ETV Bharat / international

యూఎన్​ఐఎస్​పీఎఫ్​ చీఫ్​కు ప్రవాసి భారతీయ సమ్మాన్​ అవార్డు - Pravasi Bharatiya Divas was

ప్రవాసి భారతీయ సమ్మాన్​ అవార్డును ఈ సారి 'యూఎస్​-ఇండియా స్ట్రాటజిక్​ అండ్​ పాట్నర్​షిప్​ ఫోరం' అధ్యక్షుడు ముకేశ్​ అఘితో పాటు మరో ముగ్గురు గెలుచుకున్నారు. వీరిలో తెలుగువారైన ప్రముఖ డాక్టర్​ సుధాకర్​ జొన్నలగడ్డ ఉన్నారు. అంతేగాక అమెరికాలోని ఫెడరేషన్​ ఆఫ్ ఇండియన్​ అసోసియేషన్​కు కూడా ఈ గౌరవం లభించింది.

Mukesh Aghi, FIA, 3 others from US conferred Pravasi Bharatiya Samman Award
ముకేశ్​ అఘికి భారతీయ సమ్మాన్​ అవార్డు
author img

By

Published : Jan 10, 2021, 1:41 PM IST

ప్రవాస భారతీయులకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం 'ప్రవాసి భారతీయ సమ్మాన్​' అవార్డును యూఎస్​-ఇండియా స్ట్రాటజిక్​ అండ్​ పాట్నర్​షిప్​ ఫోరం(యూఎస్​ఐఎస్​​పీఎఫ్​​) అధ్యక్షుడు ముకేశ్​ అఘితో పాటు మరో ముగ్గురు గెలుచుకున్నారు. వ్యాపార రంగానికి సంబంధించి ముకేశ్​కు ఈ అవార్డు లభించింది. పర్యావరణ సాంకేతిక రంగానికి గాను అర్​వింద్​ ఫుకన్​, భారతీయ సంపద్రాయాన్ని పెంపొందించినందుకు నీలు గుప్తా, వైద్యరంగంలో విశిష్ఠ సేవలందించినందుకు డా. సుధాకర్​ జొన్నగడ్డకు ఈ అవార్డులు ప్రకటించారు. అంతేకాక అమెరికాలోని ప్రఖ్యాత భారతీయ సంఘం అయిన 'ఫెడరేషన్​ ఆఫ్ ఇండియన్​ అసోసియేషన్'​కు కూడా ఈ గౌరవం లభించింది. ఫెడరేషన్​ చేసిన సామాజిక కార్యక్రమాలకు గానూ సంఘ సేవ విభాగం కింది అవార్డు లభించింది.

అమెరికాలో ఉండే ఎన్​ఆర్​ఐలకు ఈ బహుమతి ప్రదానం చేయడం వల్ల అమెరికా-భారత్​ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని ముకేశ్​ అఘి తెలిపారు. మోదీ-బైడెన్​ నాయకత్వంలో ఇరు దేశాలు పరస్పర అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

16వ ప్రవాసి భారతీయ దినోత్సవ సదస్సు​ను ఈ నెల 9న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో బలోపేతానికి కృషి చేసే దిశగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందిస్తోన్న భారత మూలాలుగల వ్యక్తులకు, సంఘాలకు ఈ బహుమతులను ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఇదీ చూడండి: 'మానవాళి రక్షణ కోసం దేశీయ టీకాలు సిద్ధం'

ప్రవాస భారతీయులకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం 'ప్రవాసి భారతీయ సమ్మాన్​' అవార్డును యూఎస్​-ఇండియా స్ట్రాటజిక్​ అండ్​ పాట్నర్​షిప్​ ఫోరం(యూఎస్​ఐఎస్​​పీఎఫ్​​) అధ్యక్షుడు ముకేశ్​ అఘితో పాటు మరో ముగ్గురు గెలుచుకున్నారు. వ్యాపార రంగానికి సంబంధించి ముకేశ్​కు ఈ అవార్డు లభించింది. పర్యావరణ సాంకేతిక రంగానికి గాను అర్​వింద్​ ఫుకన్​, భారతీయ సంపద్రాయాన్ని పెంపొందించినందుకు నీలు గుప్తా, వైద్యరంగంలో విశిష్ఠ సేవలందించినందుకు డా. సుధాకర్​ జొన్నగడ్డకు ఈ అవార్డులు ప్రకటించారు. అంతేకాక అమెరికాలోని ప్రఖ్యాత భారతీయ సంఘం అయిన 'ఫెడరేషన్​ ఆఫ్ ఇండియన్​ అసోసియేషన్'​కు కూడా ఈ గౌరవం లభించింది. ఫెడరేషన్​ చేసిన సామాజిక కార్యక్రమాలకు గానూ సంఘ సేవ విభాగం కింది అవార్డు లభించింది.

అమెరికాలో ఉండే ఎన్​ఆర్​ఐలకు ఈ బహుమతి ప్రదానం చేయడం వల్ల అమెరికా-భారత్​ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని ముకేశ్​ అఘి తెలిపారు. మోదీ-బైడెన్​ నాయకత్వంలో ఇరు దేశాలు పరస్పర అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

16వ ప్రవాసి భారతీయ దినోత్సవ సదస్సు​ను ఈ నెల 9న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో బలోపేతానికి కృషి చేసే దిశగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందిస్తోన్న భారత మూలాలుగల వ్యక్తులకు, సంఘాలకు ఈ బహుమతులను ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఇదీ చూడండి: 'మానవాళి రక్షణ కోసం దేశీయ టీకాలు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.