ETV Bharat / international

'మోదీ బొమ్మ'తో ట్రంప్​ ప్రచారం- మరి కలిసొచ్చేనా?

author img

By

Published : Aug 23, 2020, 1:14 PM IST

నవంబర్​లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రెండు ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా రిపబ్లికన్​ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​ కొత్త ఎత్తుగడ వేశారు. తమ పార్టీ విడుదల చేసిన ప్రచార వీడియోలో భారత ప్రధాని మోదీకి ప్రాధాన్యం ఇచ్చారు. దీని వల్ల ట్రంప్​కు లాభమేంటి..? మోదీ బొమ్మ ట్రంప్​కు కలిసొస్తుందా?

Trump campaign video for Indian-Americans features PM Modi
అమెరికా అధ్యక్ష ఎన్నిక్లలో మోదీ బొమ్మ.. ట్రంప్​కు కలిసొచ్చేనా?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్​ అభ్యర్థి ట్రంప్​, డెమొక్రాట్ల అభ్యర్థి బో బైడెన్​ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తమదైన రీతిలో ప్రచార కార్యక్రమాలతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇండో-అమెరికన్​, ఆఫ్రికన్​-అమెరికన్​ ఓట్లను ఆకర్షించేందుకు భారత సంతతి మహిళ కమాలా హ్యారిస్​కు ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేశారు బైడెన్​. అయితే ట్రంప్ కూడా ఇండో-అమెరికన్లను ఆకర్షించేందుకు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీనే రంగంలోకి దించారు. ఎలా అంటారా..?

వీడియోతో చెప్పించారు...!

"ఫోర్​ మోర్​ ఇయర్స్​" పేరిట విడుదలైన 107 సెకన్ల ట్రంప్​ ప్రచార వీడియోలో.. మోదీ కనిపించారు. గతేడాది మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో హ్యూస్టన్​లోని ఎన్​ఆర్​జీ స్టేడియంలో 'హౌడీ మోడీ' పేరిట భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ చారిత్రక కార్యక్రమంలో దాదాపు 55 వేల మందికి పైగా ఇండో-అమెరికన్లు హాజరయ్యారు. అయితే ఆ వేదికపై మోదీ-ట్రంప్​ చేయి పట్టుకొని తీసుకున్న ఫొటో, ప్రసంగం సన్నివేశాలను తాజాగా తమ వీడియోలో పెట్టింది ట్రంప్​ ప్రచార బృందం.

ఆ సభలో ప్రసంగించిన మోదీ.. ట్రంప్​ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేర్కొన్నారు. దాదాపు అన్ని దేశాల చర్చల్లో ఆయన పేరు ప్రస్తావనకు వస్తుందని కితాబిచ్చారు. ఆ బైట్​ను ప్రచార వీడియోలో పెట్టింది ట్రంప్​ బృందం.

ఇండో-అమెరికన్లలో మోదీకి విశేషాదరణ ఉంది. ఆయన చెప్తే ప్రజలు వింటారని ట్రంప్​ వర్గానికి నమ్మకం. అంతేకాదు 2015లోనూ మాడిసన్​ స్క్వేర్​ గార్డెన్​లో, 2017లో సిలికాన్​ వ్యాలీలో మోదీ ప్రసగించారు. ఒక్కో కార్యక్రమానికి దాదాపు 20 వేల మందికి పైగా హాజరయ్యారు. అమెరికాలో భారీ ర్యాలీల్లో పాల్గొన్న విదేశీ నేత ప్రధాని మోదీ మాత్రమే. కాబట్టి మోదీ ఇమేజ్​ను తన ప్రచారం కోసం వాడుకోవాలని ట్రంప్ వర్గం​ భావిస్తోంది.

వాళ్లను ఆకర్షించేందుకే...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా ఉన్న ఇండో-అమెరికన్ల ఓట్​ బ్యాంక్​ను ఒడిసిపట్టాలని ట్రంప్​ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇండో-అమెరికన్లు దాదాపు 25 లక్షల మంది ఈ ఏడాది ఓటింగ్​లో పాల్గొంటారని అంచనా. మిషిగన్​, పెన్సిల్వేనియా, ఒహాయో ప్రాంతాల్లో ఇండో-అమెరికన్లకు మంచి పట్టు ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న సిక్కులు, హిందువుల కోసం ప్రత్యేకంగా గ్రూప్​లు పెడుతున్నాయి ఆయా పార్టీలు. అందుకే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం​ సహా ట్రంప్​ అహ్మదాబాద్​లోని మోతేరాలో చేసిన ప్రసంగం బైట్​ను.. రిపబ్లికన్ల​ ప్రచార వీడియోలో జోడించారు.

America enjoys a great relationship with India and our campaign enjoys great support from Indian Americans! 👍🏻🇺🇸 pic.twitter.com/bkjh6HODev

— Kimberly Guilfoyle (@kimguilfoyle) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ట్రంప్​ను కుటుంబంగా మోదీ అభివర్ణించడం సహా డొనాల్డ్​ భారతీయుల గురించి చెప్పిన మాటలను ప్రచార వీడియోలో జతచేశారు.

"భారత్​ను అమెరికా ప్రేమిస్తోంది. గౌరవిస్తోంది. భారతీయులకు అమెరికా ఎప్పుడూ నమ్మకమైన స్నేహితుడు. భారత ప్రజలు నిజంగా అద్భుతమైనవారు" అని ట్రంప్​ బైట్​ను ఆ వీడియోలో చేర్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చారు ట్రంప్​. ఆయన సతీమణి మోలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్​ సహా పలువురు ప్రభుత్వాధికారులు భారత్​కు వచ్చారు. మోతేరా వేదికగా 'నమస్తే ట్రంప్' పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో లక్షా 10 వేల మంది భారతీయులు పాల్గొన్నారు.

