ETV Bharat / international

తాలిబన్ల ఏరివేత.. 109 మంది హతం

author img

By

Published : Jul 10, 2021, 3:29 PM IST

అఫ్గానిస్థాన్​లో 109 మంది తాలిబన్లు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

afghanistan military vs talibans
అఫ్గాన్​లో ఘర్షణలు

అఫ్గానిస్థాన్​లో భద్రతా దళాలు, తాలిబన్లకు మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 109 మంది తాలిబన్లు హతమయ్యారు. మరో 25మంది గాయపడ్డారు. ఈ మేరకు అఫ్గాన్​ సైన్యం శనివారం ఓ ప్రకటన చేసింది.

రెండు రాష్ట్రాల్లో...

కందహార్​ రాష్ట్రంలో జరిగిన ఘర్షణలో 70 మంది తాలిబన్లు మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారని అఫ్గాన్​ సైన్యం చెప్పింది. పొరుగునే ఉన్న హెల్మాండ్​ రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో 39 మంది తాలిబన్లు హతమవగా.. 17మంది గాయపడ్డారని చెప్పింది. అఫ్గాన్ నేషనల్​ డిఫెన్స్​ అండ్​ సెక్యూరిటీ ఫోర్సెస్​(ఏఎన్​డీఎస్​ఎఫ్​), అఫ్గాన్​ వాయుసేన, పోలీసులు సంయుక్తంగా ఈ తాలిబన్ల ఏరివేత ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఆ ఇద్దరూ హతం​..

మరణించిన వారిలో.. ఇద్దరు కీలక తాలిబన్​ నేతలైనా తాజ్గుల్​, నెహమాన్​ ఉన్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఘటనాస్థలిలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను, ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. అఫ్గాన్​ సైన్యం వైపు ఎందరు మరణించారన్న దానిపై స్పష్టత లేదు.

అమెరికా, నాటో దళాలు అఫ్గాన్​ వీడుతున్న నేపథ్యంలో.. అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి.

ఇవీ చూడండి

అఫ్గానిస్థాన్​లో భద్రతా దళాలు, తాలిబన్లకు మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 109 మంది తాలిబన్లు హతమయ్యారు. మరో 25మంది గాయపడ్డారు. ఈ మేరకు అఫ్గాన్​ సైన్యం శనివారం ఓ ప్రకటన చేసింది.

రెండు రాష్ట్రాల్లో...

కందహార్​ రాష్ట్రంలో జరిగిన ఘర్షణలో 70 మంది తాలిబన్లు మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారని అఫ్గాన్​ సైన్యం చెప్పింది. పొరుగునే ఉన్న హెల్మాండ్​ రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో 39 మంది తాలిబన్లు హతమవగా.. 17మంది గాయపడ్డారని చెప్పింది. అఫ్గాన్ నేషనల్​ డిఫెన్స్​ అండ్​ సెక్యూరిటీ ఫోర్సెస్​(ఏఎన్​డీఎస్​ఎఫ్​), అఫ్గాన్​ వాయుసేన, పోలీసులు సంయుక్తంగా ఈ తాలిబన్ల ఏరివేత ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఆ ఇద్దరూ హతం​..

మరణించిన వారిలో.. ఇద్దరు కీలక తాలిబన్​ నేతలైనా తాజ్గుల్​, నెహమాన్​ ఉన్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఘటనాస్థలిలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను, ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. అఫ్గాన్​ సైన్యం వైపు ఎందరు మరణించారన్న దానిపై స్పష్టత లేదు.

అమెరికా, నాటో దళాలు అఫ్గాన్​ వీడుతున్న నేపథ్యంలో.. అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.