ETV Bharat / international

సుదూర సెల్ఫీ

చంద్రుడిపైకి ఇజ్రాయెల్ పంపిన తొలి అంతరిక్షనౌక 'బెరేషీట్' మొదటి సెల్ఫీ పంపింది. బెరే​షీట్​ వెనుక భాగంలో భూమి ప్రకాశవంతంగా కనిపిస్తోన్న చిత్రాలను ఇజ్రాయెల్​లోని అంతరిక్ష కేంద్రానికి పంపినట్లు అధికారులు ప్రకటించారు.

author img

By

Published : Mar 6, 2019, 5:10 PM IST

సుదూర సెల్ఫీ

చంద్రుడి మీదకి ఇజ్రాయెల్ తొలిసారి ప్రయోగించిన 'బెరేషీట్' అంతరిక్ష నౌక సెల్ఫీ తీసి భూమికి పంపింది. ఈ చిత్రంలో బెరే​షీట్​ వెనుకనున్న భాగాలతో పాటు సుదూరంగా భూమి స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్​లోని ఎహుద్​లో ఉన్న అంతరిక్ష కేంద్రానికి దీన్ని పంపింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ధ్రువీకరించారు. భూమికి 37,600 కిలోమీటర్ల దూరంలో ఈ నౌక ఉన్నట్లు తెలిపారు. ఈ స్పేస్​ క్రాఫ్ట్​లో 'చిన్నదేశం పెద్ద కలలు' అని రాసిన ఇజ్రాయెల్​ జాతీయ పతాకం కూడా ఉంది.

ఎన్​జీఓ స్పేస్​ ఐఎల్ సంస్థ​, ఇజ్రాయెల్​ ఏరోస్పేస్​​ ఇండస్ట్రీస్​ సంయుక్తంగా ఈ మానవ రహిత బెరే​షీట్ అంతరిక్ష నౌక ప్రయోగాన్ని నిర్వహించాయి. ఫ్లోరిడాలోని కేప్ కనావ్రాల్​ ప్రాంతం నుంచి ఫిబ్రవరి 22న ఈ అంతరిక్షనౌకను పంపారు. చంద్రుని పుట్టుక రహస్యం తెలుసుకునేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. అమెరికా కేంద్రంగా ఉన్న స్పేస్ఎక్స్​ కంపెనీకి చెందిన 'ఫాల్కన్​ 9' రాకెట్​లో 585 కిలోల ఈ అంతరిక్ష నౌకను చంద్రుడి వద్దకు పంపారు. దీని అంతరిక్ష ప్రయాణం 7 వారాల పాటు సాగనుంది. ఆ తర్వాత ​ ఏప్రిల్​ 11న చంద్రున్ని చేరనుంది.

ఎందుకీ ప్రయోగం

చంద్రున్ని చేరడమే ఇజ్రాయెల్​ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. అయితే చంద్రుడి అయస్కాంత క్షేత్రాన్ని కొలిచే కొన్ని రకాల శాస్త్రీయ ఉపకరణాలను సైతం ఇందులో పొందుపరిచారు.
వీటితో పాటు డిజిటల్​ బైబిల్​, ఇజ్రాయెల్ పాటలు, ఇజ్రాయెల్ జాతీయ జెండాల టైం క్యాప్సుల్​ను ఉంచారు.

ఇప్పటి వరకు చంద్రున్ని చేరిన దేశాలు

undefined

చాలా ఏళ్ల క్రితం రష్యా, అమెరికాకు చెందిన అంతరిక్షనౌకలు మాత్రమే 3,84,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రున్ని చేరాయి. ఆ తర్వాత చైనాకు చెందిన అంతరిక్షనౌక ఇటీవల విజయవంతంగా చంద్రుడిపై ఉపగ్రహాన్ని పంపి ఈ వరుసలో మూడో స్థానంలో నిలిచింది. తాజా ప్రయోగంతో ఇజ్రాయెల్​ నాలుగో స్థానంలో నిలువనుంది.

భారత్​ కూడా 'చంద్రయాన్-2'తో చంద్రుడిపైకి అంతరిక్ష నౌక​ను పంపాలని భావిస్తోంది. ఈ ప్రయోగంతో ఒక రోవర్​ను చంద్రుడి ఉపరితలంపై దింపి అక్కడి వాతావరణ సమాచారాన్ని సేకరించాలనేదే 'చంద్రయాన్-2' ఉద్దేశం. ఇదే వరుసలో జపాన్​ కూడా 'స్లిమ్'​ అనే తేలిక పాటి అంతరిక్ష నౌకను పంపాలని భావిస్తోంది. చంద్రుడిపై అగ్ని పర్వతాల అధ్యయనానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.

అమెరికా మరో సారి!

