తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని(Mehul Choksi) మన దేశానికి రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మిషన్ చోక్సీ కింద ప్రత్యేక విమానం తీసుకుని డొమినికా దేశానికి వెళ్లిన 8 మంది సభ్యుల దర్యాప్తు బృందం.. బుధవారం అక్కడి న్యాయస్థానంలో జరిగే విచారణలో తన వాదన వినిపించనుంది. చోక్సీ(Mehul Choksi) డొమినికా పౌరుడు కాదనీ, అందువల్ల ఆ దేశానికి చెందిన వారికి ఉన్న ప్రాథమిక హక్కులు అతనికి ఉండవని మన బృందం చెప్పనుంది.
Mehul Choksi: దిల్లీలో దిగగానే చోక్సీ అరెస్ట్?
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని(Mehul Choksi) భారత్కు రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. భారత్ తరపున వెళ్లిన బృందం బుధవారం అక్కడి న్యాయస్థానంలో వాదన వినిపించనుంది. అంతా సవ్యంగా పూర్తయి, అప్పగింత జరిగినట్లయితే దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే చోక్సీని(Mehul Choksi) అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
![Mehul Choksi: దిల్లీలో దిగగానే చోక్సీ అరెస్ట్? Mehul Choksi latest update, మెహుల్ చోక్సీ కేసు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11974573-979-11974573-1622530200909.jpg?imwidth=3840)
అంతా సవ్యంగా పూర్తయి, అప్పగింత జరిగినట్లయితే దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెడుతూనే చోక్సీని(Mehul Choksi) అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. సీబీఐ, ఈడీ, సీఆర్పీఎఫ్లకు చెందినవారు దర్యాప్తు బృందంలో ఉన్నారు. బ్యాంకు అవకతవకల కేసులపై దర్యాప్తు నిమిత్తం సీబీఐలో ఉన్న విభాగానికి నేతృత్వం వహిస్తున్న శారదా రౌత్ ఈ బృందంలో కీలక సభ్యురాలు.
ఇదీ చదవండి : Mehul Choksi: 'ఛోక్సీని భారత్కు అప్పగించండి!'
తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని(Mehul Choksi) మన దేశానికి రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మిషన్ చోక్సీ కింద ప్రత్యేక విమానం తీసుకుని డొమినికా దేశానికి వెళ్లిన 8 మంది సభ్యుల దర్యాప్తు బృందం.. బుధవారం అక్కడి న్యాయస్థానంలో జరిగే విచారణలో తన వాదన వినిపించనుంది. చోక్సీ(Mehul Choksi) డొమినికా పౌరుడు కాదనీ, అందువల్ల ఆ దేశానికి చెందిన వారికి ఉన్న ప్రాథమిక హక్కులు అతనికి ఉండవని మన బృందం చెప్పనుంది.
అంతా సవ్యంగా పూర్తయి, అప్పగింత జరిగినట్లయితే దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెడుతూనే చోక్సీని(Mehul Choksi) అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. సీబీఐ, ఈడీ, సీఆర్పీఎఫ్లకు చెందినవారు దర్యాప్తు బృందంలో ఉన్నారు. బ్యాంకు అవకతవకల కేసులపై దర్యాప్తు నిమిత్తం సీబీఐలో ఉన్న విభాగానికి నేతృత్వం వహిస్తున్న శారదా రౌత్ ఈ బృందంలో కీలక సభ్యురాలు.
ఇదీ చదవండి : Mehul Choksi: 'ఛోక్సీని భారత్కు అప్పగించండి!'