ETV Bharat / international

న్యూయార్క్​ అసెంబ్లీలో 'కశ్మీర్​' తీర్మానానికి ఆమోదం - కశ్మీర్​ తీర్మానం ఆమోదం

న్యూయార్క్​ అసెంబ్లీ 'కశ్మీర్'​ తీర్మానాన్ని ఆమోదించడంపై భారత్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 5ను 'కశ్మీర్​ అమెరికన్​ డే'గా గుర్తించాలని కోరుతూ కొందరు శాసనసభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

New York Assembly passes Kashmir resolution
న్యూయార్క్​ అసెంబ్లీలో 'కశ్మీర్​' తీర్మానానికి ఆమోదం
author img

By

Published : Feb 7, 2021, 2:51 PM IST

ఫిబ్రవరి 5వ తేదీని 'కశ్మీర్​ అమెరికన్​ డే'గా గుర్తించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని న్యూయార్క్ అసెంబ్లీ ఆమోదించింది . దీన్ని తీవ్రంగా ఖండించిన భారత్... జమ్ము కశ్మీర్​ సంస్కృతిని, ఔన్నత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇదని విమర్శించింది.

అసెంబ్లీ సభ్యుడు నాదర్ సయేగ్ సహా 12 మంతి శాసనసభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. "కశ్మీర్​ సమాజం ప్రతికూలతలను అధిగమించింది. పట్టుదలతో ఉంది. న్యూయార్క్​​ వలసవాదులందరిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించించుకుంది. కశ్మీరీ ప్రజలకు మత స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మొదలైన మానవహక్కులను కల్పించడానికి న్యూయార్క్​ ప్రయత్నిస్తుంది" అని తీర్మానంలో పేర్కొన్నారు.

ఈ తీర్మానంపై స్పందించిన వాషింగ్టన్​లోని భారత దౌత్యకార్యాలయ ప్రతినిధి... అమెరికా లాగే భారత్​ కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. భిన్నమైన సంస్కృతికి భారత్​ నిదర్శమని తెలిపారు. అందులో జమ్ము కశ్మీర్​ భాగమేనని గుర్తుచేశారు. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. ఇది ప్రజలను విడదీసే ప్రయత్నమని తెలిపిన ఆయన.... న్యూయార్క్​లోని శాసనసభ్యులను కలిసి భారత్​-అమెరికా సత్సంబంధాలు, ప్రవాస భారతీయులపై చర్చిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:తైవాన్​లోకి చైనా మరో చొరబాటు యత్నం!

ఫిబ్రవరి 5వ తేదీని 'కశ్మీర్​ అమెరికన్​ డే'గా గుర్తించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని న్యూయార్క్ అసెంబ్లీ ఆమోదించింది . దీన్ని తీవ్రంగా ఖండించిన భారత్... జమ్ము కశ్మీర్​ సంస్కృతిని, ఔన్నత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇదని విమర్శించింది.

అసెంబ్లీ సభ్యుడు నాదర్ సయేగ్ సహా 12 మంతి శాసనసభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. "కశ్మీర్​ సమాజం ప్రతికూలతలను అధిగమించింది. పట్టుదలతో ఉంది. న్యూయార్క్​​ వలసవాదులందరిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించించుకుంది. కశ్మీరీ ప్రజలకు మత స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మొదలైన మానవహక్కులను కల్పించడానికి న్యూయార్క్​ ప్రయత్నిస్తుంది" అని తీర్మానంలో పేర్కొన్నారు.

ఈ తీర్మానంపై స్పందించిన వాషింగ్టన్​లోని భారత దౌత్యకార్యాలయ ప్రతినిధి... అమెరికా లాగే భారత్​ కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. భిన్నమైన సంస్కృతికి భారత్​ నిదర్శమని తెలిపారు. అందులో జమ్ము కశ్మీర్​ భాగమేనని గుర్తుచేశారు. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. ఇది ప్రజలను విడదీసే ప్రయత్నమని తెలిపిన ఆయన.... న్యూయార్క్​లోని శాసనసభ్యులను కలిసి భారత్​-అమెరికా సత్సంబంధాలు, ప్రవాస భారతీయులపై చర్చిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:తైవాన్​లోకి చైనా మరో చొరబాటు యత్నం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.