మంది ఆచూకీ గల్లంతైంది.

author img

By

Published : Jul 14, 2019, 2:50 PM IST

నేపాల్​లో వరదల బీభత్సం.. 50కి చేరిన మృతుల సంఖ్య
హిమాలయ దేశంలో ప్రకృతి విలయం

నేపాల్​లో వరదలు మరింత తీవ్రరూపు దాల్చాయి. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 50కి చేరింది. 25 మంది తీవ్రంగా గాయపడగా, మరో 33 మంది ఆచూకీ గల్లంతైంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

నేపాల్​లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్లపై వరదనీరు నిండిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా జనజీవనం స్తంభించింది.

లలిత్​పుర్​, కావ్రే, కొటంగ్​, భోజ్​పుర్​, మకన్​పుర్​ జిల్లాల్లో వరద తీవ్రత ఎక్కువ ఉంది. ఆ ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: కారు వదిలి నాటు పడవలో కొత్త జంట ప్రయాణం

హిమాలయ దేశంలో ప్రకృతి విలయం

నేపాల్​లో వరదలు మరింత తీవ్రరూపు దాల్చాయి. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 50కి చేరింది. 25 మంది తీవ్రంగా గాయపడగా, మరో 33 మంది ఆచూకీ గల్లంతైంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

నేపాల్​లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్లపై వరదనీరు నిండిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా జనజీవనం స్తంభించింది.

లలిత్​పుర్​, కావ్రే, కొటంగ్​, భోజ్​పుర్​, మకన్​పుర్​ జిల్లాల్లో వరద తీవ్రత ఎక్కువ ఉంది. ఆ ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: కారు వదిలి నాటు పడవలో కొత్త జంట ప్రయాణం

Intro:Body:

m


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.