ETV Bharat / international

భారతీయ-అమెరికన్ రచయిత 'వేద్' కన్నుమూత - వేద్​ మెహతా రచనలు

ప్రముఖ భారతీయ-అమెరికన్​ రచయిత వేద్​ మెహతా కన్నుమూశారు. చిన్నతనంలోనే చూపు కోల్పోయిన ఈ నవలా రచయిత.. 86 ఏళ్ల వయసులో శనివారం తుదిశ్వాస విడిచారు.

Ved Mehta, who overcame blindness with literary prowess, dies at 86
భారతీయ-అమెరికన్ రచయిత 'వేద్​ మెహతా' కన్నుమూత
author img

By

Published : Jan 11, 2021, 7:48 PM IST

ప్రముఖ భారతీయ-అమెరికన్​ నవలా రచయిత వేద్​ మెహతా ఇకలేరు. చిన్నతనంలోనే చూపు కోల్పోయినా.. అంధత్వాన్ని అధిగమిస్తూ అనేక రచనలు, వందలాది వ్యాసాలు రాసిన 86ఏళ్ల మెహతా.. శనివారం కన్ను మూశారు.

Ved Mehta, Poet
వేద్​ మెహతా, రచయిత

నేపథ్యం:

1934లో లాహోర్(ప్రస్తుత పాకిస్థాన్​ నగరం)లో జన్మించిన మెహతా.. బ్రిటన్​, అమెరికాలో విద్యనభ్యసించారు. ఈ క్రమంలో అమెరికాలోనే స్థిరపడి అక్కడి పౌరసత్వం పొందారు. మూడేళ్లకే కనుచూపు కోల్పోయిన మెహతా.. తన రచనలతో సాహిత్య కాంతిని వెలిగించారు. 33 సంవత్సరాలు స్టాఫ్​ రైటర్​గా పనిచేసిన ఆయన.. ఎన్నో ప్రసిద్ధ రచనలతో గొప్ప రచయితగా పేరుపొందారు. సమకాలీన అమెరికన్లకు తన పుస్తకాల ద్వారా భారతదేశాన్ని పరిచయం చేశారు. 20వ శతాబ్దానికి చెందిన ఈ రచయిత.. అమెరికన్ రచయిత జేమ్స్​ ఫెనిమోర్​ కూపర్​ వారసురాలైరన లిన్న్​ కేరీని వివాహం చేసుకున్నారు.

రచనలు:

మోహతా రచించిన మొట్టమొదటి పుస్తకం 'ఫేస్​ టూ ఫేస్​'. ఇది 1957లో ప్రచురితమై.. ఎందరో సాహిత్య ప్రముఖుల దృష్టిని ఆకర్షంచింది. ఆ తర్వాత తన తండ్రి అమోలక్​ రామ్​ మెహతా గురించి 'డాడీజీ', స్వీయకథతో 'కాంటినెంట్స్​ ఆఫ్​ ఎక్సైల్​' వంటి ప్రసిద్ధ రచనలు చేశారు. భారత పర్యటనపై ఆయన రాసిన ఓ వ్యాసం 1960లో న్యూయార్కర్​ మ్యాగజైన్​లో ప్రచురితమైంది. దీంతో ఆ సంపాదకులు విలియం షాన్​.. మెహతాను స్టాఫ్​ రైటర్​గా నియమించుకున్నారు. ఆయన రాసిన అనేక పుస్తకాలు.. న్యూయార్కర్​లో సుదీర్ఘ కాలంపాటు వ్యాసాలుగా ప్రచురితమయ్యాయి.

అయితే.. 1994 టీనా బ్రౌన్​ సంపాదకులుగా బాధ్యతలు చేపట్టాక.. 36 ఏళ్ల స్టాఫ్​ రైటర్​ కెరీర్​కు ముగింపు పలికారు మెహతా. ఆ తర్వాత కూడా పుస్తకాలు రాస్తూనే యేల్​, న్యూయార్క్​ విశ్వవిద్యాలయాలో అధ్యాపకులుగా సేవలందించారు. మెహతా రచనల్లో ప్రజల జీవన విధానం కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది.

