ETV Bharat / international

భారత్ ఎఫ్​డీఐ నిబంధనలపై చైనా అక్కసు

author img

By

Published : Apr 20, 2020, 3:20 PM IST

దేశీయ వాణిజ్యంపై ఇతర దేశాలు పట్టుపెంచుకోకుండా ఉండే దిశగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో భారత్​ చేసిన మార్పులపై స్పందించింది చైనా. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మార్గదర్శకాలను భారత విధానాలు ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఆక్షేపించింది. స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా భారత్ ఎఫ్​డీఐ విధానాన్ని అమలు చేస్తోందని పేర్కొంది.

fdi policy
భారత్ ఎఫ్​డీఐ నిబంధనలపై చైనా అక్కసు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్​డీఐ)విధానంలో భారత్ చేసిన కీలక మార్పులపై అక్కసు వెళ్లగక్కింది చైనా. భారత్ తాజాగా అమలు చేస్తున్న నిబంధనలు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది.

డబ్ల్యూటీఓ నిబంధన అయిన స్వేచ్ఛా వాణిజ్య సూత్రానికి విరుద్ధమైన నియమావళిని భారత్ అనుసరిస్తోందని విమర్శించింది చైనా. భారత్​లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.

"డబ్ల్యూటీఓ నిర్దేశించిన 'పక్షపాతం లేని వైఖరి' నిబంధనను భారత్​ అనుసరిస్తున్న ఎఫ్​డీఐ విధానం ఉల్లంఘిస్తోంది. సరళీకృత, సులభతర వాణిజ్య, పెట్టుబడి విధానాలకు భారత విధానం వ్యతిరేకం."

-జి రాంగ్, చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి.

ఇదీ నేపథ్యం..

కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతర దేశాలు భారత సంస్థల్లో వాటాలు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు.. దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. దీనిపైనే చైనా తన అక్కసు వెళ్లగక్కింది.

ఇదీ చూడండి: ద్రవ్యలభ్యత కోసం అసాధారణ విధానాలే శరణ్యమా?

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్​డీఐ)విధానంలో భారత్ చేసిన కీలక మార్పులపై అక్కసు వెళ్లగక్కింది చైనా. భారత్ తాజాగా అమలు చేస్తున్న నిబంధనలు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది.

డబ్ల్యూటీఓ నిబంధన అయిన స్వేచ్ఛా వాణిజ్య సూత్రానికి విరుద్ధమైన నియమావళిని భారత్ అనుసరిస్తోందని విమర్శించింది చైనా. భారత్​లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.

"డబ్ల్యూటీఓ నిర్దేశించిన 'పక్షపాతం లేని వైఖరి' నిబంధనను భారత్​ అనుసరిస్తున్న ఎఫ్​డీఐ విధానం ఉల్లంఘిస్తోంది. సరళీకృత, సులభతర వాణిజ్య, పెట్టుబడి విధానాలకు భారత విధానం వ్యతిరేకం."

-జి రాంగ్, చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి.

ఇదీ నేపథ్యం..

కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతర దేశాలు భారత సంస్థల్లో వాటాలు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు.. దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. దీనిపైనే చైనా తన అక్కసు వెళ్లగక్కింది.

ఇదీ చూడండి: ద్రవ్యలభ్యత కోసం అసాధారణ విధానాలే శరణ్యమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.