ETV Bharat / international

కొవిషీల్డ్​ను గుర్తించిన ఆస్ట్రేలియా- రాకపోకల పునరుద్ధరణ..

author img

By

Published : Oct 1, 2021, 5:43 PM IST

భారత్​లో అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ను ఆస్ట్రేలియా (Australia Covishield News) అధికారికంగా గుర్తించింది. ఆ దేశ ఔషధ నియత్రణ మండలి 'థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్' సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్​ తెలిపారు. ఈ నిర్ణయంతో కొవిషీల్డ్​ తీసుకున్న వారు ఆస్ట్రేలియా తిరిగొచ్చాక వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుంది. మరోవైపు వ్యాక్సిన్​ వేయించుకోని విమాన ప్రయాణికులపై పాకిస్థాన్​ సివిల్​ ఏవియేషన్​ నిషేధం విధించింది.

Australia Covishield News
కొవిషీల్డ్​

భారత్‌లో అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్‌' టీకాను అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా (Australia Covishield News) చేరింది. కొవిషీల్డ్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్‌నూ గుర్తించింది. దేశానికి చెందిన ఔషధ నియంత్రణ మండలి 'థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్' సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం వెల్లడించారు. ఈ నిర్ణయంతో సదరు టీకాలు పొందినవారు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. దీంతోపాటు నవంబరు నుంచి స్థానికులు, శాశ్వత నివాసితులకు అంతర్జాతీయ రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు మోరిసన్‌ ప్రకటించారు. అయితే, వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు.. తిరిగొచ్చాక వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఇంకా టీకా వేయించుకోనివారికి హోటల్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌ తప్పదు.

ఆంక్షలు సడలిస్తూ..

కరోనాకు (Corona Virus) ముందునాటి జీవితాలను తిరిగి పొందే విషయంలో ఆస్ట్రేలియన్లకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోరిసన్‌ వివరించారు. విదేశాలకు వెళ్లాలనుకునే ఆస్ట్రేలియన్లకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రం (Corona certificate) ఇస్తామని, ఇది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకూ తగినట్లు ఉంటుందని వివరించారు. కరోనా కట్టడికి ఆస్ట్రేలియా మొదటినుంచి కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌లు (Lockdown News)విధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వీటిని నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ 80 శాతానికి చేరుకున్న నేపథ్యంలో క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. దేశ ఆదాయ వనరుల్లో 'అంతర్జాతీయ విద్య' కీలకమైనది కావడంతో.. విద్యార్థులను తిరిగి రప్పించే పనిలో పడింది.

వారిపై పాక్​ ఆంక్షలు..

కరోనాకు వ్యాక్సిన్​ (Covid Vaccine) తీసుకోని విమాన ప్రయాణికులపై నిషేధం విధిస్తూ.. పాకిస్థాన్​ సివిల్​ ఏవియేషన్​ అథారిటీ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని లాక్​డౌన్​లను (Lockdown News ) ఎదుర్కొవాల్సి వస్తుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ ఆదేశాల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి 18 ఏళ్లు పై బడిన వారు టీకాలు కచ్చితంగా పూర్తిస్థాయిలో డోసులు తీసుకొని ఉండాలని.. వారికి మాత్రమే ప్రయాణాలకు అనుమతిస్తామని పాక్​ సివిల్​ ఏవియేషన్​ అథారిటీ పేర్కొంది. ప్రయాణం చేసేటప్పుడు వారు టీకా తీసుకున్నట్లు రుజువు చూపించాల్సి ఉంటుందని తెలిపింది.

ఇదీ చూడండి: మహమ్మారులను ముందుగానే గుర్తించే సాంకేతిక కేంద్రం ఎక్కడుందంటే?

భారత్‌లో అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్‌' టీకాను అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా (Australia Covishield News) చేరింది. కొవిషీల్డ్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్‌నూ గుర్తించింది. దేశానికి చెందిన ఔషధ నియంత్రణ మండలి 'థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్' సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం వెల్లడించారు. ఈ నిర్ణయంతో సదరు టీకాలు పొందినవారు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. దీంతోపాటు నవంబరు నుంచి స్థానికులు, శాశ్వత నివాసితులకు అంతర్జాతీయ రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు మోరిసన్‌ ప్రకటించారు. అయితే, వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు.. తిరిగొచ్చాక వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఇంకా టీకా వేయించుకోనివారికి హోటల్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌ తప్పదు.

ఆంక్షలు సడలిస్తూ..

కరోనాకు (Corona Virus) ముందునాటి జీవితాలను తిరిగి పొందే విషయంలో ఆస్ట్రేలియన్లకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోరిసన్‌ వివరించారు. విదేశాలకు వెళ్లాలనుకునే ఆస్ట్రేలియన్లకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రం (Corona certificate) ఇస్తామని, ఇది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకూ తగినట్లు ఉంటుందని వివరించారు. కరోనా కట్టడికి ఆస్ట్రేలియా మొదటినుంచి కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌లు (Lockdown News)విధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వీటిని నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ 80 శాతానికి చేరుకున్న నేపథ్యంలో క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. దేశ ఆదాయ వనరుల్లో 'అంతర్జాతీయ విద్య' కీలకమైనది కావడంతో.. విద్యార్థులను తిరిగి రప్పించే పనిలో పడింది.

వారిపై పాక్​ ఆంక్షలు..

కరోనాకు వ్యాక్సిన్​ (Covid Vaccine) తీసుకోని విమాన ప్రయాణికులపై నిషేధం విధిస్తూ.. పాకిస్థాన్​ సివిల్​ ఏవియేషన్​ అథారిటీ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని లాక్​డౌన్​లను (Lockdown News ) ఎదుర్కొవాల్సి వస్తుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ ఆదేశాల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి 18 ఏళ్లు పై బడిన వారు టీకాలు కచ్చితంగా పూర్తిస్థాయిలో డోసులు తీసుకొని ఉండాలని.. వారికి మాత్రమే ప్రయాణాలకు అనుమతిస్తామని పాక్​ సివిల్​ ఏవియేషన్​ అథారిటీ పేర్కొంది. ప్రయాణం చేసేటప్పుడు వారు టీకా తీసుకున్నట్లు రుజువు చూపించాల్సి ఉంటుందని తెలిపింది.

ఇదీ చూడండి: మహమ్మారులను ముందుగానే గుర్తించే సాంకేతిక కేంద్రం ఎక్కడుందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.