ETV Bharat / international

కరోనాపై పోరుకు బిలియన్​ డాలర్ల 'ప్యాకేజీ' అస్త్రం

author img

By

Published : Mar 18, 2020, 1:57 PM IST

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలు పతనమవుతున్న నేపథ్యంలో భారీ ఉద్దీపన ప్యాకేజీతో దీనిని అధిగమించాలని భావిస్తోంది అగ్రరాజ్యం. వందల బిలియన్ డాలర్లను కరోనా నుంచి బయటపడేందుకు సాయంగా ప్రకటించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. బ్రిటన్​లోనూ ఈ తరహాలోనే ప్యాకేజీ సిద్ధమవుతోంది. కరోనా సంక్షోభంపై సరైన చర్యలు చేపట్టడం లేదని ఈ రెండు దేశాలపై మొన్నటి వరకు విమర్శలు వెల్లువెత్తాయి.

corona news
కరోనాను ఎదుర్కొనేందుకు బిలియన్​ డాలర్ల ప్యాకేజీలు

కరోనా వైరస్​ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2లక్షల మందికి ఈ వైరస్​ సోకింది. 7వేల900 మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రపంచ స్టాక్​ మార్కెట్లు చరిత్రలో లేని విధంగా పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు బిలియన్​ డాలర్లను ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటించనున్నట్లు చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. నష్టాల్లో ఉన్న వ్యాపార రంగాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. బ్రిటన్​ కూడా బిలియన్ డాలర్ల ప్యాకేజీతో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. కరోనా సంక్షోభం ముంచుకొస్తున్నా.. సరైన చర్యలు చేపట్టడం లేదని ఈ రెండు దేశాలపై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి.

అగ్రదేశాలు చేపట్టబోయే ఆర్థిక చర్యలు

  • కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రవేశపెట్టబోయే బిల్లు కోసం కాంగ్రెస్​తో చర్చిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
  • దాదాపు 850 బిలియన్ డాలర్లను ఆర్థిక సాయంగా ప్రకటించనున్నారని సమాచారం.
  • తీవ్ర సంక్షోభంలో ఉన్న విమానయాన రంగానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
  • బ్రిటన్ కూడా భారీ ఉద్దీపన ప్యాకేజీతో సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి తెలిపారు.
  • నష్టాల్లో ఉన్న వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు 400బిలయన్​ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.
  • ఫ్రాన్స్ కూడా 50 బిలియన్​ డాలర్లను ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటిస్తామని తెలిపింది.

కొనసాగుతున్న ఆంక్షలు

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు.. చేపట్టిన ముందు జాగ్రత్తలను యథావిధిగా కొనసాగిస్తున్నాయి.

  • ఐరోపా దేశాల సరిహద్దులను నెల రోజుల పాటు మూసివేశారు.
  • బెల్జియంను ఏప్రిల్​ 5వరకు మూసివేయనున్నారు.
  • అమెరికా, బ్రిటన్​లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
  • అగ్రరాజ్యంలోని మేరీల్యాండ్​లో ప్రాథమిక ఎన్నికలు వాయిదా పడ్డాయి.
  • ప్రజలు విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచించింది.
  • 100 మందికిపైగా గుమిగూడకుండా ఆంక్షలు విధించింది.
  • జర్మనీలో చర్చ్​లు, మసీదులలో ప్రార్థనలు నిషేధించారు.

కరోనా కారణంగా క్రీడారంగంలో ప్రఖ్యాత టోర్నీలను వాయిదా వేశారు.

  • యూరోపియన్​ ఫుట్​బాల్ ఛాంపియన్​షిప్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
  • ప్రెంచ్ ఓపెన్ సెప్టెంబర్​కు వాయిదా పడింది.
  • టోక్యో ఒలింపిక్స్​ యథావిధిగా జరుగుతాయని జపాన్ ప్రధాని తెలిపినా.. వాయిదా పడే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ.

వ్యాక్సిన్ కోసం అహర్నిశలు..