అమెరికా 1972 తర్వాత మళ్లీ చంద్రుడి పైకి రాకెట్​లను పంపలేదు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మార్గదర్శకాలతో మరోసారి చంద్రుడిపైకి రాకెట్​ పంపనున్నట్లు నాసా 2017లో వెల్లడించింది.

చంద్రుడి మీదకి ఇజ్రాయెల్ తొలిసారి ప్రయోగించిన 'బెరేషీట్' అంతరిక్ష నౌక సెల్ఫీ తీసి భూమికి పంపింది. ఈ చిత్రంలో బెరే​షీట్​ వెనుకనున్న భాగాలతో పాటు సుదూరంగా భూమి స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్​లోని ఎహుద్​లో ఉన్న అంతరిక్ష కేంద్రానికి దీన్ని పంపింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ధ్రువీకరించారు. భూమికి 37,600 కిలోమీటర్ల దూరంలో ఈ నౌక ఉన్నట్లు తెలిపారు. ఈ స్పేస్​ క్రాఫ్ట్​లో 'చిన్నదేశం పెద్ద కలలు' అని రాసిన ఇజ్రాయెల్​ జాతీయ పతాకం కూడా ఉంది.

ఎన్​జీఓ స్పేస్​ ఐఎల్ సంస్థ​, ఇజ్రాయెల్​ ఏరోస్పేస్​​ ఇండస్ట్రీస్​ సంయుక్తంగా ఈ మానవ రహిత బెరే​షీట్ అంతరిక్ష నౌక ప్రయోగాన్ని నిర్వహించాయి. ఫ్లోరిడాలోని కేప్ కనావ్రాల్​ ప్రాంతం నుంచి ఫిబ్రవరి 22న ఈ అంతరిక్షనౌకను పంపారు. చంద్రుని పుట్టుక రహస్యం తెలుసుకునేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. అమెరికా కేంద్రంగా ఉన్న స్పేస్ఎక్స్​ కంపెనీకి చెందిన 'ఫాల్కన్​ 9' రాకెట్​లో 585 కిలోల ఈ అంతరిక్ష నౌకను చంద్రుడి వద్దకు పంపారు. దీని అంతరిక్ష ప్రయాణం 7 వారాల పాటు సాగనుంది. ఆ తర్వాత ​ ఏప్రిల్​ 11న చంద్రున్ని చేరనుంది.

ఎందుకీ ప్రయోగం

చంద్రున్ని చేరడమే ఇజ్రాయెల్​ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. అయితే చంద్రుడి అయస్కాంత క్షేత్రాన్ని కొలిచే కొన్ని రకాల శాస్త్రీయ ఉపకరణాలను సైతం ఇందులో పొందుపరిచారు.
వీటితో పాటు డిజిటల్​ బైబిల్​, ఇజ్రాయెల్ పాటలు, ఇజ్రాయెల్ జాతీయ జెండాల టైం క్యాప్సుల్​ను ఉంచారు.

ఇప్పటి వరకు చంద్రున్ని చేరిన దేశాలు

undefined

చాలా ఏళ్ల క్రితం రష్యా, అమెరికాకు చెందిన అంతరిక్షనౌకలు మాత్రమే 3,84,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రున్ని చేరాయి. ఆ తర్వాత చైనాకు చెందిన అంతరిక్షనౌక ఇటీవల విజయవంతంగా చంద్రుడిపై ఉపగ్రహాన్ని పంపి ఈ వరుసలో మూడో స్థానంలో నిలిచింది. తాజా ప్రయోగంతో ఇజ్రాయెల్​ నాలుగో స్థానంలో నిలువనుంది.

భారత్​ కూడా 'చంద్రయాన్-2'తో చంద్రుడిపైకి అంతరిక్ష నౌక​ను పంపాలని భావిస్తోంది. ఈ ప్రయోగంతో ఒక రోవర్​ను చంద్రుడి ఉపరితలంపై దింపి అక్కడి వాతావరణ సమాచారాన్ని సేకరించాలనేదే 'చంద్రయాన్-2' ఉద్దేశం. ఇదే వరుసలో జపాన్​ కూడా 'స్లిమ్'​ అనే తేలిక పాటి అంతరిక్ష నౌకను పంపాలని భావిస్తోంది. చంద్రుడిపై అగ్ని పర్వతాల అధ్యయనానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.

అమెరికా మరో సారి!

అమెరికా 1972 తర్వాత మళ్లీ చంద్రుడి పైకి రాకెట్​లను పంపలేదు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మార్గదర్శకాలతో మరోసారి చంద్రుడిపైకి రాకెట్​ పంపనున్నట్లు నాసా 2017లో వెల్లడించింది.

Intro:Body:

a


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.