'ఆత్మకథ', ఇతర ప్రసిద్ధ రచనలు:

మెహతా.. స్వీయకథతో పాటు తన కుటుంబ నేపథ్యం, వలస రాజ్యాల పాలన వంటి వాటిపైనా రచనలు చేశారు. ఆయన ఆత్మకథల్లో తల్లి శాంతి గురించి రాసిన 'మామాజీ' కూడా ఒకటి. మానసిక విశ్లేషణపై రాసిన 'ఆల్​ ఫర్​ లవ్​', అంధుల విద్యపై 'సౌండ్​-షాడోస్​ ఆఫ్​ ది న్యూ వరల్డ్​', యూకేలో విద్యనభ్యసించినప్పటి విషయాల గూర్చి.. 'అప్​ ఎట్​ ఆక్స్​ఫర్డ్​' వంటివీ ఎంతో ప్రసిద్ధి పొందాయి. 'వాకింగ్​ ద ఇండియన్ స్ట్రీట్స్​', 'పోర్ట్రెయిట్​ ఆఫ్​ ఇండియా', 'మహాత్మాగాంధీ అండ్​ హిస్​ అపోస్ట్​లెస్​' వంటి దేశీయ రచనల్ని అమెరికన్​ పాఠకుల కోసం రచించారు మెహతా.

బ్రిటీష్​ తత్వవేత్తలలో ఆయన ఎదుర్కొన్న 'ఫ్లై అండ్​ ది ఫ్లై-బాటిల్​: ఎన్​కౌంటర్స్​ విత్​ బ్రిటీష్​ ఇంటలెక్చువల్స్​' అధిక ప్రభావం పొందిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా.. 'ద డెలిన్క్వెంట్ చాచా' అనే నవల కూడా మెహతా రచనల్లో పేరుగాంచింది.

'ఎ ఫ్యామిలీ ఎఫైర్: ఇండియా అండర్ త్రీ ప్రైమ్ మినిస్టర్స్'తో సహా.. భారత రాజకీయాలపై పలు రచనలు చేశారు మోహతా. అయితే.. ఇందులో ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీలను విమర్శించారు.

ఇదీ చదవండి: నేడు దిగువ సభలో ట్రంప్​పై అభిశంసన తీర్మానం

ప్రముఖ భారతీయ-అమెరికన్​ నవలా రచయిత వేద్​ మెహతా ఇకలేరు. చిన్నతనంలోనే చూపు కోల్పోయినా.. అంధత్వాన్ని అధిగమిస్తూ అనేక రచనలు, వందలాది వ్యాసాలు రాసిన 86ఏళ్ల మెహతా.. శనివారం కన్ను మూశారు.

Ved Mehta, Poet
వేద్​ మెహతా, రచయిత

నేపథ్యం:

1934లో లాహోర్(ప్రస్తుత పాకిస్థాన్​ నగరం)లో జన్మించిన మెహతా.. బ్రిటన్​, అమెరికాలో విద్యనభ్యసించారు. ఈ క్రమంలో అమెరికాలోనే స్థిరపడి అక్కడి పౌరసత్వం పొందారు. మూడేళ్లకే కనుచూపు కోల్పోయిన మెహతా.. తన రచనలతో సాహిత్య కాంతిని వెలిగించారు. 33 సంవత్సరాలు స్టాఫ్​ రైటర్​గా పనిచేసిన ఆయన.. ఎన్నో ప్రసిద్ధ రచనలతో గొప్ప రచయితగా పేరుపొందారు. సమకాలీన అమెరికన్లకు తన పుస్తకాల ద్వారా భారతదేశాన్ని పరిచయం చేశారు. 20వ శతాబ్దానికి చెందిన ఈ రచయిత.. అమెరికన్ రచయిత జేమ్స్​ ఫెనిమోర్​ కూపర్​ వారసురాలైరన లిన్న్​ కేరీని వివాహం చేసుకున్నారు.

