ETV Bharat / international

సాగర గర్భంలో చైనా డ్రోన్లు- భారత్‌ లక్ష్యంగా ఎత్తులు

author img

By

Published : Jan 1, 2021, 7:35 AM IST

గుట్టుచప్పుడు కాకుండా హిందూ మహాసముద్రంలో చైనా జలాంతర డ్రోన్లను భారీగా మోహరించింది. 'సీ వింగ్‌' అనే ఈ సాధనాలు నెలల తరబడి రహస్యంగా కార్యకలాపాలు సాగించగలవు. భారత యుద్ధనౌకల కదలికలపై సమాచారాన్ని సేకరించేందుకే చైనా వీటిని మోహరించిందని రక్షణ విశ్లేషకుడు హెచ్‌ఐ సట్టన్‌ పేర్కొన్నారు.

China
సాగర గర్భంలో చైనా డ్రోన్లు- భారత్‌ లక్ష్యంగా ఎత్తుగడలు

హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యానికి సవాల్‌ విసిరేలా చైనా కొత్త ఎత్తుగడలు వేస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ సాగరంలో జలాంతర డ్రోన్లను భారీగా మోహరించింది. 'సీ వింగ్‌' అనే ఈ సాధనాలు నెలల తరబడి రహస్యంగా కార్యకలాపాలు సాగించగలవు. ప్రత్యర్థి యుద్ధనౌకల కదలికలపై సమాచారాన్ని సేకరించేందుకు ఇవి ఉపయోగపడతాయని రక్షణ విశ్లేషకుడు హెచ్‌ఐ సట్టన్‌ పేర్కొన్నారు.

ఈ డ్రోన్‌.. ఒకరకమైన మానవరహిత వాహనం (యూయూవీ). వీటిని 2019 డిసెంబర్‌లో చైనా రంగంలోకి దించింది. దాదాపు 3400 పరిశీలనలు చేపట్టాక ఫిబ్రవరిలో వాటిని వెలికి తీసింది. గతంలో అమెరికా నౌకాదళం లిట్టోరల్‌ బ్యాటిల్‌స్పేస్‌ సెన్సింగ్‌-గ్లైడర్‌ (ఎల్‌బీఎస్‌-జీ) అనే డ్రోన్‌ను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. దీన్ని 2016 డిసెంబర్‌ 15న చైనా స్వాధీనం చేసుకుంది. వివాదం ముదరడంతో అమెరికాకు తిరిగి అప్పగించింది. ఆ తర్వాత అచ్చంగా అలాంటి సాధనాన్నే చైనా తయారు చేయడం గమనార్హం. ‘రివర్స్‌ ఇంజినీరింగ్‌’ పద్ధతిలో ఇతర దేశాల ఆయుధాలను కాపీ కొట్టడంలో డ్రాగన్‌కు అద్భుత ప్రావీణ్యం ఉంది.

గ్లైడ్‌లా..

'సీ వింగ్‌' నడవడానికి ఎలాంటి యంత్రాలు అవసరం లేదు. భారీ రెక్కల సాయంతో అది గ్లైడ్‌లా కదులుతుంది. ఇందులో బెలూన్‌లాంటి సాధనం ఉంటుంది. అందులో పీడనంతో కూడిన ఆయిల్‌ ఉంటుంది. ఈ ఆయిల్‌ నిండినప్పుడు ఇది ఉబ్బెత్తుగా మారుతుంది. ఫలితంగా ఈ డ్రోన్‌ నీటి కిందకు వెళ్లిపోతుంది. కొద్దిసేపటి తర్వాత బెలూన్‌లోని ఆయిల్‌ బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా డ్రోన్‌ నీటిపైకి వస్తుంది. ఈ రెండు రకాల విధానాల ద్వారా దీని పయనం సాగుతుంది. దీని తోక భాగంలో యాంటెన్నా ఉంటుంది. దీని సాయంతో చైనా యుద్ధనౌకలకు సమాచారాన్ని చేరవేస్తుంది. వేగంగా ప్రయాణించడం, చురుగ్గా విన్యాసాలు చేసే సామర్థ్యం లేకపోయినప్పటికీ దీర్ఘకాల నిఘా అవసరాలకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

విస్తృతంగా..

ఇప్పుడు హిందూ మహాసముద్రంలో సీ వింగ్‌లను పెద్ద సంఖ్యలో చైనా మోహరిస్తోంది. అక్కడ 14 డ్రోన్లను మోహరించాలని తొలుత డ్రాగన్‌ భావించింది. 12 డ్రోన్లను మాత్రమే దించింది. సముద్ర పరిశీలనలకు వీటిని దించుతున్నట్లు చైనా చెబుతోంది. ఈ వాదన చాలా విడ్డూరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. నౌకాదళ నిఘా అవసరాలకే వీటిని ఉపయోగిస్తుంటారని తెలిపారు. ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో అది ఇండోనేసియా మత్స్యకారులకు కనిపించింది. దక్షిణ చైనా సముద్రం నుంచి హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న రెండు జల సంధుల్లో వీటిని చూసినట్లు వారు తెలిపారు.

హిందూ సాగరంపై పట్టు కోసమేనా?

వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హిందూ మహాసముద్రంపై పట్టు బిగించేందుకు అనేక దేశాల మధ్య పోటీ నెలకొన్నట్లు భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఇటీవల ఒక సదస్సులో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో స్థావరాల ఏర్పాటుకు అవి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. "సైనిక రంగంలో సాంకేతికత అనేది రక్షణ సాధనంగానే ఉండాలి. అది విధ్వంస కారకం కాకూడదు. భారత దృక్కోణం కూడా మారాలి. ఒంటరి విధానాన్ని వీడి, బహుళపక్ష విధానంలోకి మళ్లాలి. దీనికింద భాగస్వామ్య దేశాలతో శిక్షణ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసుకోవాలి. మనం ఎదుర్కొంటున్న సవాళ్ల రీత్యా సామర్థ్య పెంపుపై మనకు దీర్ఘకాల నిర్మాణాత్మక ప్రణాళిక అవసరం" అని తెలిపారు.

హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యానికి సవాల్‌ విసిరేలా చైనా కొత్త ఎత్తుగడలు వేస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ సాగరంలో జలాంతర డ్రోన్లను భారీగా మోహరించింది. 'సీ వింగ్‌' అనే ఈ సాధనాలు నెలల తరబడి రహస్యంగా కార్యకలాపాలు సాగించగలవు. ప్రత్యర్థి యుద్ధనౌకల కదలికలపై సమాచారాన్ని సేకరించేందుకు ఇవి ఉపయోగపడతాయని రక్షణ విశ్లేషకుడు హెచ్‌ఐ సట్టన్‌ పేర్కొన్నారు.

ఈ డ్రోన్‌.. ఒకరకమైన మానవరహిత వాహనం (యూయూవీ). వీటిని 2019 డిసెంబర్‌లో చైనా రంగంలోకి దించింది. దాదాపు 3400 పరిశీలనలు చేపట్టాక ఫిబ్రవరిలో వాటిని వెలికి తీసింది. గతంలో అమెరికా నౌకాదళం లిట్టోరల్‌ బ్యాటిల్‌స్పేస్‌ సెన్సింగ్‌-గ్లైడర్‌ (ఎల్‌బీఎస్‌-జీ) అనే డ్రోన్‌ను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. దీన్ని 2016 డిసెంబర్‌ 15న చైనా స్వాధీనం చేసుకుంది. వివాదం ముదరడంతో అమెరికాకు తిరిగి అప్పగించింది. ఆ తర్వాత అచ్చంగా అలాంటి సాధనాన్నే చైనా తయారు చేయడం గమనార్హం. ‘రివర్స్‌ ఇంజినీరింగ్‌’ పద్ధతిలో ఇతర దేశాల ఆయుధాలను కాపీ కొట్టడంలో డ్రాగన్‌కు అద్భుత ప్రావీణ్యం ఉంది.

గ్లైడ్‌లా..

'సీ వింగ్‌' నడవడానికి ఎలాంటి యంత్రాలు అవసరం లేదు. భారీ రెక్కల సాయంతో అది గ్లైడ్‌లా కదులుతుంది. ఇందులో బెలూన్‌లాంటి సాధనం ఉంటుంది. అందులో పీడనంతో కూడిన ఆయిల్‌ ఉంటుంది. ఈ ఆయిల్‌ నిండినప్పుడు ఇది ఉబ్బెత్తుగా మారుతుంది. ఫలితంగా ఈ డ్రోన్‌ నీటి కిందకు వెళ్లిపోతుంది. కొద్దిసేపటి తర్వాత బెలూన్‌లోని ఆయిల్‌ బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా డ్రోన్‌ నీటిపైకి వస్తుంది. ఈ రెండు రకాల విధానాల ద్వారా దీని పయనం సాగుతుంది. దీని తోక భాగంలో యాంటెన్నా ఉంటుంది. దీని సాయంతో చైనా యుద్ధనౌకలకు సమాచారాన్ని చేరవేస్తుంది. వేగంగా ప్రయాణించడం, చురుగ్గా విన్యాసాలు చేసే సామర్థ్యం లేకపోయినప్పటికీ దీర్ఘకాల నిఘా అవసరాలకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

విస్తృతంగా..

ఇప్పుడు హిందూ మహాసముద్రంలో సీ వింగ్‌లను పెద్ద సంఖ్యలో చైనా మోహరిస్తోంది. అక్కడ 14 డ్రోన్లను మోహరించాలని తొలుత డ్రాగన్‌ భావించింది. 12 డ్రోన్లను మాత్రమే దించింది. సముద్ర పరిశీలనలకు వీటిని దించుతున్నట్లు చైనా చెబుతోంది. ఈ వాదన చాలా విడ్డూరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. నౌకాదళ నిఘా అవసరాలకే వీటిని ఉపయోగిస్తుంటారని తెలిపారు. ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో అది ఇండోనేసియా మత్స్యకారులకు కనిపించింది. దక్షిణ చైనా సముద్రం నుంచి హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న రెండు జల సంధుల్లో వీటిని చూసినట్లు వారు తెలిపారు.

హిందూ సాగరంపై పట్టు కోసమేనా?

వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హిందూ మహాసముద్రంపై పట్టు బిగించేందుకు అనేక దేశాల మధ్య పోటీ నెలకొన్నట్లు భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఇటీవల ఒక సదస్సులో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో స్థావరాల ఏర్పాటుకు అవి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. "సైనిక రంగంలో సాంకేతికత అనేది రక్షణ సాధనంగానే ఉండాలి. అది విధ్వంస కారకం కాకూడదు. భారత దృక్కోణం కూడా మారాలి. ఒంటరి విధానాన్ని వీడి, బహుళపక్ష విధానంలోకి మళ్లాలి. దీనికింద భాగస్వామ్య దేశాలతో శిక్షణ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసుకోవాలి. మనం ఎదుర్కొంటున్న సవాళ్ల రీత్యా సామర్థ్య పెంపుపై మనకు దీర్ఘకాల నిర్మాణాత్మక ప్రణాళిక అవసరం" అని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.