ETV Bharat / international

భారత్​-పాక్​ స్నేహగీతంపై చైనా హర్షం!

author img

By

Published : Mar 29, 2021, 6:41 PM IST

భారత్​, పాక్​ మధ్య జరిగిన చర్చల పట్ల చైనా హర్షం వ్యక్తం చేసింది. ఇరు దేశాల పరస్పర అవగాహనతో ముందుకు సాగడం... ప్రాంతీయ శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు తోడ్పడుతుందని తెలిపింది. ఈ సందర్భంగా.. పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ చేసిన వ్యాఖ్యలను స్వాగతించిన జిన్​పింగ్​ సర్కార్​.. ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంది.

China happy over Pakistan-India active interactions
భారత్​-పాక్​ సంబంధాలతో చైనా సంతృప్తి

భారత్​, పాక్​ మధ్య ఇటీవల జరిగిన చర్చల పట్ల చైనా ఆనందంగా ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ఇది మరింత దోహదపడుతుందని పేర్కొంది. పాక్​తో తాము కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు ఆ దేశం వెల్లడించింది.

కశ్మీర్​, ఇతర సెక్టార్​లలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్​-పాక్​ మధ్య ఫిబ్రవరి 25న చర్చలు జరిగాయి. ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ఇరు దేశాలూ అంగీకరిస్తున్నట్టు ప్రకటించాయి.

పాక్​తో కలిసి ముందుకు..

ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడంపై చైనా హర్షం వ్యక్తం చేసింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం.. పాక్​తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు ఆ విదేశాంగ మంత్రి ఝావ్​ లిజియన్​ తెలిపారు. ఈ సందర్భంగా.. మార్చి 25 పాక్​ అధ్యక్షుడు ఆరిఫ్​ అల్వి చేసిన ప్రసంగం(చైనా తమ దేశానికి అత్యంత సన్నిహిత, స్వేహపూర్వక దేశం)పై స్పందించారు. అల్వి వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామన్నారు. అంతేకాకుండా.. పాకిస్థాన్​ 82వ జాతీయ దినోత్సవం సందర్భంగా.. ఆత్మీయ అభినందనలు తెలిపింది బీజింగ్​ ప్రభుత్వం.

కరోనాపై పోరులో అండ

కరోనాపై పోరాడేందుకు పాక్​తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లిజియన్​ తెలిపారు. దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవం ఇందుకు చక్కటి అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పారు. పాక్​తో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడం సహా.. చైనా-పాక్​ మధ్య మిత్ర బంధాన్ని ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి: నీటిలోకి 'ఎవర్​ గివెన్​' ముందు భాగం!

భారత్​, పాక్​ మధ్య ఇటీవల జరిగిన చర్చల పట్ల చైనా ఆనందంగా ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ఇది మరింత దోహదపడుతుందని పేర్కొంది. పాక్​తో తాము కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు ఆ దేశం వెల్లడించింది.

కశ్మీర్​, ఇతర సెక్టార్​లలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్​-పాక్​ మధ్య ఫిబ్రవరి 25న చర్చలు జరిగాయి. ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ఇరు దేశాలూ అంగీకరిస్తున్నట్టు ప్రకటించాయి.

పాక్​తో కలిసి ముందుకు..

ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడంపై చైనా హర్షం వ్యక్తం చేసింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం.. పాక్​తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు ఆ విదేశాంగ మంత్రి ఝావ్​ లిజియన్​ తెలిపారు. ఈ సందర్భంగా.. మార్చి 25 పాక్​ అధ్యక్షుడు ఆరిఫ్​ అల్వి చేసిన ప్రసంగం(చైనా తమ దేశానికి అత్యంత సన్నిహిత, స్వేహపూర్వక దేశం)పై స్పందించారు. అల్వి వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామన్నారు. అంతేకాకుండా.. పాకిస్థాన్​ 82వ జాతీయ దినోత్సవం సందర్భంగా.. ఆత్మీయ అభినందనలు తెలిపింది బీజింగ్​ ప్రభుత్వం.

కరోనాపై పోరులో అండ

కరోనాపై పోరాడేందుకు పాక్​తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లిజియన్​ తెలిపారు. దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవం ఇందుకు చక్కటి అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పారు. పాక్​తో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడం సహా.. చైనా-పాక్​ మధ్య మిత్ర బంధాన్ని ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి: నీటిలోకి 'ఎవర్​ గివెన్​' ముందు భాగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.