ETV Bharat / international

మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహం ధ్వంసం

author img

By

Published : Aug 18, 2021, 7:27 AM IST

పాకిస్థాన్​, లాహోర్‌ కోటలో నెలకొల్పిన సిక్కు పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌ కాంస్య విగ్రహాన్ని ఓ అరాచకవాది మంగళవారం ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి అజ్ఞానులే పాక్‌ అంతర్జాతీయ ప్రతిష్ఠకు ప్రమాదకరం అని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ చౌధరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

maharaja ranjit singh statue vendalised
మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహం ధ్వంసం

పాకిస్థాన్‌లోని లాహోర్‌ కోటలో ఉన్న సిక్కు పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌ కాంస్య విగ్రహాన్ని ఓ అరాచకవాది మంగళవారం ధ్వంసం చేశాడు. నిషేధిత తెహ్రీక్‌-ఇ-లబ్బాయిక్‌ పాకిస్థాన్‌(టీఎల్‌పీ) సంస్థకు చెందిన అతడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అందులో ఆ వ్యక్తి గట్టిగా నినాదాలు చేస్తూ విగ్రహం చేతిని విరగ్గొట్టి, గుర్రంపై కూర్చున్నట్లున్న రంజిత్​ సింగ్‌ బొమ్మను కూలదోసి నేలమీద విసిరేయడం కనిపించింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి అజ్ఞానులే పాక్‌ అంతర్జాతీయ ప్రతిష్ఠకు ప్రమాదకరం అని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ చౌధరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇది పాక్‌ గౌరవానికి భంగం కలిగించే యత్నం అని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రత్యేక రాజకీయ ప్రతినిధి షాబాజ్‌ గిల్‌ వ్యాఖ్యానించారు. 2019 జూన్‌లో నెలకొల్పిన ఈ విగ్రహంపై గతేడాదీ దాడి జరిగింది.

మైనార్టీల్లో భయం కలిగించే చర్య: భారత్‌

రంజిత్‌ సింగ్‌ విగ్రహ ధ్వంసం ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడుల వల్ల మైనార్టీ ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయని పేర్కొంది. వీటిని అరికట్టడంలో పాక్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది.

పాకిస్థాన్‌లోని లాహోర్‌ కోటలో ఉన్న సిక్కు పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌ కాంస్య విగ్రహాన్ని ఓ అరాచకవాది మంగళవారం ధ్వంసం చేశాడు. నిషేధిత తెహ్రీక్‌-ఇ-లబ్బాయిక్‌ పాకిస్థాన్‌(టీఎల్‌పీ) సంస్థకు చెందిన అతడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అందులో ఆ వ్యక్తి గట్టిగా నినాదాలు చేస్తూ విగ్రహం చేతిని విరగ్గొట్టి, గుర్రంపై కూర్చున్నట్లున్న రంజిత్​ సింగ్‌ బొమ్మను కూలదోసి నేలమీద విసిరేయడం కనిపించింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి అజ్ఞానులే పాక్‌ అంతర్జాతీయ ప్రతిష్ఠకు ప్రమాదకరం అని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ చౌధరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇది పాక్‌ గౌరవానికి భంగం కలిగించే యత్నం అని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రత్యేక రాజకీయ ప్రతినిధి షాబాజ్‌ గిల్‌ వ్యాఖ్యానించారు. 2019 జూన్‌లో నెలకొల్పిన ఈ విగ్రహంపై గతేడాదీ దాడి జరిగింది.

మైనార్టీల్లో భయం కలిగించే చర్య: భారత్‌

రంజిత్‌ సింగ్‌ విగ్రహ ధ్వంసం ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడుల వల్ల మైనార్టీ ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయని పేర్కొంది. వీటిని అరికట్టడంలో పాక్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది.

ఇదీ చదవండి:శాంతి జపంతో మీడియా ముందుకు తాలిబన్లు

'తాలిబన్ల చేతిలో చావు కోసం ఎదురుచూస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.