పాకిస్థాన్ సింధ్ రాష్ట్రం బదిన్ జిల్లాలో ఓ హిందూ దేవాలయాన్ని ఒక వ్యక్తి ధ్వంసం చేశాడు. మహ్మద్ ఇస్మాయిల్ ఈ పని చేసి, పరారయ్యాడని అశోక్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని గంటల్లోనే అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు బదిన్ పోలీసులు తెలిపారు.
నిందితుడు ఇస్మాయిల్ మానసికస్థితి స్థిరంగా ఉందా ? కావాలనే అతడు విగ్రహాలను ధ్వంసం చేశాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. ఘటన జరిగిన 24 గంటల్లోనే దర్యాప్తు ప్రారంభించాం.
-బదిన్ జిల్లా ఎస్పీ షబీర్ సెతార్
ముస్లింల తర్వాత పాకిస్థాన్లో హిందువులే అధికం. అధికార వర్గాల ప్రకారం దాదాపు 75 లక్షల మంది హిందువులు ఉన్నారు. సింధ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.