ETV Bharat / international

యుద్ధ భూమిలో వేడివేడి భోజనం

author img

By

Published : Aug 5, 2020, 11:31 AM IST

భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. సరిహద్దులో ఇరుదేశాల సైనికుల మోహరింపు వచ్చే శీతాకాలంలోనూ కొనసాగేలా ఉంది. ఇందుకోసం హిమాలయాల్లో విధులు నిర్వర్తిస్తోన్న చైనా జవాన్​లకు వేడివేడి ఆహార పదార్థాలను ఏర్పాటు చేస్తోంది ఆ దేశ సైన్యం(పీఎల్​ఏ). అందులో భాగంగా 80 నిమిషాల్లో 300 రకాల వంటకాలను సిద్ధం చేసేలా వంటవారికి తర్ఫీదునిస్తున్నారని తెలుస్తోంది.

8 cooks, 300 'hot' meals in 80 minutes: How PLA is training military cooks for Himalayan winter
యుద్ధ భూమిలో వేడివేడి భోజనం.. వారి కోసమే?

తూర్పు లద్దాఖ్​లో చైనా, భారత్​ సైనికుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన ఇప్పటిలో సమసిపోయే సూచనలు కనిపించడంలేదు. సరిహద్దులకు ఇరువైపులా రెండు దేశాల సైనికుల మోహరింపు రానున్న శీతాకాలంలోనూ కొనసాగే అవకాశమే మెండుగా ఉంది.

80 నిమిషాల్లో 300 వంటకాలు

ఈ నేపథ్యంలో అత్యంత కఠిన పరిస్థితలు ఉండే హిమాలయాల్లో విధులు నిర్వహించే తమ జవాన్​లకు ఎలాంటి ఆలస్యం జరగకుండా వేడివేడి ఆహార పదార్థాలను అందించేందుకు చైనాకు చెందిన ప్రజా విముక్తి సైన్యం(పీఎల్​ఏ) ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా జూన్​ నెల నుంచి ఆర్మీలోని వంట విభాగానికి చెందిన 8 మందికి హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో శిక్షణను నిర్వహిస్తోంది. ఆహారంలో పోషక విలువలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూనే 80 నిమిషాల్లో 300 రకాల వంటకాలను సిద్ధం చేసేలా తర్ఫీదునిస్తున్నారని చైనా అధికార పత్రిక ఒకటి వెల్లడించింది.

పొగలుకక్కే ఆహారం అందించడమే లక్ష్యం

76వ ఆర్మీ గ్రూప్​నకు చెందిన కొందరు సైనికులు ఈ వంటవాళ్లకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సముద్ర మట్టానికి 4,600 మీటర్ల ఎత్తులోని ఓ ప్రదేశంలో వంటవాళ్లు సిద్ధం చేసిన ఆహార పదార్థాలను హాట్​ప్యాక్​లలో అమర్చి వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సైనికులకు చేరవేయాల్సి ఉంటుంది. ఆహారం వారికి చేరేసరికి పొగలు కక్కుతూ వేడిగా ఉండాలి. సకాలంలో, సక్రమంగా అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంపై కూడా శిక్షణ ఉంటుంది.

50 వేల మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంట మోహరించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: 370 అధికరణ రద్దు.. భావోద్వేగ విలీనం

తూర్పు లద్దాఖ్​లో చైనా, భారత్​ సైనికుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన ఇప్పటిలో సమసిపోయే సూచనలు కనిపించడంలేదు. సరిహద్దులకు ఇరువైపులా రెండు దేశాల సైనికుల మోహరింపు రానున్న శీతాకాలంలోనూ కొనసాగే అవకాశమే మెండుగా ఉంది.

80 నిమిషాల్లో 300 వంటకాలు

ఈ నేపథ్యంలో అత్యంత కఠిన పరిస్థితలు ఉండే హిమాలయాల్లో విధులు నిర్వహించే తమ జవాన్​లకు ఎలాంటి ఆలస్యం జరగకుండా వేడివేడి ఆహార పదార్థాలను అందించేందుకు చైనాకు చెందిన ప్రజా విముక్తి సైన్యం(పీఎల్​ఏ) ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా జూన్​ నెల నుంచి ఆర్మీలోని వంట విభాగానికి చెందిన 8 మందికి హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో శిక్షణను నిర్వహిస్తోంది. ఆహారంలో పోషక విలువలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూనే 80 నిమిషాల్లో 300 రకాల వంటకాలను సిద్ధం చేసేలా తర్ఫీదునిస్తున్నారని చైనా అధికార పత్రిక ఒకటి వెల్లడించింది.

పొగలుకక్కే ఆహారం అందించడమే లక్ష్యం

76వ ఆర్మీ గ్రూప్​నకు చెందిన కొందరు సైనికులు ఈ వంటవాళ్లకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సముద్ర మట్టానికి 4,600 మీటర్ల ఎత్తులోని ఓ ప్రదేశంలో వంటవాళ్లు సిద్ధం చేసిన ఆహార పదార్థాలను హాట్​ప్యాక్​లలో అమర్చి వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సైనికులకు చేరవేయాల్సి ఉంటుంది. ఆహారం వారికి చేరేసరికి పొగలు కక్కుతూ వేడిగా ఉండాలి. సకాలంలో, సక్రమంగా అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంపై కూడా శిక్షణ ఉంటుంది.

50 వేల మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంట మోహరించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: 370 అధికరణ రద్దు.. భావోద్వేగ విలీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.