ETV Bharat / international

స్పేస్ ఎక్స్ ప్రయోగం ఆదివారానికి వాయిదా

author img

By

Published : Nov 14, 2020, 5:05 PM IST

స్పేస్​ ఎక్స్ చేపట్టాల్సిన అంతరిక్ష ప్రయోగం ఆదివారానికి వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది. అయితే కొవిడ్ ఫలితాలపై అయోమయం ఉన్నందున సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్​ను ప్రయోగ కేంద్రానికి అనుమతిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు.

SpaceX, NASA delay Crew-1 astronaut launch to Sunday due to rocket recovery weather
స్పేస్ ఎక్స్ ప్రయోగం ఆదివారానికి వాయిదా

అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు చేపట్టాల్సిన ప్రయోగాన్ని 'స్పేస్​ ఎక్స్' ఆదివారానికి వాయిదా వేసింది. భారీ ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రయోగం చేపడితే రాకెట్ బూస్టర్​ను తిరిగి సంపాదించడం కష్టమవుతుందని 'స్పేస్ ఎక్స్' పేర్కొంది.

షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి ఈ ప్రయోగం జరగాల్సింది. ఈ ప్రయోగం ద్వారా నలుగురు (ముగ్గురు అమెరికన్, ఒక జపాన్​) వ్యోమగాములను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది స్పేస్ ఎక్స్.

మస్క్​కు అనుమతి ఉంటుందా?

స్పేస్​ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్​కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో భిన్నమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రకటన రావడం గమనార్హం. ఒకేరోజు నిర్వహించిన నాలుగు ర్యాపిడ్ పరీక్షల్లో రెండుసార్లు పాజిటివ్, రెండుసార్లు నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు మస్క్ తెలిపారు. కచ్చితమైన పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ర్యాపిడ్​ టెస్ట్‌లు అంతా బోగస్​: టెస్లా సీఈఓ

ఈ నేపథ్యంలో కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నాసా చేపట్టే ఈ ప్రయోగానికి ఎలాన్ మస్క్​ను అనుమతిస్తారా? అనే విషయంపై స్పష్టత కొరవడింది. నాసా నియమాల ప్రకారం కరోనా పాజిటివ్​గా తేలినవారు క్వారంటైన్​లో ఉండాలి. మస్క్​కు నెగెటివ్ వచ్చినా ఆయన్ను అనుమతిస్తారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అయితే కాంటాక్ట్ ట్రేసింగ్​ సమాచారం ప్రకారం ప్రయోగంలో పాల్గొనే నలుగురు వ్యోమగాములతో పాటు వారిని కలిసినవారి దగ్గరకు ఎలాన్ మస్క్ వెళ్లలేదని తెలిసింది.

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు నాలుగు వారాలుగా క్వారంటైన్​లోనే ఉన్నారని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్​స్టైన్ తెలిపారు. బయటివ్యక్తులను వారు కలవలేదని చెప్పారు.

ఇదీ చదవండి: అంతరిక్షయాత్రలో చరిత్ర సృష్టించిన 'స్పేస్​ ఎక్స్​'

అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు చేపట్టాల్సిన ప్రయోగాన్ని 'స్పేస్​ ఎక్స్' ఆదివారానికి వాయిదా వేసింది. భారీ ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రయోగం చేపడితే రాకెట్ బూస్టర్​ను తిరిగి సంపాదించడం కష్టమవుతుందని 'స్పేస్ ఎక్స్' పేర్కొంది.

షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి ఈ ప్రయోగం జరగాల్సింది. ఈ ప్రయోగం ద్వారా నలుగురు (ముగ్గురు అమెరికన్, ఒక జపాన్​) వ్యోమగాములను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది స్పేస్ ఎక్స్.

మస్క్​కు అనుమతి ఉంటుందా?

స్పేస్​ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్​కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో భిన్నమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రకటన రావడం గమనార్హం. ఒకేరోజు నిర్వహించిన నాలుగు ర్యాపిడ్ పరీక్షల్లో రెండుసార్లు పాజిటివ్, రెండుసార్లు నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు మస్క్ తెలిపారు. కచ్చితమైన పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ర్యాపిడ్​ టెస్ట్‌లు అంతా బోగస్​: టెస్లా సీఈఓ

ఈ నేపథ్యంలో కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నాసా చేపట్టే ఈ ప్రయోగానికి ఎలాన్ మస్క్​ను అనుమతిస్తారా? అనే విషయంపై స్పష్టత కొరవడింది. నాసా నియమాల ప్రకారం కరోనా పాజిటివ్​గా తేలినవారు క్వారంటైన్​లో ఉండాలి. మస్క్​కు నెగెటివ్ వచ్చినా ఆయన్ను అనుమతిస్తారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అయితే కాంటాక్ట్ ట్రేసింగ్​ సమాచారం ప్రకారం ప్రయోగంలో పాల్గొనే నలుగురు వ్యోమగాములతో పాటు వారిని కలిసినవారి దగ్గరకు ఎలాన్ మస్క్ వెళ్లలేదని తెలిసింది.

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు నాలుగు వారాలుగా క్వారంటైన్​లోనే ఉన్నారని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్​స్టైన్ తెలిపారు. బయటివ్యక్తులను వారు కలవలేదని చెప్పారు.

ఇదీ చదవండి: అంతరిక్షయాత్రలో చరిత్ర సృష్టించిన 'స్పేస్​ ఎక్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.