శుక్రవారం రోజు విచారణకు నిందితుడు బ్రెంటన్ టారంట్ను వీడియో లింక్ ద్వారా హాజరుపరచనున్నారు.
గత నెలలో రెండు మసీదులపై జరిగిన హింసకాండలో మొత్తం 50 మంది మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. నరమేధం నిందితునిపై మొదట ఒకే హత్యానేరం కేసు నమోదైంది.
కాల్పులకు పాల్పడిన మరుసటి రోజునే నిందితుడిని మొదట క్రైస్ట్చర్ట్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసులు పెరిగిన నేపథ్యంలో అతని కేసును హైకోర్టుకు బదిలీ చేశారు. ప్రస్తుతం నిందితుడు టారంట్ను భారీ భద్రత నడుమ ఆక్లాండ్లోని జైలులో ఉంచినట్లు సమాచారం.
నిందితుని తరఫున చట్టపరంగా ప్రాతినిధ్యం వహించే విషయమై వాదనలు ఉంటాయని న్యాయమూర్తి తెలిపారు. గతంలో తన కేసును తానే వాదించుకుంటానన్నాడు టారంట్.
శ్వేతజాతీయుల ఆధిపత్య ధోరణిని బలంగా వినిపించేందుకు ఈ అవకాశాన్ని టారంట్ వినియోగించుకుంటాడని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.