ETV Bharat / international

'మనుషులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్​ సక్సెస్'​

author img

By

Published : May 23, 2020, 12:57 PM IST

Updated : May 23, 2020, 1:43 PM IST

మానవులపై నిర్వహించిన కరోనా వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్స్​ విజయవంతమైనట్లు చైనా పరిశోధకులు తెలిపారు. వైరస్​ను ఎదుర్కొనేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించే సామర్థ్యం ఈ వ్యాక్సిన్​కు ఉన్నట్లు వెల్లడించారు.

VIRUS-VACCINE-HUMAN TRIAL
మానవులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్​ సక్సెస్​

కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధిలో చైనా పరిశోధకులు కీలక పురోగతి సాధించారు. మానవులపై మొదటి దశ ట్రయల్స్​ ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్​ సురక్షితమైనదని, వైరస్​ను నిలువరించగల రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు లాన్సెట్ జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

108 మందిపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించారు. కరోనా వైరస్​పై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీస్​ను ఉత్పత్తి చేయడమే కాక, రోగనిరోధక వ్యవస్థలోని టీ-సెల్స్ ప్రతిస్పందించినట్లు తేల్చారు. అయితే సార్స్​-కొవ్-2 వైరస్ బారి నుంచి ఈ వాక్సిన్ రక్షిస్తుందో లేదో నిర్ధరించేందుకు మరింత పరిశోధన జరగాల్సి ఉందని బీజింగ్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

108 మందిపై వ్యాక్సిన్​ ట్రయల్స్​ నిర్వహించిన 28 రోజుల అనంతరం మంచి ఫలితాలు వచ్చాయని, 6 నెలల్లోగా తుది ఫలితాలు విశ్లేషించాల్సి ఉంటుందని పరిశోధకులు వివరించారు.

"ఈ వ్యాక్సిన్ ఫలితాలు కీలక మైలురాయిని సూచిస్తాయి. సింగిల్​ డోస్​ Ad5-nCoV(అడినోవైరస్​ టైప్​5 వెక్టార్డ్​ కొవిడ్-19) వ్యాక్సిన్​తో వైరస్​ను నిలువరించే యాంటీబాడీస్, టీ కణాలు 14 రోజుల్లో ఉత్పత్తి అయ్యాయి"

-వీ చెన్​, బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిశోధకులు.

18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల వారిపై వ్యాక్సిన్ ట్రయల్స్​ నిర్వహించినట్లు చెప్పారు చిన్. 28 రోజుల తర్వాత వారిపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేవని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధిలో చైనా పరిశోధకులు కీలక పురోగతి సాధించారు. మానవులపై మొదటి దశ ట్రయల్స్​ ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్​ సురక్షితమైనదని, వైరస్​ను నిలువరించగల రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు లాన్సెట్ జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

108 మందిపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించారు. కరోనా వైరస్​పై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీస్​ను ఉత్పత్తి చేయడమే కాక, రోగనిరోధక వ్యవస్థలోని టీ-సెల్స్ ప్రతిస్పందించినట్లు తేల్చారు. అయితే సార్స్​-కొవ్-2 వైరస్ బారి నుంచి ఈ వాక్సిన్ రక్షిస్తుందో లేదో నిర్ధరించేందుకు మరింత పరిశోధన జరగాల్సి ఉందని బీజింగ్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

108 మందిపై వ్యాక్సిన్​ ట్రయల్స్​ నిర్వహించిన 28 రోజుల అనంతరం మంచి ఫలితాలు వచ్చాయని, 6 నెలల్లోగా తుది ఫలితాలు విశ్లేషించాల్సి ఉంటుందని పరిశోధకులు వివరించారు.

"ఈ వ్యాక్సిన్ ఫలితాలు కీలక మైలురాయిని సూచిస్తాయి. సింగిల్​ డోస్​ Ad5-nCoV(అడినోవైరస్​ టైప్​5 వెక్టార్డ్​ కొవిడ్-19) వ్యాక్సిన్​తో వైరస్​ను నిలువరించే యాంటీబాడీస్, టీ కణాలు 14 రోజుల్లో ఉత్పత్తి అయ్యాయి"

-వీ చెన్​, బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిశోధకులు.

18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల వారిపై వ్యాక్సిన్ ట్రయల్స్​ నిర్వహించినట్లు చెప్పారు చిన్. 28 రోజుల తర్వాత వారిపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేవని తెలిపారు.

Last Updated : May 23, 2020, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.