రచనలు:

మోహతా రచించిన మొట్టమొదటి పుస్తకం 'ఫేస్​ టూ ఫేస్​'. ఇది 1957లో ప్రచురితమై.. ఎందరో సాహిత్య ప్రముఖుల దృష్టిని ఆకర్షంచింది. ఆ తర్వాత తన తండ్రి అమోలక్​ రామ్​ మెహతా గురించి 'డాడీజీ', స్వీయకథతో 'కాంటినెంట్స్​ ఆఫ్​ ఎక్సైల్​' వంటి ప్రసిద్ధ రచనలు చేశారు. భారత పర్యటనపై ఆయన రాసిన ఓ వ్యాసం 1960లో న్యూయార్కర్​ మ్యాగజైన్​లో ప్రచురితమైంది. దీంతో ఆ సంపాదకులు విలియం షాన్​.. మెహతాను స్టాఫ్​ రైటర్​గా నియమించుకున్నారు. ఆయన రాసిన అనేక పుస్తకాలు.. న్యూయార్కర్​లో సుదీర్ఘ కాలంపాటు వ్యాసాలుగా ప్రచురితమయ్యాయి.

అయితే.. 1994 టీనా బ్రౌన్​ సంపాదకులుగా బాధ్యతలు చేపట్టాక.. 36 ఏళ్ల స్టాఫ్​ రైటర్​ కెరీర్​కు ముగింపు పలికారు మెహతా. ఆ తర్వాత కూడా పుస్తకాలు రాస్తూనే యేల్​, న్యూయార్క్​ విశ్వవిద్యాలయాలో అధ్యాపకులుగా సేవలందించారు. మెహతా రచనల్లో ప్రజల జీవన విధానం కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది.

'ఆత్మకథ', ఇతర ప్రసిద్ధ రచనలు:

మెహతా.. స్వీయకథతో పాటు తన కుటుంబ నేపథ్యం, వలస రాజ్యాల పాలన వంటి వాటిపైనా రచనలు చేశారు. ఆయన ఆత్మకథల్లో తల్లి శాంతి గురించి రాసిన 'మామాజీ' కూడా ఒకటి. మానసిక విశ్లేషణపై రాసిన 'ఆల్​ ఫర్​ లవ్​', అంధుల విద్యపై 'సౌండ్​-షాడోస్​ ఆఫ్​ ది న్యూ వరల్డ్​', యూకేలో విద్యనభ్యసించినప్పటి విషయాల గూర్చి.. 'అప్​ ఎట్​ ఆక్స్​ఫర్డ్​' వంటివీ ఎంతో ప్రసిద్ధి పొందాయి. 'వాకింగ్​ ద ఇండియన్ స్ట్రీట్స్​', 'పోర్ట్రెయిట్​ ఆఫ్​ ఇండియా', 'మహాత్మాగాంధీ అండ్​ హిస్​ అపోస్ట్​లెస్​' వంటి దేశీయ రచనల్ని అమెరికన్​ పాఠకుల కోసం రచించారు మెహతా.

బ్రిటీష్​ తత్వవేత్తలలో ఆయన ఎదుర్కొన్న 'ఫ్లై అండ్​ ది ఫ్లై-బాటిల్​: ఎన్​కౌంటర్స్​ విత్​ బ్రిటీష్​ ఇంటలెక్చువల్స్​' అధిక ప్రభావం పొందిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా.. 'ద డెలిన్క్వెంట్ చాచా' అనే నవల కూడా మెహతా రచనల్లో పేరుగాంచింది.

'ఎ ఫ్యామిలీ ఎఫైర్: ఇండియా అండర్ త్రీ ప్రైమ్ మినిస్టర్స్'తో సహా.. భారత రాజకీయాలపై పలు రచనలు చేశారు మోహతా. అయితే.. ఇందులో ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీలను విమర్శించారు.

ఇదీ చదవండి: నేడు దిగువ సభలో ట్రంప్​పై అభిశంసన తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.