ETV Bharat / international

నేపాల్​ టు భారత్​ బైక్​ ర్యాలీ.. సంబంధాల బలోపేతమే లక్ష్యంగా.. - ఇండియా మోటార్ సైకిల్​ ర్యాలీ

పశుపతినాథ్​- కాశీనాథ్​ అమృత్​ మహోత్సవ్​ పేరుతో నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం మోటార్​ సైకిల్​ ర్యాలీని నిర్వహించనుంది. ఈ నెల 11 నుంచి 16 వరకు ఈ ర్యాలీ జరగనుంది.

India-Nepal
భారత్ , నేపాల్​
author img

By

Published : Nov 9, 2021, 9:32 AM IST

నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం మోటార్​ సైకిల్​ ర్యాలీని నిర్వహించనుంది. రెండు దేశాలలోని ఆధ్యాత్మిక, సంస్కృతిక పట్టణాలు అయిన కాఠ్​మాండూ, వారణాశిల మధ్య ఈ ర్యాలీ జరగనుంది. 'పశుపతినాథ్​- కాశీ విశ్వనాథ్​ అమృత్​ మహోత్సవ్​' పేరుతో దీనిని నిర్వహించనున్నారు. రాయల్​ ఎన్​ఫీల్డ్​తో సహకారంతో ఈ నెల 11 నుంచి 16 వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఈ ర్యాలీలో సుమారు 50 మంది భారతీయ, నేపాల్​ పౌరులు పాల్గొననున్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య అనుబంధాన్ని ప్రోత్సహించడం సహా రెండు దేశాల యువకుల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు రాయబార కార్యాలయం పేర్కొంది.

స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా మహాత్మా గాంధీ చంపారన్​ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మోతీహరిని కూడా ఈ ర్యాలీలో భాగంగా బైకర్లు సందర్శిస్తారు. అంతేగాకుండా సారనాథ్, గోరఖ్‌నాథ్ మఠం లాంటి వాటిని కూడా సందర్శించనున్నారు. ఈ ర్యాలీ భారత్​- నేపాల్​ మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు ఎంత బలమైనవనేది నిరూపిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: హైస్పీడ్​ రైలులో బోగీకి నిప్పంటించిన దుండగుడు.. చివరకు...

నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం మోటార్​ సైకిల్​ ర్యాలీని నిర్వహించనుంది. రెండు దేశాలలోని ఆధ్యాత్మిక, సంస్కృతిక పట్టణాలు అయిన కాఠ్​మాండూ, వారణాశిల మధ్య ఈ ర్యాలీ జరగనుంది. 'పశుపతినాథ్​- కాశీ విశ్వనాథ్​ అమృత్​ మహోత్సవ్​' పేరుతో దీనిని నిర్వహించనున్నారు. రాయల్​ ఎన్​ఫీల్డ్​తో సహకారంతో ఈ నెల 11 నుంచి 16 వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఈ ర్యాలీలో సుమారు 50 మంది భారతీయ, నేపాల్​ పౌరులు పాల్గొననున్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య అనుబంధాన్ని ప్రోత్సహించడం సహా రెండు దేశాల యువకుల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు రాయబార కార్యాలయం పేర్కొంది.

స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా మహాత్మా గాంధీ చంపారన్​ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మోతీహరిని కూడా ఈ ర్యాలీలో భాగంగా బైకర్లు సందర్శిస్తారు. అంతేగాకుండా సారనాథ్, గోరఖ్‌నాథ్ మఠం లాంటి వాటిని కూడా సందర్శించనున్నారు. ఈ ర్యాలీ భారత్​- నేపాల్​ మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు ఎంత బలమైనవనేది నిరూపిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: హైస్పీడ్​ రైలులో బోగీకి నిప్పంటించిన దుండగుడు.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.