ETV Bharat / international

కరోనాను జయించిన వారి సాయంతో వైరస్​కు కళ్లెం!

author img

By

Published : May 11, 2020, 12:24 PM IST

లాక్​డౌన్​ ఆంక్షలు సడలించిన క్రమంలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుందనే ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో కొత్త కేసులు పెరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఓ పరిష్కారాన్ని చూపారు అమెరికాకు చెందిన పరిశోధకులు. వైరస్​ నుంచి కోలుకున్న వ్యక్తులు ఇందుకు ఉపయోగపడతారని తేల్చారు. మరి అదేలాగో తెలుసుకుందాం.

COVID-19
కరోనా నుంచి కోలుకున్న వారే వైరస్​ వ్యాప్తిని అడ్డుకోగలరని తెలుసా!

కరోనా వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి ప్రపంచదేశాలు. అయితే ఆంక్షలు సడలిస్తే కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలంటే ఆంక్షలు సడలించక తప్పడం లేదు.

ఈ విపత్కర పరిస్థితిని దీటుగా ఎదుర్కొనేందుకు ఓ పరిష్కార మార్గాన్ని చూపారు అమెరికాలోని జార్జియా సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకులు. కరోనా నుంచి కోలుకున్నవారు.. ఈ మహమ్మారి వ్యాప్తి రేటును తగ్గించేందుకు ఉపయోగపడతారని వెల్లడించారు. నేచర్​ మెడిసిన్​ జర్నల్​లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

ఎలా..?

కరోనా నుంచి కోలుకున్న వారిలోని షీల్డ్​ ఇమ్యూనిటీ.. మరోమారు వైరస్​ బారిన పడే అవకాశాలను బాగా తగ్గిస్తుందని అంచనా వేశారు పరిశోధకులు. ఆరోగ్య కేంద్రాలతో పాటు మనుషుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేందుకు వీరు సురక్షిత ప్రత్యమ్నాయంగా ఉపయోగపడతారని వెల్లడించారు. దీని ద్వారా వైరస్​ వ్యాప్తి రేటు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

" కరోనా నుంచి కోలుకున్న వారి సాయంతో ఎక్కువ మందిని వైరస్​ బారి నుంచి కాపాడవచ్చు. కరోనా వైరస్​ నుంచి రక్షించే యాంటీబాడీలు కలిగిన వారిని గుర్తించేందుకు విశ్వసనీయ పరీక్షలేమి ఇప్పటి వరకు లేవు. అయితే.. సెరోలాజికల్​ పరీక్షల ద్వారా కొవిడ్​-19 నుంచి కోలుకున్న వారిని గుర్తించటంపై మేము దృష్టి సారించాం."

- పరిశోధకులు, జార్జియా సాంకేతిక విశ్వవిద్యాలయం

కానీ..?

అయితే ఈ విధానం అమలుపై పరిశోధకులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కరోనాను జయించిన వారిలో వైరస్​ తిరిగి సోకకుండా నిరోధించే రోగనిరోధక శక్తి ఎంత కాలం ఉంటుందనేది తెలియదన్నారు. గతంలో సార్స్​ వంటి వైరస్​ల బారిన పడి కోలుకున్న వారిలో యాంటీబాడీలు సుమారు 2 ఏళ్ల పాటు ఉన్నట్లు తెలిపారు. మెర్స్​ వంటి వైరస్​ల నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి సుమారు 3 ఏళ్లు ఉన్నట్లు చెప్పారు.

కరోనా వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి ప్రపంచదేశాలు. అయితే ఆంక్షలు సడలిస్తే కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలంటే ఆంక్షలు సడలించక తప్పడం లేదు.

ఈ విపత్కర పరిస్థితిని దీటుగా ఎదుర్కొనేందుకు ఓ పరిష్కార మార్గాన్ని చూపారు అమెరికాలోని జార్జియా సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకులు. కరోనా నుంచి కోలుకున్నవారు.. ఈ మహమ్మారి వ్యాప్తి రేటును తగ్గించేందుకు ఉపయోగపడతారని వెల్లడించారు. నేచర్​ మెడిసిన్​ జర్నల్​లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

ఎలా..?

కరోనా నుంచి కోలుకున్న వారిలోని షీల్డ్​ ఇమ్యూనిటీ.. మరోమారు వైరస్​ బారిన పడే అవకాశాలను బాగా తగ్గిస్తుందని అంచనా వేశారు పరిశోధకులు. ఆరోగ్య కేంద్రాలతో పాటు మనుషుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేందుకు వీరు సురక్షిత ప్రత్యమ్నాయంగా ఉపయోగపడతారని వెల్లడించారు. దీని ద్వారా వైరస్​ వ్యాప్తి రేటు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

" కరోనా నుంచి కోలుకున్న వారి సాయంతో ఎక్కువ మందిని వైరస్​ బారి నుంచి కాపాడవచ్చు. కరోనా వైరస్​ నుంచి రక్షించే యాంటీబాడీలు కలిగిన వారిని గుర్తించేందుకు విశ్వసనీయ పరీక్షలేమి ఇప్పటి వరకు లేవు. అయితే.. సెరోలాజికల్​ పరీక్షల ద్వారా కొవిడ్​-19 నుంచి కోలుకున్న వారిని గుర్తించటంపై మేము దృష్టి సారించాం."

- పరిశోధకులు, జార్జియా సాంకేతిక విశ్వవిద్యాలయం

కానీ..?

అయితే ఈ విధానం అమలుపై పరిశోధకులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కరోనాను జయించిన వారిలో వైరస్​ తిరిగి సోకకుండా నిరోధించే రోగనిరోధక శక్తి ఎంత కాలం ఉంటుందనేది తెలియదన్నారు. గతంలో సార్స్​ వంటి వైరస్​ల బారిన పడి కోలుకున్న వారిలో యాంటీబాడీలు సుమారు 2 ఏళ్ల పాటు ఉన్నట్లు తెలిపారు. మెర్స్​ వంటి వైరస్​ల నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి సుమారు 3 ఏళ్లు ఉన్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.