ETV Bharat / international

తూటాలను ఎదురొడ్డి నిలిచిన 'మలాలా' చేతికి డిగ్రీ పట్టా

author img

By

Published : Jun 20, 2020, 5:38 AM IST

ఆ దేశంలో బాలికల విద్యను ప్రచారం చేసినందుకు గానూ.. ఆమెపై దాడి చేశారు ఉగ్రవాదులు. ఏకంగా కాల్పులు జరిపారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన ఆ యువతి.. కోలుకున్నాక తిరిగి తన లక్ష్యం దిశగా సాగి ఇప్పుడు డిగ్రీ పూర్తిచేశారు. ఆమే.. పాకిస్థాన్​కు చెందిన మలాలా యూసఫ్​జయ్​.

Malala, who took bullet for going to school, celebrates her degree from Oxford University
ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయంలో మలాలా డిగ్రీ పూర్తి

బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తుపాకీ తూటాలను సైతం లెక్కచేయలేదు పాక్​ యువతి మలాలా యూసఫ్​జయ్​. శరీరంలో తూటా​ దిగినా పట్టువిడవలేదు. ఈ నేపథ్యంలోనే ప్రపంచం గౌరవించే స్థాయికి ఎదిగి.. పిన్న వయసులోనే నోబెల్​ శాంతి బహుమతి సాధించింది. ఇప్పుడు దేశం గర్వించే రీతిలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. 22 ఏళ్ల మలాలా.. బ్రిటన్​లోని ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం(ఆక్స్​ఫర్డ్​ లేడీ మార్గరెట్​ హాల్​ కళాశాల)లో తత్వశాస్త్రం, రాజనీతి, ఆర్థిక శాస్త్ర విభాగంలో గ్రాడ్యుయేట్​ పట్టా పొందారు. ఈ ఆనందంలో కుటుంబంతో సరదాగా గడిపిన ఆమె.. తన ఫొటోలను ట్విట్టర్​లో పంచుకున్నారు.

'ఆక్స్​ఫర్డ్​ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తయ్యాక నా ఆనందానికి అవధుల్లేవు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం చదువుకోవడం, నిద్ర పోవడంపైనే దృష్టిసారించాను. అయితే మానవ హక్కుల కోసం పోరాటం సాగిస్తాను.'

- మలాలా యూసఫ్​జయ్​

విదేశాలకు వెళ్లి..

ఈశాన్య పాక్​లోని స్వాట్​ లోయలో బాలికల విద్యపై ప్రచారంలో భాగంగా.. 2012లో తాలిబన్​ల చేతుల్లో కాల్పులకు గురయ్యారు మలాలా. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స కోసం బ్రిటన్​కు తరలించారు. ఉగ్రవాదుల హెచ్చరికతో.. అక్కడే తన విద్యను కొనసాగించారు మలాలా.

17 ఏళ్లకే నోబెల్​..

17 ఏళ్ల వయసులోనే 2014లో భారత్​కు చెందిన కైలాస్​ సత్యార్థితో నోబెల్​ శాంతి బహుమతిని పంచుకొన్నారు మలాలా. ఇలా పిన్న వయసులోనే గొప్పపేరు సాధించిన ఆమె.. పాక్​ సహా నైజీరియా, జోర్డాన్​, సిరియా, కెన్యా దేశాల్లోనూ న్యాయవాద విద్యకు మద్దతుగా నిలిచారు.

ఇదీ చదవండి: ఏటా 100 కోట్ల మంది చిన్నారులపై హింస

బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తుపాకీ తూటాలను సైతం లెక్కచేయలేదు పాక్​ యువతి మలాలా యూసఫ్​జయ్​. శరీరంలో తూటా​ దిగినా పట్టువిడవలేదు. ఈ నేపథ్యంలోనే ప్రపంచం గౌరవించే స్థాయికి ఎదిగి.. పిన్న వయసులోనే నోబెల్​ శాంతి బహుమతి సాధించింది. ఇప్పుడు దేశం గర్వించే రీతిలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. 22 ఏళ్ల మలాలా.. బ్రిటన్​లోని ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం(ఆక్స్​ఫర్డ్​ లేడీ మార్గరెట్​ హాల్​ కళాశాల)లో తత్వశాస్త్రం, రాజనీతి, ఆర్థిక శాస్త్ర విభాగంలో గ్రాడ్యుయేట్​ పట్టా పొందారు. ఈ ఆనందంలో కుటుంబంతో సరదాగా గడిపిన ఆమె.. తన ఫొటోలను ట్విట్టర్​లో పంచుకున్నారు.

'ఆక్స్​ఫర్డ్​ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తయ్యాక నా ఆనందానికి అవధుల్లేవు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం చదువుకోవడం, నిద్ర పోవడంపైనే దృష్టిసారించాను. అయితే మానవ హక్కుల కోసం పోరాటం సాగిస్తాను.'

- మలాలా యూసఫ్​జయ్​

విదేశాలకు వెళ్లి..

ఈశాన్య పాక్​లోని స్వాట్​ లోయలో బాలికల విద్యపై ప్రచారంలో భాగంగా.. 2012లో తాలిబన్​ల చేతుల్లో కాల్పులకు గురయ్యారు మలాలా. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స కోసం బ్రిటన్​కు తరలించారు. ఉగ్రవాదుల హెచ్చరికతో.. అక్కడే తన విద్యను కొనసాగించారు మలాలా.

17 ఏళ్లకే నోబెల్​..

17 ఏళ్ల వయసులోనే 2014లో భారత్​కు చెందిన కైలాస్​ సత్యార్థితో నోబెల్​ శాంతి బహుమతిని పంచుకొన్నారు మలాలా. ఇలా పిన్న వయసులోనే గొప్పపేరు సాధించిన ఆమె.. పాక్​ సహా నైజీరియా, జోర్డాన్​, సిరియా, కెన్యా దేశాల్లోనూ న్యాయవాద విద్యకు మద్దతుగా నిలిచారు.

ఇదీ చదవండి: ఏటా 100 కోట్ల మంది చిన్నారులపై హింస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.