కరోనా వ్యాక్సిన్​ను వీలైనంత త్వరగా కనుగొనేందుకు ప్రపంచంలోని ప్రఖ్యాత ఔషధ తయారీ సంస్థలన్నీ అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అయితే ఎంత లేదన్నా కనీసం ఏడాది సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నాయి.

కరోనా వ్యాక్సిన్​ను మనుషులపై ప్రయోగించింది అమెరికా. ప్రయోగ ఫలితాలు తెలియాల్సి ఉంది.

కరోనా వైరస్​ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2లక్షల మందికి ఈ వైరస్​ సోకింది. 7వేల900 మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రపంచ స్టాక్​ మార్కెట్లు చరిత్రలో లేని విధంగా పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు బిలియన్​ డాలర్లను ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటించనున్నట్లు చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. నష్టాల్లో ఉన్న వ్యాపార రంగాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. బ్రిటన్​ కూడా బిలియన్ డాలర్ల ప్యాకేజీతో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. కరోనా సంక్షోభం ముంచుకొస్తున్నా.. సరైన చర్యలు చేపట్టడం లేదని ఈ రెండు దేశాలపై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి.

అగ్రదేశాలు చేపట్టబోయే ఆర్థిక చర్యలు

  • కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రవేశపెట్టబోయే బిల్లు కోసం కాంగ్రెస్​తో చర్చిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
  • దాదాపు 850 బిలియన్ డాలర్లను ఆర్థిక సాయంగా ప్రకటించనున్నారని సమాచారం.
  • తీవ్ర సంక్షోభంలో ఉన్న విమానయాన రంగానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
  • బ్రిటన్ కూడా భారీ ఉద్దీపన ప్యాకేజీతో సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి తెలిపారు.
  • నష్టాల్లో ఉన్న వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు 400బిలయన్​ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.
  • ఫ్రాన్స్ కూడా 50 బిలియన్​ డాలర్లను ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటిస్తామని తెలిపింది.

కొనసాగుతున్న ఆంక్షలు

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు.. చేపట్టిన ముందు జాగ్రత్తలను యథావిధిగా కొనసాగిస్తున్నాయి.

  • ఐరోపా దేశాల సరిహద్దులను నెల రోజుల పాటు మూసివేశారు.
  • బెల్జియంను ఏప్రిల్​ 5వరకు మూసివేయనున్నారు.
  • అమెరికా, బ్రిటన్​లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
  • అగ్రరాజ్యంలోని మేరీల్యాండ్​లో ప్రాథమిక ఎన్నికలు వాయిదా పడ్డాయి.
  • ప్రజలు విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచించింది.
  • 100 మందికిపైగా గుమిగూడకుండా ఆంక్షలు విధించింది.
  • జర్మనీలో చర్చ్​లు, మసీదులలో ప్రార్థనలు నిషేధించారు.

కరోనా కారణంగా క్రీడారంగంలో ప్రఖ్యాత టోర్నీలను వాయిదా వేశారు.

  • యూరోపియన్​ ఫుట్​బాల్ ఛాంపియన్​షిప్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
  • ప్రెంచ్ ఓపెన్ సెప్టెంబర్​కు వాయిదా పడింది.
  • టోక్యో ఒలింపిక్స్​ యథావిధిగా జరుగుతాయని జపాన్ ప్రధాని తెలిపినా.. వాయిదా పడే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ.

వ్యాక్సిన్ కోసం అహర్నిశలు..

కరోనా వ్యాక్సిన్​ను వీలైనంత త్వరగా కనుగొనేందుకు ప్రపంచంలోని ప్రఖ్యాత ఔషధ తయారీ సంస్థలన్నీ అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అయితే ఎంత లేదన్నా కనీసం ఏడాది సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నాయి.

కరోనా వ్యాక్సిన్​ను మనుషులపై ప్రయోగించింది అమెరికా. ప్రయోగ ఫలితాలు తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.