ETV Bharat / international

ఆస్ట్రేలియా కార్చిచ్చు: 5 రోజుల్లో 5 వేల ఒంటెలను చంపేశారు!

author img

By

Published : Jan 14, 2020, 10:46 PM IST

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు దహించివేస్తుంటే మరోవైపు వన్యప్రాణుల మృత్యుఘోష ప్రతిధ్వనిస్తోంది. ఏడాది నుంచి తీవ్ర కరవుతో అల్లాడుతున్న ఆ దేశం ఒంటెలను చంపేందుకు నిర్ణయించుకుంది. ఐదు రోజుల్లో 5 వేలకు పైగా ఒంటెలను చంపేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కార్చిచ్చు వల్ల ఏర్పడ్డ దట్టమైన పొగ మెల్​బోర్న్ నగరాన్ని కమ్మేసింది. గాలి నాణ్యత అత్యంత అథమ స్థాయికి పతనమైంది. ఆస్ట్రేలియా ఓపెన్​ టోర్నమెంట్​పైనా కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపించింది.

5,000 feral camels culled in drought-hit Australia
ఆస్ట్రేలియా కార్చిచ్చు: 5 రోజుల్లో 5 వేల ఒంటెలను చంపేశారు!

కనీవినీ ఎరుగని కార్చిచ్చుతో అతలాకుతలమైన ఆస్ట్రేలియాలో వన్యప్రాణుల మృత్యుఘోష కన్నీరు పెట్టిస్తోంది. తీవ్ర కరవుతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాలో ఐదు రోజుల్లో 5వేలకు పైగా ఒంటెలను చంపేసినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్లలో తిరుగుతూ ఒంటెలను చంపినట్లు వెల్లడించారు. అనంగు పిజంజజరా యకుంజజరా ప్రాంత అధికారుల (ఏపీవై) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆస్ట్రేలియాలో ఇప్పటికే కార్చిచ్చు(బుష్‌ఫైర్‌) వల్ల కొన్ని వేల జంతువులు చనిపోయాయి. దీని కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించడమే కాదు పలు ప్రాంతాల్లో తీవ్ర కరవు పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడటం వల్ల ఒంటెలను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని జంతు సంరక్షణ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై ఏపీవై జనరల్‌ మేనేజర్‌ రిచర్డ్‌ కింగ్‌ స్పందించారు.

ఆదివారం వరకు సుమారు 5వేలకు పైగా ఒంటెలను చంపేసినట్లు కింగ్‌ వెల్లడించారు. ఆస్ట్రేలియా గతేడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలను నమోదు చేసుకున్న సంవత్సరంగా నిలిచింది. బుష్‌ఫైర్‌, నీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కార్చిచ్చు వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు.

ఎందుకీ చర్యలు..

ఆస్ట్రేలియాలో దాదాపు 10 లక్షల ఒంటెలున్నాయి. 19వ శతాబ్దంలో దాదాపు 20 వేల ఒంటెలను భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. వీటి సంతతి పెరిగి దాదాపు 10 లక్షలకు చేరుకుంది. 2019 ఆస్ట్రేలియాలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసింది. దక్షిణ భాగంలో తీవ్ర కరవు ఏర్పడటం వల్ల ఒంటెలు నీటి వనరులన్న ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించాయి. ఇవి నీటిని బాగా తాగి నిల్వచేసుకుంటాయి. ఇప్పటికే క్షామంతో అల్లాడుతున్న దేశంలో ఒంటెల మందలు నీటివనరులపై పడటం వల్ల నీటి లభ్యత మరింత తగ్గిపోనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 10 వేల ఒంటెల వరకు కాల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మెల్​బోర్న్​లో కారుమబ్బులు

మరోవైపు ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద నగరమైన మెల్​బోర్న్​లో కార్చిచ్చు పొగ వ్యాపించింది. నగరమంతటా కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ఒక్కరోజులోనే నగరంలో గాలి నాణ్యత ప్రపంచంలోనే అధమ స్థాయికి పడిపోయింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇళ్లలోనుంచి బయటకు రాకూడదని, ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.

విక్టోరియా రాష్ట్రంలో 16 కార్చిచ్చులు ఇంకా మండుతూనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 14 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం దహించుకుపోయింది.

