ETV Bharat / international

'అమెరికా-భారత్​ సంబంధాలు బలపడడానికి ఆయనే కారణం'

author img

By

Published : Jan 6, 2021, 10:38 AM IST

భారత విదేశాంగ మంత్రి ఎస్​ జయశంకర్​ దౌత్య చతురత వల్ల అమెరికా, భారత్​ మధ్య సంబంధాలు బలపడ్డాయని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో అన్నారు. జయశంకర్​ దౌత్యవేత్తే కాకుండా గొప్ప నాయకుడని కొనియాడారు.

Pompeo praises Jaishankar for advancing US-India ties
'అమెరికా-భారత్​ సంబంధాలు బలపడడానికి ఆయనే కారణం'

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్​ జయశంకర్​ గొప్ప దౌత్యవేత్త అని అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో కొనియాడారు. భారత్​-అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి జయశంకర్​ చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. జయశంకర్​ కనబరచిన దౌత్య చతురత వల్లనే భారత్​-అమెరికాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలపడ్డాయని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఇదే ట్వీట్​లో జయశంకర్​కు ధన్యవాదాలు తెలిపారు. జయశంకర్​తో ఉన్న ఫొటోను పోస్ట్​ చేశారు. జనవరి 20న అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి జో బైడన్ సిద్ధమవుతుండగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

The U.S.-India relationship was made all the stronger with a great diplomat and leader as my friend. Thank you @Jaishankar. #HowdyModi #ModiHaitoMumkinHai pic.twitter.com/vpxitHiNJS

— Secretary Pompeo (@SecPompeo) January 5, 2021

'హౌడీ మోదీ' హ్యష్​ ట్యాగ్​ ను ట్విట్టర్​లో పంచుకొని, 2019లో మోదీ, ట్రంప్​ల మధ్య జరిగిన ఆ సమావేశాన్ని గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా 'మోదీ హైతో ముక్తిన్​ హై' హ్యాష్​ట్యాగ్​ని పోస్టు చేశారు. కాగా ఇరు దేశాల మధ్య ప్రాంతీయ, ద్వైపాక్షిక సమస్యల పరిష్కారం కోసం ఇరువురు విదేశాంగ మంత్రులు తరుచుగా ఫోన్​లో మాట్లాడుకుంటూ.. ఉంటారు.

ఇదీ చూడండి: అమెరికాకు భారత్ విలువైన భాగస్వామి: పాంపియో

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్​ జయశంకర్​ గొప్ప దౌత్యవేత్త అని అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో కొనియాడారు. భారత్​-అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి జయశంకర్​ చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. జయశంకర్​ కనబరచిన దౌత్య చతురత వల్లనే భారత్​-అమెరికాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలపడ్డాయని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఇదే ట్వీట్​లో జయశంకర్​కు ధన్యవాదాలు తెలిపారు. జయశంకర్​తో ఉన్న ఫొటోను పోస్ట్​ చేశారు. జనవరి 20న అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి జో బైడన్ సిద్ధమవుతుండగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

'హౌడీ మోదీ' హ్యష్​ ట్యాగ్​ ను ట్విట్టర్​లో పంచుకొని, 2019లో మోదీ, ట్రంప్​ల మధ్య జరిగిన ఆ సమావేశాన్ని గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా 'మోదీ హైతో ముక్తిన్​ హై' హ్యాష్​ట్యాగ్​ని పోస్టు చేశారు. కాగా ఇరు దేశాల మధ్య ప్రాంతీయ, ద్వైపాక్షిక సమస్యల పరిష్కారం కోసం ఇరువురు విదేశాంగ మంత్రులు తరుచుగా ఫోన్​లో మాట్లాడుకుంటూ.. ఉంటారు.

ఇదీ చూడండి: అమెరికాకు భారత్ విలువైన భాగస్వామి: పాంపియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.