ఇప్పటికే వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక వణికిపోతోంది. తాజాగా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 87 బాంబు డిటోనేటర్లు గుర్తించారు అధికారులు. ఇవన్నీ కొలొంబోలోని ఓ బస్స్టాప్ సమీపంలో దొరికాయని తెలిపారు.
తనిఖీల్లో మొదటగా 12 డిటోనేటర్లు బయటపడ్డాయి. అదే ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేయగా తర్వాత మరో 75 డిటోనేటర్లను గుర్తించారు.
కాసేపటికే... కొలొంబోలోని ఓ చర్చి సమీపంలోని వ్యాన్లో పేలుడు సంభవించింది. వ్యాన్లో బాంబును గుర్తించిన తనిఖీ బృందాలు దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస బాంబుపేలుళ్ల మారణహోమంలో ఇప్పటికే 290 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికి పైగా గాయాలపాలయ్యారు.