ETV Bharat / international

'చైనాతో యథాతథ సంబంధాలు కష్టమే' - బ్రిక్స్​ సదస్సుపై అశోక్​ సజ్జనార్​

భారత్​ వేదికగా నిర్వహించనున్న 'బ్రిక్స్​-2021' శిఖరాగ్ర సదస్సుకు చైనా మద్దతు పలకడం సానూకూలాంశమే అని మాజీ రాయబారి అశోక్​ సజ్జనార్​ అభిప్రాయపడ్డారు. చైనాతో దౌత్య బంధంపై 'ఈటీవీ-భారత్'​తో పలు కీలక విషయాలు పంచుకున్నారు.

BRICS 2021
'చైనాతో యథాతథ సంబంధాలు కష్టమే'
author img

By

Published : Feb 24, 2021, 1:29 PM IST

భారత్​ వేదికగా నిర్వహించనున్న 'బ్రిక్స్​-2021' శిఖరాగ్ర సదస్సుకు చైనా ఇటీవలే మద్దతు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఐదు సభ్య దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్​తో కలిసి పని చేస్తామని చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో చైనా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

చైనా ప్రకటనను సానుకూలాంశంగానే భావించాలని మాజీ రాయబారి అశోక్ సజ్జనార్ అభిప్రాయపడ్డారు.

"భారత్-చైనా మధ్య 4000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కాబట్టి, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, వ్యాపార కార్యకలాపాల్లో పునరుద్ధరణ అవసరం. ఘర్షణలతో బంధాలను కొనసాగించకుండా బ్రిక్స్​ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ను ఆహ్వానించాలి."

-అశోక్ సజ్జనార్, మాజీ రాయబారి.

గతేడాది చోటుచేసుకున్న గల్వాన్​ ఘటన అనంతరం చైనా అన్ని ఒప్పందాలను ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో భారత్​కు చైనాపై నమ్మకం సన్నగిల్లింది. దీన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన సజ్జనార్... యథాతథంగా చైనాతో వ్యాపారం కొనసాగించలేమని నొక్కి చెప్పారు. కానీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు సమగ్రంగా జరిపేందుకు భారత్​ కొత్త వ్యూహంతో ఉండాలని సూచించారు.

"సరిహద్దు వివాదాన్ని.... భారత్​తో జరుపుతోన్న ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంచుతామని చైనా చెబుతోంది. కానీ, ఇది సాధ్యం కాదు."

-అశోక్ సజ్జనార్.

అంతర్జాతీయ వ్యవహారాలతో సంబంధం లేనట్లు చైనా ప్రవర్తిస్తోందని సజ్జనార్ అన్నారు. హాంకాంగ్​, తైవాన్​తో కయ్యానికి కాలుదువ్వడమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. తమ శక్తిని పెంచుకునేందుకే చైనా ప్రయత్నిస్తుంటుందని, ఇతర దేశాలు తమకు భయపడాలనే ఆలోచనా ధోరణితో ఉంటుందని అన్నారు.

గల్వాన్​ ఘటనను మరచి... తమ దేశంతో వ్యాపారం చేసేందుకు భారత్​ ముందుకు రావాలని చైనా ఆశిస్తోంది. కానీ, భారత్​ ఇందుకు సుముఖంగా లేదు.

"ఒకవేళ బ్రిక్స్​ సదస్సు జరిగినా చైనాకే లాభం ఎక్కువ. ఎందుకంటే బ్రిక్స్​ బ్యాంక్​ కార్యనిర్వహణలో చైనా భాగస్వామ్యం ఎక్కువ. అందుకే ఈ సదస్సుకు చైనా మద్దతు పలుకుతుంది."

-అశోక్ సజ్జనార్.

2021 సంవత్సరానికిగాను బ్రిక్స్(బ్రెజిల్​, రష్యా, భారత్​, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి ఛైర్మన్ పదవిని భారత్ చేపట్టింది. త్వరలో శిఖరాగ్ర సదస్సును నిర్వహించడానికి సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి: అమెరికా పౌరసత్వానికి పాత పద్ధతికే బైడెన్​ జై​

భారత్​ వేదికగా నిర్వహించనున్న 'బ్రిక్స్​-2021' శిఖరాగ్ర సదస్సుకు చైనా ఇటీవలే మద్దతు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఐదు సభ్య దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్​తో కలిసి పని చేస్తామని చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో చైనా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

చైనా ప్రకటనను సానుకూలాంశంగానే భావించాలని మాజీ రాయబారి అశోక్ సజ్జనార్ అభిప్రాయపడ్డారు.

"భారత్-చైనా మధ్య 4000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కాబట్టి, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, వ్యాపార కార్యకలాపాల్లో పునరుద్ధరణ అవసరం. ఘర్షణలతో బంధాలను కొనసాగించకుండా బ్రిక్స్​ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ను ఆహ్వానించాలి."

-అశోక్ సజ్జనార్, మాజీ రాయబారి.

గతేడాది చోటుచేసుకున్న గల్వాన్​ ఘటన అనంతరం చైనా అన్ని ఒప్పందాలను ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో భారత్​కు చైనాపై నమ్మకం సన్నగిల్లింది. దీన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన సజ్జనార్... యథాతథంగా చైనాతో వ్యాపారం కొనసాగించలేమని నొక్కి చెప్పారు. కానీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు సమగ్రంగా జరిపేందుకు భారత్​ కొత్త వ్యూహంతో ఉండాలని సూచించారు.

"సరిహద్దు వివాదాన్ని.... భారత్​తో జరుపుతోన్న ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంచుతామని చైనా చెబుతోంది. కానీ, ఇది సాధ్యం కాదు."

-అశోక్ సజ్జనార్.

అంతర్జాతీయ వ్యవహారాలతో సంబంధం లేనట్లు చైనా ప్రవర్తిస్తోందని సజ్జనార్ అన్నారు. హాంకాంగ్​, తైవాన్​తో కయ్యానికి కాలుదువ్వడమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. తమ శక్తిని పెంచుకునేందుకే చైనా ప్రయత్నిస్తుంటుందని, ఇతర దేశాలు తమకు భయపడాలనే ఆలోచనా ధోరణితో ఉంటుందని అన్నారు.

గల్వాన్​ ఘటనను మరచి... తమ దేశంతో వ్యాపారం చేసేందుకు భారత్​ ముందుకు రావాలని చైనా ఆశిస్తోంది. కానీ, భారత్​ ఇందుకు సుముఖంగా లేదు.

"ఒకవేళ బ్రిక్స్​ సదస్సు జరిగినా చైనాకే లాభం ఎక్కువ. ఎందుకంటే బ్రిక్స్​ బ్యాంక్​ కార్యనిర్వహణలో చైనా భాగస్వామ్యం ఎక్కువ. అందుకే ఈ సదస్సుకు చైనా మద్దతు పలుకుతుంది."

-అశోక్ సజ్జనార్.

2021 సంవత్సరానికిగాను బ్రిక్స్(బ్రెజిల్​, రష్యా, భారత్​, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి ఛైర్మన్ పదవిని భారత్ చేపట్టింది. త్వరలో శిఖరాగ్ర సదస్సును నిర్వహించడానికి సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి: అమెరికా పౌరసత్వానికి పాత పద్ధతికే బైడెన్​ జై​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.