ETV Bharat / international

వేలాదిమంది సాయుధ సైనికుల్ని దించుతా: ట్రంప్

అమెరికాలో ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్న వేళ ఆందోళనకారులకు వ్యతిరేకంగా శ్వేతసౌధం కీలక వ్యాఖ్యలు చేసింది. హింస, దోపిడీ అరాచకత్వాలను సహించేది లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్‌... రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఆందోళనలను అదుపు చేయడంలో ఆయా రాష్ట్రాల గవర్నర్లు విఫలమయ్యారని మండిపడ్డారు. ఘర్షణలు తెరదించేందుకు నేషనల్‌గార్డ్స్‌ను బరిలోకి దింపకుంటే సాయుధ సైనికుల్ని వేలాదిగా దించుతానని హెచ్చరించారు

author img

By

Published : Jun 2, 2020, 6:40 AM IST

white house
ట్రంప్

దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన వేళ వివిధ రాష్ట్రాల గవర్నర్లతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలికాన్ఫరెన్స్​ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆందోళనలు అదుపు చేయడంలో గవర్నర్లు విఫలమయ్యారని మండిపడ్డారు. బలహీనులైన గవర్నర్ల వల్లే ఆందోళనలు సద్దుమణగడంలేదని ఆరోపించారు. నేషనల్ గార్డ్స్‌ను ఆయా రాష్ట్రాలు బరిలోకి దించకుంటే తాను వేలాది మంది సాయుధ బలగాలను రంగంలోకి దించుతానని హెచ్చరించారు.

"మీరు (గవర్నర్లను ఉద్దేశించి) నిరసనకారులను గుర్తించి అరెస్టు చేయాలి. వారిని 10 ఏళ్లపాటు కారాగారంలో బంధించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయి. వాషింగ్​టన్​లో ఇప్పుడు మేం అదే చేయబోతున్నాం. ప్రజలు ఇదివరకు చూడని విధంగా మేం చర్యలు తీసుకోబోతున్నాం."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

నల్లజాతీయుడైన జార్జి ఫ్లాయిడ్ మృతితో అమెరికా అట్టుకుడుకుతున్న వేళ శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. నిరసనల్లో భాగంగా చేస్తోన్న హింస, దోపిడీ, అరాచకత్వాలను సహించేది లేదని స్పష్టం చేసింది. శాంతియుతంగా నిసరన తెలిపే హక్కు ప్రజలకు ఉందని అయితే, కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలు ఈ కోవకు చెందినవి కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల గవర్నర్లందరూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

"అమెరికా వీధుల్లో జరుగుతున్నవి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇవి నిరసనలు కావు, నేరపూరిత చర్యలు. ఇవన్నీ అమెరికన్ పౌరులకు హానికలిగించే నేరాలు."

-కెయిలీ మెక్​ఎనానీ, శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ

మరోవైపు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో శ్వేతసౌధం ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

violence-looting-anarchy-lawlessness-wont-be-tolerated-white-house
శ్వేతసౌధం సమీపంలో నిరసన
violence-looting-anarchy-lawlessness-wont-be-tolerated-white-house
శ్వేతసౌధం సమీపంలో నిరసన
violence-looting-anarchy-lawlessness-wont-be-tolerated-white-house
బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు

ఇదీ చదవండి: నేడు సీఐఐ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధాని

దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన వేళ వివిధ రాష్ట్రాల గవర్నర్లతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలికాన్ఫరెన్స్​ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆందోళనలు అదుపు చేయడంలో గవర్నర్లు విఫలమయ్యారని మండిపడ్డారు. బలహీనులైన గవర్నర్ల వల్లే ఆందోళనలు సద్దుమణగడంలేదని ఆరోపించారు. నేషనల్ గార్డ్స్‌ను ఆయా రాష్ట్రాలు బరిలోకి దించకుంటే తాను వేలాది మంది సాయుధ బలగాలను రంగంలోకి దించుతానని హెచ్చరించారు.

"మీరు (గవర్నర్లను ఉద్దేశించి) నిరసనకారులను గుర్తించి అరెస్టు చేయాలి. వారిని 10 ఏళ్లపాటు కారాగారంలో బంధించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయి. వాషింగ్​టన్​లో ఇప్పుడు మేం అదే చేయబోతున్నాం. ప్రజలు ఇదివరకు చూడని విధంగా మేం చర్యలు తీసుకోబోతున్నాం."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

నల్లజాతీయుడైన జార్జి ఫ్లాయిడ్ మృతితో అమెరికా అట్టుకుడుకుతున్న వేళ శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. నిరసనల్లో భాగంగా చేస్తోన్న హింస, దోపిడీ, అరాచకత్వాలను సహించేది లేదని స్పష్టం చేసింది. శాంతియుతంగా నిసరన తెలిపే హక్కు ప్రజలకు ఉందని అయితే, కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలు ఈ కోవకు చెందినవి కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల గవర్నర్లందరూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

"అమెరికా వీధుల్లో జరుగుతున్నవి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇవి నిరసనలు కావు, నేరపూరిత చర్యలు. ఇవన్నీ అమెరికన్ పౌరులకు హానికలిగించే నేరాలు."

-కెయిలీ మెక్​ఎనానీ, శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ

మరోవైపు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో శ్వేతసౌధం ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

violence-looting-anarchy-lawlessness-wont-be-tolerated-white-house
శ్వేతసౌధం సమీపంలో నిరసన
violence-looting-anarchy-lawlessness-wont-be-tolerated-white-house
శ్వేతసౌధం సమీపంలో నిరసన
violence-looting-anarchy-lawlessness-wont-be-tolerated-white-house
బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు

ఇదీ చదవండి: నేడు సీఐఐ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.