'ద రిపబ్లికన్ నేషనల్​ కన్వెన్షన్'​ వచ్చే వారం జరగనుంది. వర్చువల్​గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ల తరఫున తన నామినేషన్​పై అధికారిక ప్రకటన చేస్తూ.. ఆగస్టు 27న ట్రంప్​ ప్రసంగం చేయనున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్​ అభ్యర్థి ట్రంప్​, డెమొక్రాట్ల అభ్యర్థి బో బైడెన్​ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తమదైన రీతిలో ప్రచార కార్యక్రమాలతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇండో-అమెరికన్​, ఆఫ్రికన్​-అమెరికన్​ ఓట్లను ఆకర్షించేందుకు భారత సంతతి మహిళ కమాలా హ్యారిస్​కు ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేశారు బైడెన్​. అయితే ట్రంప్ కూడా ఇండో-అమెరికన్లను ఆకర్షించేందుకు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీనే రంగంలోకి దించారు. ఎలా అంటారా..?

వీడియోతో చెప్పించారు...!

"ఫోర్​ మోర్​ ఇయర్స్​" పేరిట విడుదలైన 107 సెకన్ల ట్రంప్​ ప్రచార వీడియోలో.. మోదీ కనిపించారు. గతేడాది మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో హ్యూస్టన్​లోని ఎన్​ఆర్​జీ స్టేడియంలో 'హౌడీ మోడీ' పేరిట భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ చారిత్రక కార్యక్రమంలో దాదాపు 55 వేల మందికి పైగా ఇండో-అమెరికన్లు హాజరయ్యారు. అయితే ఆ వేదికపై మోదీ-ట్రంప్​ చేయి పట్టుకొని తీసుకున్న ఫొటో, ప్రసంగం సన్నివేశాలను తాజాగా తమ వీడియోలో పెట్టింది ట్రంప్​ ప్రచార బృందం.

ఆ సభలో ప్రసంగించిన మోదీ.. ట్రంప్​ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేర్కొన్నారు. దాదాపు అన్ని దేశాల చర్చల్లో ఆయన పేరు ప్రస్తావనకు వస్తుందని కితాబిచ్చారు. ఆ బైట్​ను ప్రచార వీడియోలో పెట్టింది ట్రంప్​ బృందం.

ఇండో-అమెరికన్లలో మోదీకి విశేషాదరణ ఉంది. ఆయన చెప్తే ప్రజలు వింటారని ట్రంప్​ వర్గానికి నమ్మకం. అంతేకాదు 2015లోనూ మాడిసన్​ స్క్వేర్​ గార్డెన్​లో, 2017లో సిలికాన్​ వ్యాలీలో మోదీ ప్రసగించారు. ఒక్కో కార్యక్రమానికి దాదాపు 20 వేల మందికి పైగా హాజరయ్యారు. అమెరికాలో భారీ ర్యాలీల్లో పాల్గొన్న విదేశీ నేత ప్రధాని మోదీ మాత్రమే. కాబట్టి మోదీ ఇమేజ్​ను తన ప్రచారం కోసం వాడుకోవాలని ట్రంప్ వర్గం​ భావిస్తోంది.

వాళ్లను ఆకర్షించేందుకే...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా ఉన్న ఇండో-అమెరికన్ల ఓట్​ బ్యాంక్​ను ఒడిసిపట్టాలని ట్రంప్​ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇండో-అమెరికన్లు దాదాపు 25 లక్షల మంది ఈ ఏడాది ఓటింగ్​లో పాల్గొంటారని అంచనా. మిషిగన్​, పెన్సిల్వేనియా, ఒహాయో ప్రాంతాల్లో ఇండో-అమెరికన్లకు మంచి పట్టు ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న సిక్కులు, హిందువుల కోసం ప్రత్యేకంగా గ్రూప్​లు పెడుతున్నాయి ఆయా పార్టీలు. అందుకే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం​ సహా ట్రంప్​ అహ్మదాబాద్​లోని మోతేరాలో చేసిన ప్రసంగం బైట్​ను.. రిపబ్లికన్ల​ ప్రచార వీడియోలో జోడించారు.

  • America enjoys a great relationship with India and our campaign enjoys great support from Indian Americans! 👍🏻🇺🇸 pic.twitter.com/bkjh6HODev

    — Kimberly Guilfoyle (@kimguilfoyle) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ట్రంప్​ను కుటుంబంగా మోదీ అభివర్ణించడం సహా డొనాల్డ్​ భారతీయుల గురించి చెప్పిన మాటలను ప్రచార వీడియోలో జతచేశారు.

"భారత్​ను అమెరికా ప్రేమిస్తోంది. గౌరవిస్తోంది. భారతీయులకు అమెరికా ఎప్పుడూ నమ్మకమైన స్నేహితుడు. భారత ప్రజలు నిజంగా అద్భుతమైనవారు" అని ట్రంప్​ బైట్​ను ఆ వీడియోలో చేర్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చారు ట్రంప్​. ఆయన సతీమణి మోలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్​ సహా పలువురు ప్రభుత్వాధికారులు భారత్​కు వచ్చారు. మోతేరా వేదికగా 'నమస్తే ట్రంప్' పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో లక్షా 10 వేల మంది భారతీయులు పాల్గొన్నారు.

'ద రిపబ్లికన్ నేషనల్​ కన్వెన్షన్'​ వచ్చే వారం జరగనుంది. వర్చువల్​గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ల తరఫున తన నామినేషన్​పై అధికారిక ప్రకటన చేస్తూ.. ఆగస్టు 27న ట్రంప్​ ప్రసంగం చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.