ETV Bharat / international

భారత్​లో 5 కోట్ల మందికి ​కరోనా ముప్పు!

author img

By

Published : May 21, 2020, 1:20 PM IST

భారత్​లో కనీసం 5 కోట్ల మందికిపైగా చేతులు శుభ్రం చేసుకునేందుకు అవసరమైన కనీస సదుపాయాలు లేవని అమెరికా పరిశోధనలో వెల్లడైంది. వారు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.

Over 50 million Indians lack handwashing access
'హ్యాండ్​వాష్ సదుపాయాల్లేక 5 కోట్ల మందికి ​కరోనా ముప్పు'

కరోనా మహమ్మారి నియంత్రణకు చేతులు శుభ్రంగా ఉంచుకోవడమే చాలా కీలకం. భారత్​లో 5కోట్ల మందికిపైగా ఈ కనీస సదుపాయం అందుబాటులో లేదని అమెరికా పరిశోధన వెల్లడించింది. నీరు, సబ్బు, శానిటైజర్లకు నోచుకోలేని పేద ప్రజలకే వైరస్​ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించింది.

అమెరికా వాషింగ్టన్​లోని ఇనిస్టిట్యూట్​ ఫర్ హెల్త్ మెట్రిక్స్​ అండ్ ఎవాల్యుయేషన్​(ఐహెచ్​ఎంఈ) పరిశోధకులు ఈ అధ్యయాన్ని ఎన్విరాన్​మెంటల్​ హెల్త్​ పర్స్పెక్టివ్​ జర్నల్​లో ప్రచురించారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు, సబ్బు వంటి కనీస సదుపాయాలు లేని వారు పేద, మధ్య తరగతి దేశాల్లో దాదాపు 200 కోట్ల మందికిపైగా ఉన్నారని పరిశోధన వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచ జనాభాలో 25 శాతమని పేర్కొంది. సంపన్న దేశాలతో పోల్చితే వీరికే కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

అధ్యయనం ప్రకారం ఉప-సహారా ఆఫ్రికా, సముద్ర ప్రాంత దేశాల్లోని 50 శాతం మందికి సరైన హ్యాండ్​వాష్ సదుపాయలు లేవు. 46 దేశాల్లోని సగానికిపైగా ప్రజలకు సబ్బు, నీరు అందుబాటులో లేవు.

భారత్​, పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్​, నైజీరియా, ఇథియోపియా, డీఆర్​ కాంగో, ఇండోనేసియా వంటి ఒక్కో దేశంలో 5 కోట్ల మందికిపైగా ప్రజలకు చేతులు శుభ్రం చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేవని అధ్యయనం వెల్లడించింది. తాత్కాలికంగా శానిటైజర్లు, వాటర్​ ట్యాంకర్లు ఏర్పాటు చేసినా, అవి శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేసింది.

ఏటా 7 లక్షల ప్రాణాలు..

హ్యాండ్​వాష్​ సమస్యను పరిష్కరించకపోతే కొవిడ్ కారణంగా ఏటా 7లక్షల మంది పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధనలో పాల్గొన్న బ్రూయెర్ హెచ్చరించారు. ప్రపంచ జనాభాలో 25 శాతం మందికి హ్యాండ్​వాష్ సదుపాయాలు కరవయ్యాయని, 1990 నుంచి 2019 మధ్యకాలంలో క్రమంగా మెరుగుపడుతున్నట్లు పేర్కొన్నారు. సౌదీ అరెేబియా, మొరాకో, నేపాల్​, టాంజానియా, దేశాల్లో పరిశుభ్రత మెరుగుపడినట్లు వివరించారు.

పాఠశాలలు, పనిప్రదేశాలు, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్లు వంటి సమూహ ప్రాంతాల్లో హ్యాండ్​వాష్ సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశోధన అంచనా వేయలేకపోయింది.

ఆఫ్రికాలో ఈ ఏడాది 1,90,000మంది కరోనా కారణంగా మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఇప్పటికే హెచ్చరించింది. 44 లక్షల మంది వైరస్​ బారిన పడతారని అంచనా వేసింది.

కరోనా మహమ్మారి నియంత్రణకు చేతులు శుభ్రంగా ఉంచుకోవడమే చాలా కీలకం. భారత్​లో 5కోట్ల మందికిపైగా ఈ కనీస సదుపాయం అందుబాటులో లేదని అమెరికా పరిశోధన వెల్లడించింది. నీరు, సబ్బు, శానిటైజర్లకు నోచుకోలేని పేద ప్రజలకే వైరస్​ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించింది.

అమెరికా వాషింగ్టన్​లోని ఇనిస్టిట్యూట్​ ఫర్ హెల్త్ మెట్రిక్స్​ అండ్ ఎవాల్యుయేషన్​(ఐహెచ్​ఎంఈ) పరిశోధకులు ఈ అధ్యయాన్ని ఎన్విరాన్​మెంటల్​ హెల్త్​ పర్స్పెక్టివ్​ జర్నల్​లో ప్రచురించారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు, సబ్బు వంటి కనీస సదుపాయాలు లేని వారు పేద, మధ్య తరగతి దేశాల్లో దాదాపు 200 కోట్ల మందికిపైగా ఉన్నారని పరిశోధన వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచ జనాభాలో 25 శాతమని పేర్కొంది. సంపన్న దేశాలతో పోల్చితే వీరికే కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

అధ్యయనం ప్రకారం ఉప-సహారా ఆఫ్రికా, సముద్ర ప్రాంత దేశాల్లోని 50 శాతం మందికి సరైన హ్యాండ్​వాష్ సదుపాయలు లేవు. 46 దేశాల్లోని సగానికిపైగా ప్రజలకు సబ్బు, నీరు అందుబాటులో లేవు.

భారత్​, పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్​, నైజీరియా, ఇథియోపియా, డీఆర్​ కాంగో, ఇండోనేసియా వంటి ఒక్కో దేశంలో 5 కోట్ల మందికిపైగా ప్రజలకు చేతులు శుభ్రం చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేవని అధ్యయనం వెల్లడించింది. తాత్కాలికంగా శానిటైజర్లు, వాటర్​ ట్యాంకర్లు ఏర్పాటు చేసినా, అవి శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేసింది.

ఏటా 7 లక్షల ప్రాణాలు..

హ్యాండ్​వాష్​ సమస్యను పరిష్కరించకపోతే కొవిడ్ కారణంగా ఏటా 7లక్షల మంది పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధనలో పాల్గొన్న బ్రూయెర్ హెచ్చరించారు. ప్రపంచ జనాభాలో 25 శాతం మందికి హ్యాండ్​వాష్ సదుపాయాలు కరవయ్యాయని, 1990 నుంచి 2019 మధ్యకాలంలో క్రమంగా మెరుగుపడుతున్నట్లు పేర్కొన్నారు. సౌదీ అరెేబియా, మొరాకో, నేపాల్​, టాంజానియా, దేశాల్లో పరిశుభ్రత మెరుగుపడినట్లు వివరించారు.

పాఠశాలలు, పనిప్రదేశాలు, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్లు వంటి సమూహ ప్రాంతాల్లో హ్యాండ్​వాష్ సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశోధన అంచనా వేయలేకపోయింది.

ఆఫ్రికాలో ఈ ఏడాది 1,90,000మంది కరోనా కారణంగా మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఇప్పటికే హెచ్చరించింది. 44 లక్షల మంది వైరస్​ బారిన పడతారని అంచనా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.