ETV Bharat / international

2020 ఎన్నికల ప్రచారంలో ట్రంప్​ వెనుకంజ!

2020లో జరగనున్న అమెరికా ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వెనకబడ్డారని ఫాక్స్ న్యూస్ ప్రకటించింది. తాము నిర్వహించిన నమూనా పోల్​ జాబితాలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వ పోటీలో ఉన్న జో బిడెన్ మొదటి స్థానంలో నిలిచారని వెల్లడించింది.

author img

By

Published : Jun 17, 2019, 8:42 AM IST

అధ్యక్ష ఎన్నిక ప్రచారంలో వెనకబడిన ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వెనకబడ్డారని తేల్చింది ఫాక్స్​ న్యూస్. ఈ సర్వేలో జో బిడెన్​కు డెమొక్రాటిక్ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారని వెల్లడించింది. 2020 అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా 500 రోజుల ముందు ఈ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. జూన్ 9 నుంచి 12 మధ్య ఈ సర్వే నిర్వహించారు.

ఫాక్స్ న్యూస్ పోలింగ్​లో జో బిడెన్​కు 49 శాతం ఓట్లు లభించగా, ట్రంప్​కు 39 శాతం ఓట్లు లభించాయి.

సెనేటర్ బెర్నీ సాండర్స్​కూ 49 శాతం ఓటింగ్ లభించింది. సెనేటర్లు ఎలిజబెత్ వార్రెన్, కమలా హారిస్​, ఇండియానా రాష్ట్రంలోని సౌత్ బెండ్ మేయర్ పీట్ బట్టిగీగ్​లూ డొనాల్డ్​తో పోల్చితే కొంత మెరుగైన ఫలితాలు సాధించారు.

ఇప్పటివరకు ట్రంప్ అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. మంగళవారం ఫ్లోరిడాలోని ఓర్నాల్డో వేదికగా ప్రచార శంఖారావం పూరించనున్నారు ట్రంప్.

ఇదీ చూడండి: టార్గెట్​ యూపీ... ప్రియాంక వ్యూహం ఫలించేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వెనకబడ్డారని తేల్చింది ఫాక్స్​ న్యూస్. ఈ సర్వేలో జో బిడెన్​కు డెమొక్రాటిక్ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారని వెల్లడించింది. 2020 అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా 500 రోజుల ముందు ఈ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. జూన్ 9 నుంచి 12 మధ్య ఈ సర్వే నిర్వహించారు.

ఫాక్స్ న్యూస్ పోలింగ్​లో జో బిడెన్​కు 49 శాతం ఓట్లు లభించగా, ట్రంప్​కు 39 శాతం ఓట్లు లభించాయి.

సెనేటర్ బెర్నీ సాండర్స్​కూ 49 శాతం ఓటింగ్ లభించింది. సెనేటర్లు ఎలిజబెత్ వార్రెన్, కమలా హారిస్​, ఇండియానా రాష్ట్రంలోని సౌత్ బెండ్ మేయర్ పీట్ బట్టిగీగ్​లూ డొనాల్డ్​తో పోల్చితే కొంత మెరుగైన ఫలితాలు సాధించారు.

ఇప్పటివరకు ట్రంప్ అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. మంగళవారం ఫ్లోరిడాలోని ఓర్నాల్డో వేదికగా ప్రచార శంఖారావం పూరించనున్నారు ట్రంప్.

ఇదీ చూడండి: టార్గెట్​ యూపీ... ప్రియాంక వ్యూహం ఫలించేనా?


Mumbai, May 01 (ANI): After Shiv Sena's proposal to ban burqa in public places, Union Minister Ramdas Athawale opposed Shiv Sena's demand to ban burqa in India and said, "Not all women, who wear burqa are terrorists, if they are terrorists their burqa should be removed. It's a tradition and they have the right to wear it, there shouldn't be a ban on burqa in India." Earlier on Monday Sri Lankan President Maithripala Sirisena on Monday issued an order banning face veils in public places.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.