"రాత్రికి రాత్రే మెల్​బోర్న్​లో పరిస్థితి ప్రపంచంలోనే అధమ స్థాయికి చేరింది. వేడి ఉష్ణోగ్రతలు గాలి నాణ్యతను మరింత దిగజార్చవచ్చు. 65 ఏళ్లుపైబడిన వారు, 15 ఏళ్ల లోపు పిల్లలు, గర్భిణులపై ఈ పరిస్థితులు హాని కలిగించే అవకాశం ఉంది. వీరందరూ పొగకు బహిర్గతం కాకుండా ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి."-బ్రెట్ సట్టన్, విక్టోరియా వైద్యాధికారి

నేటి నుంచి వారం రోజుల పాటు వర్ష సూచనలున్నాయని ఆ దేశ వాతావరణ శాఖ ప్రకటించిన వార్త... కార్చిచ్చు ప్రాంత వాసులకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. దావనలం వ్యాపించిన ప్రదేశంతో పాటు దేశంలోని తూర్పు తీరంలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా మీడియా తెలిపింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్​పైనా ప్రభావం

మరోవైపు ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్​పైనా ఈ కాలుష్యం ప్రభావం చూపించింది. భారీగా పొగ వ్యాపించడం వల్ల క్వాలిఫైయింగ్​ మ్యాచ్​లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం ఉదయం జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్లనూ రద్దు చేశారు.

కార్చిచ్చులో గ్రామం సమిథ

న్యూసౌత్​వేల్స్​లోని నెర్రిగుండా అనే చిన్న గ్రామాన్ని కార్చిచ్చు దహించివేసింది. మంటల ధాటికి గ్రామంలోని ఇళ్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. గతంలో ఈ ప్రాంతంలో బంగారం మైనింగ్ జరిగేది. కానీ ప్రస్తుతం ఈ గ్రామంలో పదుల సంఖ్యలోనే నివాసం ఉంటున్నారు. రెండు రోజుల తర్వాతే కార్చిచ్చు గ్రామానికి వ్యాపిస్తుందని అంచనా వేసినా... అంతకుముందే ఈ ప్రాంతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది

ఇదీ చదవండి: వచ్చే నెలలో భారత్​ రానున్న అమెరికా అధ్యక్షుడు!

కనీవినీ ఎరుగని కార్చిచ్చుతో అతలాకుతలమైన ఆస్ట్రేలియాలో వన్యప్రాణుల మృత్యుఘోష కన్నీరు పెట్టిస్తోంది. తీవ్ర కరవుతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాలో ఐదు రోజుల్లో 5వేలకు పైగా ఒంటెలను చంపేసినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్లలో తిరుగుతూ ఒంటెలను చంపినట్లు వెల్లడించారు. అనంగు పిజంజజరా యకుంజజరా ప్రాంత అధికారుల (ఏపీవై) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆస్ట్రేలియాలో ఇప్పటికే కార్చిచ్చు(బుష్‌ఫైర్‌) వల్ల కొన్ని వేల జంతువులు చనిపోయాయి. దీని కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించడమే కాదు పలు ప్రాంతాల్లో తీవ్ర కరవు పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడటం వల్ల ఒంటెలను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని జంతు సంరక్షణ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై ఏపీవై జనరల్‌ మేనేజర్‌ రిచర్డ్‌ కింగ్‌ స్పందించారు.

ఆదివారం వరకు సుమారు 5వేలకు పైగా ఒంటెలను చంపేసినట్లు కింగ్‌ వెల్లడించారు. ఆస్ట్రేలియా గతేడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలను నమోదు చేసుకున్న సంవత్సరంగా నిలిచింది. బుష్‌ఫైర్‌, నీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కార్చిచ్చు వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు.

ఎందుకీ చర్యలు..

ఆస్ట్రేలియాలో దాదాపు 10 లక్షల ఒంటెలున్నాయి. 19వ శతాబ్దంలో దాదాపు 20 వేల ఒంటెలను భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. వీటి సంతతి పెరిగి దాదాపు 10 లక్షలకు చేరుకుంది. 2019 ఆస్ట్రేలియాలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసింది. దక్షిణ భాగంలో తీవ్ర కరవు ఏర్పడటం వల్ల ఒంటెలు నీటి వనరులన్న ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించాయి. ఇవి నీటిని బాగా తాగి నిల్వచేసుకుంటాయి. ఇప్పటికే క్షామంతో అల్లాడుతున్న దేశంలో ఒంటెల మందలు నీటివనరులపై పడటం వల్ల నీటి లభ్యత మరింత తగ్గిపోనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 10 వేల ఒంటెల వరకు కాల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మెల్​బోర్న్​లో కారుమబ్బులు

మరోవైపు ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద నగరమైన మెల్​బోర్న్​లో కార్చిచ్చు పొగ వ్యాపించింది. నగరమంతటా కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ఒక్కరోజులోనే నగరంలో గాలి నాణ్యత ప్రపంచంలోనే అధమ స్థాయికి పడిపోయింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇళ్లలోనుంచి బయటకు రాకూడదని, ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.

విక్టోరియా రాష్ట్రంలో 16 కార్చిచ్చులు ఇంకా మండుతూనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 14 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం దహించుకుపోయింది.

