ETV Bharat / international

తెలియకుండానే భారత్ ఒప్పుకుంది: చైనా

author img

By

Published : Feb 9, 2021, 3:09 PM IST

భారత్‌ తెలియకుండానే సరిహద్దు ఉద్రిక్తతల్లో తన ప్రమేయాన్ని అంగీకరించిందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్ అడ్డగోలు వాఖ్యలు చేశారు. చైనా తీరును ఎండగడుతూ.. కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు స్పందించారు.

India unwitting confesses trespassing on border: China
'ఆ విషయాన్ని తెలియకుండానే భారత్ ఒప్పుకుంది'

సరిహద్దులో అతిక్రమణలకు పాల్పడినట్లు భారత్ తనకు తెలియకుండానే ఒప్పుకుందని చైనా అడ్డగోలు విమర్శలు చేసింది. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలకు భారత్‌ కారణమంటూ నోరుపారేసుకుంది. ఆదివారం కేంద్ర మంత్రి వీకే సింగ్ మాట్లాడుతూ.. భారత్‌, చైనా సరిహద్దులను అధికారికంగా గుర్తించలేదని వెల్లడించారు. "చైనా 10 సార్లు అతిక్రమణలకు పాల్పడితే.. మనం 50 సార్లు అతిక్రమణలు చేయాలి. చైనా విస్తరణ కాంక్షతో దురాక్రమణకు పాల్పడుతోంది. కానీ, దాని ఆటలు సాగవని కేంద్రం భరోసా ఇచ్చింది" అని చైనా తీరును మంత్రి ఎండగట్టారు.

వీకే సింగ్ విమర్శలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ స్పందించారు. "భారత్‌ తెలియకుండానే సరిహద్దు ఉద్రిక్తతల్లో తన ప్రమేయాన్ని అంగీకరించింది. మా భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నంలో భాగంగా ఆ దేశం తరచూ దురాక్రమణలకు పాల్పడుతోంది" అని భారత్‌పై నోరుపారేసుకున్నారు.

గత సంవత్సరం మే నుంచి తూర్పు లద్దాఖ్ సరిహద్దు వద్ద భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూన్‌లో గల్వాన్‌ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ వల్ల ప్రాణనష్టం కూడా సంభవించింది. ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు.

ఇదీ చూడండి: ఆంక్షలు బేఖాతరు- ఆగని కిమ్ అణు కార్యకలాపాలు

సరిహద్దులో అతిక్రమణలకు పాల్పడినట్లు భారత్ తనకు తెలియకుండానే ఒప్పుకుందని చైనా అడ్డగోలు విమర్శలు చేసింది. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలకు భారత్‌ కారణమంటూ నోరుపారేసుకుంది. ఆదివారం కేంద్ర మంత్రి వీకే సింగ్ మాట్లాడుతూ.. భారత్‌, చైనా సరిహద్దులను అధికారికంగా గుర్తించలేదని వెల్లడించారు. "చైనా 10 సార్లు అతిక్రమణలకు పాల్పడితే.. మనం 50 సార్లు అతిక్రమణలు చేయాలి. చైనా విస్తరణ కాంక్షతో దురాక్రమణకు పాల్పడుతోంది. కానీ, దాని ఆటలు సాగవని కేంద్రం భరోసా ఇచ్చింది" అని చైనా తీరును మంత్రి ఎండగట్టారు.

వీకే సింగ్ విమర్శలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ స్పందించారు. "భారత్‌ తెలియకుండానే సరిహద్దు ఉద్రిక్తతల్లో తన ప్రమేయాన్ని అంగీకరించింది. మా భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నంలో భాగంగా ఆ దేశం తరచూ దురాక్రమణలకు పాల్పడుతోంది" అని భారత్‌పై నోరుపారేసుకున్నారు.

గత సంవత్సరం మే నుంచి తూర్పు లద్దాఖ్ సరిహద్దు వద్ద భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూన్‌లో గల్వాన్‌ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ వల్ల ప్రాణనష్టం కూడా సంభవించింది. ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు.

ఇదీ చూడండి: ఆంక్షలు బేఖాతరు- ఆగని కిమ్ అణు కార్యకలాపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.