ETV Bharat / international

బస్సు ప్రమాదం-15 మంది మృతి

author img

By

Published : May 4, 2021, 8:21 AM IST

Updated : May 4, 2021, 11:58 AM IST

పాకిస్థాన్​లో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా 35 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

accident in pak
పాకిస్థాన్​ బస్సు ప్రమాదం

పాకిస్థాన్​లో బస్సు లోయలో పడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. పంజాబ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ జరిగింది..

లాహోర్​ నుంచి మర్దాన్​కు ప్రయాణిస్తుంది ఈ బస్సు. అయితే.. అట్టాక్ జిల్లా హసన్ అబ్దల్ ప్రాంతంలో కారును తప్పించేందుకు బస్సు డ్రైవర్​ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. మృతులను, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పాక్​ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ సయీద్ జుల్​ఫికర్ అబ్బాస్ బుఖార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:నాయకులకు నిబంధనలన్నీ నీటి మీద రాతలే!

పాకిస్థాన్​లో బస్సు లోయలో పడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. పంజాబ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ జరిగింది..

లాహోర్​ నుంచి మర్దాన్​కు ప్రయాణిస్తుంది ఈ బస్సు. అయితే.. అట్టాక్ జిల్లా హసన్ అబ్దల్ ప్రాంతంలో కారును తప్పించేందుకు బస్సు డ్రైవర్​ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. మృతులను, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పాక్​ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ సయీద్ జుల్​ఫికర్ అబ్బాస్ బుఖార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:నాయకులకు నిబంధనలన్నీ నీటి మీద రాతలే!

Last Updated : May 4, 2021, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.