ETV Bharat / sports

టీ20ల్లో ఆర్​సీబీ ప్లేయర్ ఫెయిల్​ - మూడు మ్యాచ్​లకు 9 రన్స్ - సింగిల్ డిజిట్​తో నెట్టుకొస్తున్న రూ. 11 కోట్ల​ స్టార్ - IND VS ENG 3RD T20I

సింగిల్ డిజిట్​తో నెట్టుకొస్తున్న రూ. 11 కోట్లు ప్లేయర్! మూడు మ్యాచ్​లకు కలిపి 13 రన్స్​! ఆందోళనలో ఆర్​సీబీ ఫ్యాన్స్​

Phil Salt IND vs ENG 3rd T20I
Phil Salt (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 29, 2025, 9:03 AM IST

IND vs ENG 3rd T20I : రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు స్కోర్ చేసి స్వల్ప లక్ష్యాన్ని టీమ్ఇండియా ముందు ఉంచింది. కానీ భారత ప్లేయర్ల వైఫల్యం వల్ల 26 పరుగుల తేడాతో ఇంగ్లీష్​ జట్టు గెలిచింది.

ముఖ్యంగా బెన్‌ డకెట్‌ (51), లివింగ్‌స్టన్‌ (43), లాంటి స్టార్ క్రికెటర్లు విజృంభించి జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఇచ్చారు. కానీ అందరి దృష్టి మాత్రం ఆ జట్టు వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్​పై పడింది. అతడి పేలవ ఫామే దానికి కారణం. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్​కే పరిమితమయ్యాడు. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో డకౌట్​గా వెనుతిరిగిన సాల్ట్, చెన్నైలో 4 పరుగులు, తాజాగా 5 పరుగులే చేసి ఉసూరుమనిపించాడు.

పవర్ ప్లేలోనూ తడబడి నిరాశపరిచాడు. తొలి రెండు టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టగా, మూడో టీ20లో హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్​గా వెనుతిరిగాడు.

ఇదిలా ఉండగా, అతడి పేలవ ఫామ్​ అటు ఇంగ్లాండ్ అభిమానులతో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్​ను తీవ్రంగా కలవరపెడుతోంది. తను ఇలాగే బ్యాటింగ్ చేస్తే అది జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇక 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ సాల్ట్‌ను రూ. 11.50 కోట్ల భారీ ధరను వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.

గత సీజన్‌లో కేకేఆర్ తరఫున అద్భుతంగా ఆడటం వల్ల ఆర్‌సీబీ ఈ వేలంలో అతడిపై ఇంట్రెస్ట్ చూపించింది. అయితే ఇప్పుడు ఈ పెర్ఫామెన్స్ చూసి ఆర్​సీబీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్​లోనూ ఇదే సాగితే ఇక అంతే అని అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇదే టీమ్​లో ఉన్న లియామ్ లివింగ్ స్టోన్ మాత్రం అద్భుతంగా ఆడి జట్టును గట్టెక్కించాడు. తొలి రెండు టీ20ల్లో విఫలమైనప్పటికీ, మూడో మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడు. దూకుడుగా ఆడి 43 పరుగులు స్కోర్ చేశాడు. దీంతో ఫిల్ ఫెయిల్ అయినా కూడా లివింగ్​స్టోన్ పెర్ఫామెన్స్​ చూసి ఆర్​సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడిని ఆర్‌సీబీ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది.

5 వికెట్లు తీసినా నో యూజ్ - మూడో టీ20లో భారత్‌ ఓటమి

చరిత్ర సృష్టించిన బుమ్రా- తొలి పేసర్​గా రికార్డ్

IND vs ENG 3rd T20I : రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు స్కోర్ చేసి స్వల్ప లక్ష్యాన్ని టీమ్ఇండియా ముందు ఉంచింది. కానీ భారత ప్లేయర్ల వైఫల్యం వల్ల 26 పరుగుల తేడాతో ఇంగ్లీష్​ జట్టు గెలిచింది.

ముఖ్యంగా బెన్‌ డకెట్‌ (51), లివింగ్‌స్టన్‌ (43), లాంటి స్టార్ క్రికెటర్లు విజృంభించి జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఇచ్చారు. కానీ అందరి దృష్టి మాత్రం ఆ జట్టు వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్​పై పడింది. అతడి పేలవ ఫామే దానికి కారణం. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్​కే పరిమితమయ్యాడు. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో డకౌట్​గా వెనుతిరిగిన సాల్ట్, చెన్నైలో 4 పరుగులు, తాజాగా 5 పరుగులే చేసి ఉసూరుమనిపించాడు.

పవర్ ప్లేలోనూ తడబడి నిరాశపరిచాడు. తొలి రెండు టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టగా, మూడో టీ20లో హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్​గా వెనుతిరిగాడు.

ఇదిలా ఉండగా, అతడి పేలవ ఫామ్​ అటు ఇంగ్లాండ్ అభిమానులతో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్​ను తీవ్రంగా కలవరపెడుతోంది. తను ఇలాగే బ్యాటింగ్ చేస్తే అది జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇక 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ సాల్ట్‌ను రూ. 11.50 కోట్ల భారీ ధరను వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.

గత సీజన్‌లో కేకేఆర్ తరఫున అద్భుతంగా ఆడటం వల్ల ఆర్‌సీబీ ఈ వేలంలో అతడిపై ఇంట్రెస్ట్ చూపించింది. అయితే ఇప్పుడు ఈ పెర్ఫామెన్స్ చూసి ఆర్​సీబీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్​లోనూ ఇదే సాగితే ఇక అంతే అని అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇదే టీమ్​లో ఉన్న లియామ్ లివింగ్ స్టోన్ మాత్రం అద్భుతంగా ఆడి జట్టును గట్టెక్కించాడు. తొలి రెండు టీ20ల్లో విఫలమైనప్పటికీ, మూడో మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడు. దూకుడుగా ఆడి 43 పరుగులు స్కోర్ చేశాడు. దీంతో ఫిల్ ఫెయిల్ అయినా కూడా లివింగ్​స్టోన్ పెర్ఫామెన్స్​ చూసి ఆర్​సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడిని ఆర్‌సీబీ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది.

5 వికెట్లు తీసినా నో యూజ్ - మూడో టీ20లో భారత్‌ ఓటమి

చరిత్ర సృష్టించిన బుమ్రా- తొలి పేసర్​గా రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.