ETV Bharat / international

'పాక్​లో దయనీయ స్థితిలో మానవ హక్కులు' - blasphemy laws

పాక్​లో దయనీయ స్థితిలో ఉన్న మానవహక్కులపై వెంటనే దృష్టి సారించాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘాన్ని భారత్​ కోరింది. ఆ దేశంలోని మైనారిటీలపై పాకిస్థాన్​ వివక్షచూపుతోందని మండిపడింది. పాక్​.. తన ప్రసంగాలు మానుకొని దేశంలో ఇబ్బందులు పడుతున్న లక్షలాదిమంది ప్రజలపై దృష్టిసారించాలని సూచించింది.

India asks UNHRC to pay urgent attention to Pakistan's deplorable human rights records
'పాక్​లో దయనీయ స్థితిలో మానవ హక్కులు'
author img

By

Published : Mar 16, 2021, 4:55 AM IST

పాకిస్థాన్​లో దయనీయ పరిస్థితిలోకి వెళ్లిన మానవహక్కులపై తక్షణమే దృష్టి సారించాలని 46వ మానవహక్కుల సమావేశంలో యూఎన్​హెచ్​ఆర్సీని భారత్​ కోరింది. పాక్​లోని మైనారిటీలపై.. ఆ దేశ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడింది. పాక్​.. తన ప్రసంగాలు మానుకొని ఇబ్బందులు పడుతున్న లక్షలాదిమంది ప్రజలపై దృష్టిసారించాలని యూఎన్​హెచ్​ఆర్సీలో భారత శాశ్వత సెక్రటరీ పవన్​కుమార్​ బాదే అన్నారు.

" పాక్​లో దయనీయస్థితిలోకి వెళ్లిన మానవహక్కులపై వెంటనే ఈ సంఘం దృష్టిసారించాలి. అక్కడి మైనారిటీ వర్గాలపై వివక్ష చూపుతోంది పాక్​. ప్రపంచదేశాల్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోంది."

-- పవన్​కుమార్​ బాదే, యూఎన్​హెచ్​ఆర్సీలో భారత శాశ్వత సెక్రటరీ

పాకిస్థాన్​ తన వివాదస్పద మత చట్టాలతో మైనారిటీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని యూఎన్​హెచ్​ఆర్సీలో పవన్​కుమార్​ బాదే తెలిపారు. మత చట్టాల బాధితులు పెరిగిపోతున్నారని వివరించారు.

ఇదీ చదవండి : పాక్​లో గుడి కూల్చేసిన వారికి హిందువుల క్షమాభిక్ష

పాకిస్థాన్​లో దయనీయ పరిస్థితిలోకి వెళ్లిన మానవహక్కులపై తక్షణమే దృష్టి సారించాలని 46వ మానవహక్కుల సమావేశంలో యూఎన్​హెచ్​ఆర్సీని భారత్​ కోరింది. పాక్​లోని మైనారిటీలపై.. ఆ దేశ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడింది. పాక్​.. తన ప్రసంగాలు మానుకొని ఇబ్బందులు పడుతున్న లక్షలాదిమంది ప్రజలపై దృష్టిసారించాలని యూఎన్​హెచ్​ఆర్సీలో భారత శాశ్వత సెక్రటరీ పవన్​కుమార్​ బాదే అన్నారు.

" పాక్​లో దయనీయస్థితిలోకి వెళ్లిన మానవహక్కులపై వెంటనే ఈ సంఘం దృష్టిసారించాలి. అక్కడి మైనారిటీ వర్గాలపై వివక్ష చూపుతోంది పాక్​. ప్రపంచదేశాల్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోంది."

-- పవన్​కుమార్​ బాదే, యూఎన్​హెచ్​ఆర్సీలో భారత శాశ్వత సెక్రటరీ

పాకిస్థాన్​ తన వివాదస్పద మత చట్టాలతో మైనారిటీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని యూఎన్​హెచ్​ఆర్సీలో పవన్​కుమార్​ బాదే తెలిపారు. మత చట్టాల బాధితులు పెరిగిపోతున్నారని వివరించారు.

ఇదీ చదవండి : పాక్​లో గుడి కూల్చేసిన వారికి హిందువుల క్షమాభిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.