"రాత్రికి రాత్రే మెల్​బోర్న్​లో పరిస్థితి ప్రపంచంలోనే అధమ స్థాయికి చేరింది. వేడి ఉష్ణోగ్రతలు గాలి నాణ్యతను మరింత దిగజార్చవచ్చు. 65 ఏళ్లుపైబడిన వారు, 15 ఏళ్ల లోపు పిల్లలు, గర్భిణులపై ఈ పరిస్థితులు హాని కలిగించే అవకాశం ఉంది. వీరందరూ పొగకు బహిర్గతం కాకుండా ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి."-బ్రెట్ సట్టన్, విక్టోరియా వైద్యాధికారి

నేటి నుంచి వారం రోజుల పాటు వర్ష సూచనలున్నాయని ఆ దేశ వాతావరణ శాఖ ప్రకటించిన వార్త... కార్చిచ్చు ప్రాంత వాసులకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. దావనలం వ్యాపించిన ప్రదేశంతో పాటు దేశంలోని తూర్పు తీరంలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా మీడియా తెలిపింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్​పైనా ప్రభావం

మరోవైపు ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్​పైనా ఈ కాలుష్యం ప్రభావం చూపించింది. భారీగా పొగ వ్యాపించడం వల్ల క్వాలిఫైయింగ్​ మ్యాచ్​లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం ఉదయం జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్లనూ రద్దు చేశారు.

కార్చిచ్చులో గ్రామం సమిథ

న్యూసౌత్​వేల్స్​లోని నెర్రిగుండా అనే చిన్న గ్రామాన్ని కార్చిచ్చు దహించివేసింది. మంటల ధాటికి గ్రామంలోని ఇళ్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. గతంలో ఈ ప్రాంతంలో బంగారం మైనింగ్ జరిగేది. కానీ ప్రస్తుతం ఈ గ్రామంలో పదుల సంఖ్యలోనే నివాసం ఉంటున్నారు. రెండు రోజుల తర్వాతే కార్చిచ్చు గ్రామానికి వ్యాపిస్తుందని అంచనా వేసినా... అంతకుముందే ఈ ప్రాంతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది

ఇదీ చదవండి: వచ్చే నెలలో భారత్​ రానున్న అమెరికా అధ్యక్షుడు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UNTV - AP CLIENTS ONLY
Geneva - 14 January 2020
1. Press room at Palace des Nations
2. News briefing panel
3. SOUNDBITE (English) Tarik Jasarevic, World Health Organization (WHO) spokesperson:
"On January 9th, Chinese authorities made a preliminary determination of a new coronavirus identified in a hospitalised person with pneumonia in Wuhan. Two days later, Chinese authorities issued additional information updating case numbers to 41, from initially 59, and reporting one death. Chinese authorities also shared the complete genomic sequence with the WHO and with the public."
4. Wide of news briefing panel
5. SOUNDBITE (English) Dr. Maria D Van Kerkhove, WHO head of emerging diseases and zoonoses unit:
"Epidemiologic investigations are under way and we are waiting for the results of these but yes, it is certainly possible that there is limited human-to-human transmission. There are many similarities to SARS and MERS. This is a coronavirus and this helps us. The experience that we have with SARS and with MERS, the experience of our member states who have experience with these pathogens have prepared us for this. This is not unexpected. This is something that the global community is preparing for, and all of the systems are in place to activate our plans and to utilize the materials that we developed for SARS, for MERS, and adapt them for the current situation."
6. Various of journalists
7. SOUNDBITE (English) Dr. Maria D Van Kerkhove, WHO head of emerging diseases and zoonoses unit:
"There are some antivirals that are in consideration, and these are antivirals that are used for other diseases that could be repurposed for a novel coronavirus infection. There are immunotherapies that are under consideration – monoclonals or polyclonals – but again there is a lot of work that is ongoing for MERS coronavirus that can be applicable here."
8. Various of journalists
STORYLINE
World Health Organization (WHO) officials on Tuesday said the global community would be prepared for a potential outbreak of a new coronavirus found in China.
WHO spokesperson Tarik Jasarevic affirmed information from Chinese officials that there had been 41 confirmed cases of the new pathogen which has been linked to pneumonia.
The victim, China's first known death from the virus, was a 61-year-old man.
Dr. Maria D van Kerkhove, the head of the WHO's emerging diseases and zoonoses unit, said the so-called novel coronavirus held "many similarities" to SARS (Severe Acute Respiratory Syndrome) and MERS (Middle East Respiratory Syndrome).
Van Kerkove said the past experience of tackling those outbreaks "helps us".
The origin of the virus has been traced to the Chinese city of Wuhan, where it affected several dozen people who had been to a major meat and seafood market.
A Chinese visitor to Thailand was the first and so far only confirmed case of the pathogen outside China.
The WHO has reported the symptom of the virus as fever, with a few persons enduring difficulty in breathing. Chest radiographs show invasive pneumonic infiltrates in both lungs.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.