ETV Bharat / international

'భారత్​లో పరిస్థితి చూసి హృదయం ముక్కలైంది'

author img

By

Published : May 7, 2021, 10:03 PM IST

Updated : May 7, 2021, 10:36 PM IST

భారత్​లో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండటం హృదయవిదారకమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మహమ్మారి ప్రారంభ దశలో అమెరికాకు భారత్ సహకరించిందని గుర్తుచేసుకున్నారు.

kamala harris
కమలా హారిస్

భారత్​లో కొవిడ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో నమోదవటం.. హృదయవిదారకమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇప్పటికే భారత్​కు ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర వైద్య సామగ్రిని పంపించామన్నారు.

భారత్​తో పాటు ఇతర దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్లు అందించేందుకు మేధో హక్కులను తొలగించేందుకు తాము మద్దతిచ్చామన్నారు కమల. మహమ్మారి ప్రారంభ దశలో అమెరికాకు భారత్ సహకరించిందని గుర్తు చేసుకున్నారు.

మూలాలు భారత్​లోనే..

తన వంశం మూలాలు భారత్​లోనే ఉన్నాయని కమల అన్నారు. తన తల్లి భారత్​లోనే పుట్టి, పెరిగారని తెలిపారు.. అమెరికాకు భారత్ సంక్షేమం అత్యంత ముఖ్యమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో భారత్​కు సాయ పడేందుకు బైడెన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

" మహమ్మారి ప్రారంభ దశలో అమెరికాకు భారత్ సహకారం అందించింది. ప్రస్తుతం మేము భారత్​కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్​ మాకు మంచి నేస్తం. అందుకే సాయం చేస్తున్నాం. ప్రపంచ దేశాలు కలిసి పనిచేస్తే.. మహమ్మారిని అంతం చేయొచ్చు. ఇప్పటికే భారత్​కు ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర వైద్య సామగ్రిని పంపించాం. భారత్​తో పాటు ఇతర దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్లు అందించేందుకు మేధో హక్కులను తొలగించేందుకు మద్దతిచ్చాం."

-- కమాలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు

గడిచిన వారం రోజుల్లోనే బైడెన్ ప్రభుత్వం.. భారత్​కు 100 మిలియన్ డాలర్ల సాయం చేసిందన్నారు హారిస్​.

ఇదీ చదవండి : ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఓ మృగరాజుకు కరోనా

భారత్​లో కొవిడ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో నమోదవటం.. హృదయవిదారకమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇప్పటికే భారత్​కు ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర వైద్య సామగ్రిని పంపించామన్నారు.

భారత్​తో పాటు ఇతర దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్లు అందించేందుకు మేధో హక్కులను తొలగించేందుకు తాము మద్దతిచ్చామన్నారు కమల. మహమ్మారి ప్రారంభ దశలో అమెరికాకు భారత్ సహకరించిందని గుర్తు చేసుకున్నారు.

మూలాలు భారత్​లోనే..

తన వంశం మూలాలు భారత్​లోనే ఉన్నాయని కమల అన్నారు. తన తల్లి భారత్​లోనే పుట్టి, పెరిగారని తెలిపారు.. అమెరికాకు భారత్ సంక్షేమం అత్యంత ముఖ్యమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో భారత్​కు సాయ పడేందుకు బైడెన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

" మహమ్మారి ప్రారంభ దశలో అమెరికాకు భారత్ సహకారం అందించింది. ప్రస్తుతం మేము భారత్​కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్​ మాకు మంచి నేస్తం. అందుకే సాయం చేస్తున్నాం. ప్రపంచ దేశాలు కలిసి పనిచేస్తే.. మహమ్మారిని అంతం చేయొచ్చు. ఇప్పటికే భారత్​కు ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర వైద్య సామగ్రిని పంపించాం. భారత్​తో పాటు ఇతర దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్లు అందించేందుకు మేధో హక్కులను తొలగించేందుకు మద్దతిచ్చాం."

-- కమాలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు

గడిచిన వారం రోజుల్లోనే బైడెన్ ప్రభుత్వం.. భారత్​కు 100 మిలియన్ డాలర్ల సాయం చేసిందన్నారు హారిస్​.

ఇదీ చదవండి : ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఓ మృగరాజుకు కరోనా

Last Updated : May 7, 2021, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.